RNI NO: APTEL/2003/10076
APRIL 2015 VOL 12 ISSUE 4
/tollywood /tollywood
TOLLYWOOD.NET
ఊ
హలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దు ,బొద్దు గుమ్మ రాశీ ఖన్నా ఇక టాలీవుడ్ ని దున్నేయనుందని అంటున్నారు . అమ్మడి నటన ఏమో కానీ అందాలతో కుర్రకారు ని కైపెక్కిస్తోంది . లిప్ లాక్ లతో, ఘాటు కౌగిలింతలతో అందాల ఆరబోత తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ భామ. తాజాగా ఈ భామ నటిస్తున్న చిత్రం ''జిల్ ''. పేరుకి తగ్గట్లుగానే ఈ చిత్రంలో తన అందాలతో జిల్ జిల్ జిగా అనిపిస్తోంది. హీరో గోపీచంద్ తో లిప్ లాక్ చేస్తూ బికినీ షో చేస్తూ విడుదలకు ముందే అంచనాలను పెంచేస్తుంది రాశీ ఖన్నా. మొత్తానికి ఏతా వాతా చెప్పొచ్చేది ఏమిటంటే రాశీ ఖన్నా తెలుగునాట జెండా పాతేసినట్లే అని .
సౌ
త్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ తమన్నా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనలో ఉంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది. దాంతో పాటు ఈ భామ సొంతంగా వైట్ అండ్ గోల్డ్ అనే పేరుతో జ్యువలరి , డ్రెస్ కలక్షన్స్ ను ప్రారంబించి బిజినెస్ లోకి కుడా దిగింది. మరో వైపు తెలుగులో జీ టివి కి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది. ఏడాది పాటు ఈ చానల్ కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుందట ? దీనికోసం రేమ్యూనరేషణ్ కుడా భారీగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ సరసన బెంగాల్ టైగర్, బాహుబలి సినిమాలలో నటిస్తుంది.
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 APRIL 2015
టాలీవుడ్ P 3
గో
పాల గోపాల ఆడియో వేడుకలో అందరి ముందు డాలీ ని నాతో మరో సినిమా చేయాలనీ అడిగాడు పవన్. అంతగా పవర్ స్టార్ ని తన దర్శకత్వ ప్రతిభ తో ఆకట్టుకున్న డాలీ కి మరో సారి పవన్ ని డైరెక్ట్ చేసే అద్భుత చాన్స్ వచ్చిందట. దాసరి నారాయణరావు నిర్మించబోయే చిత్రానికి పవన్ సూచన మేరకు డాలీ ని దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారట. పవన్ సూచన దాసరికి కూడా నచ్చడంతో డాలీ ని తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసారట. ఇక పవన్ - దాసరి చిత్రం గబ్బర్ సింగ్ 2 కి ముందుగానా లేక తర్వాత నా అనేది మాత్రం ఇంకా తేల్చి చెప్పడం లేదు. మొత్తానికి గబ్బర్ సింగ్ 2కంటే దాసరి సినిమా ముందుగా ప్రారంభం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఉ
య్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పోషించాలనేది కొంతమంది హీరోలకు కలగా మిగిలిపోయింది. అందులో చిరంజీవి కూడా ఒకరు, ఎన్నోసార్లు ఆ చిత్రం చేయాలని భావించి అందుకు కథని కూడా సిద్దం చేసుకున్నప్పటికీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే ఉంది. ఇటీవల చిరు 150వ చిత్రంగా దాన్నే తీయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సమయంలో ఈ చిత్రం చెయ్యడం కరెక్ట్ కాదని దాన్ని పక్కన పెట్టారు చిరు. ఐతే తాజాగా ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి '' చిత్రాన్నే చేయాలని పరుచూరి సోదరులు పట్టుబడుతున్నారట చిరు ని. ఆ సినిమా చిరు చేయడమే న్యాయం, చిరు చేస్తేనే దాన్ని గొప్పతనం ఏంటో తెలుస్తుందని పోరు పెడుతున్నారట. మరి చిరు పరుచూరి సోదరుల మాట విని ఆ సినిమా చేస్తాడో లేదో చూడాలి.
4 P టాలీవుడ్
''చందమామ కథలు ''చిత్రానికి జాతీయ నేనుఅవార్డ్నటించిన రావడం నమ్మలేక పోతున్నాను ''ఓ మై గాడ్''
అంటూ ఆశ్చర్య పోతోంది మంచు లక్ష్మి. చందమామ కథలు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డ్ రావడంతో ఆ విషయం మంచు లక్ష్మి కి తెలియడంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. నా సినిమాకి జాతీయ అవార్డ్ వచ్చిందోచ్ అంటూ గాల్లో తేలిపోతోంది. విభిన్న కథాంశం తో తెరకెక్కిన చందమామ కథలు ప్రేక్షకాదరణ పొందనప్పటికీ కేంద్ర ప్రభుత్వ అవార్డ్ లభించడం మాత్రం అందరినీ సంతోషానికి గురి చేసింది.
గో
విందుడు అందరి వాడెలే సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటుంది. శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ స్టంట్ మెన్ గా కనిపిస్తాడట. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాకు మై నేమ్ ఇస్ రాజు అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలిసింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం చరణ్ బెంగుళూర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే ఈ పాత్ర కోసం కొంచెం సన్నగా కూడా కనిపిస్తాడట. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
టాలీవుడ్ P 5
)
బా
టెంపర్
చిత్రంలో తొలగించిన కొన్ని సన్నివేశాలను దర్శకులు పూరి జగన్నాద్ యుట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ తొలగించిన సన్నివేశాలను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. క్లిక్ ల మీద క్లిక్ లతో ఆ సన్నివేశాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం తో ఇలా తొలగించిన కొన్ని సన్నివేశాల్లో రెండు కొన్నింటిని మాత్రమే యూ ట్యూబ్ చానల్ లో అప్ లోడ్ చేసాడు పూరి . ఎన్టీఆర్ కు గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేని సమయంలో వచ్చిన ఈ టెంపర్ దుమ్ము లేపి మంచి హిట్ అయ్యింది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు టెంపర్ తో సంతోషంగా ఉన్నారు.
6 P టాలీవుడ్
లకృష్ణ తాత అయిన విషయం తెలిసిందే, బాలయ్య కూతురు బ్రాహ్మణి ఉగాది రోజున పండంటి మగబిడ్డ కి జన్మ నిచ్చింది. దాంతో బాలయ్య అభిమానులే కాక టిడిపి శ్రేణులు కూడా సంతోషంలో మునిగి తేలారు. ఐతే బాలయ్య - చంద్రబాబు లు తాతయ్య లు అయ్యారు అనే విషయం తెలుసు కానీ వారి మనవడు ఎలా ఉన్నాడో మాత్రం తెలియదు. అందుకే అందరికీ తెలియడానికి బ్రాహ్మణి తన పేస్ బుక్ లో తనయుడి ఫోటో ని షేర్ చేసింది. ఇక లైక్ లు షేర్ ల మీద చూడండి బాలయ్య మనవడి కి లైక్ ల మీద షేర్ లు, కామెంట్ల మీద కామెంట్లు వెరసి బాలయ్య మనవడు సోషల్ మీడియాలో మోత మొగిస్తున్నాడు.
క
థాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. స్వాతి, పావని సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహించనున్నారు.
ద
ర్శకుడు రాజ కిరణ్ మాట్లాడుతూ - ''ఏప్రిల్ 6న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరపనున్నాం. అదే నెల 13 నుంచి 25 వరకు తొలి షెడ్యూల్ జరుపుతాం.. ఓ శక్తిమంతమైన కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో స్వాతిది టైటిల్ రోల్. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకూ స్వాతి చేయలేదు. తనది అద్భుతమైన పాత్ర. నటిగా తనలోని మరో మంచి కోణాన్ని ఆవిష్కరించే చిత్రం అవుతుంది'' అని చెప్పారు.
ఈ
చిత్రానికి మాటలు: రాజా, స్ర్కీన్ ప్లే: శ్రీనివాస్ వెలిగొండ, సంగీతం: కమ్రాన్, కెమెరా: రవికుమార్ సానా, నిర్మాతలు: ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్, రచన-దర్శకత్వం: రాజ కిరణ్.
టాలీవుడ్ P 7
సం
దడే సందడి, ఖుషి ఖుషీగా, స్వాగతం, ఏక్నిరంజన్ వంటి సూపర్హిట్చిత్రాలతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ఆదిత్యరామ్ గ్రూప్ అధి నేత ఆదిత్యరామ్. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గానే కాకుండా చెన్నయ్లో ఒక భారీ స్టూడియోను నిర్మించి స్టూడియో అధినేతగా కూడా తన సక్సెస్ను కొనసాగిస్తున్నారు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ మరోవైపు సినిమాలను నిర్మిస్తూనే సినిమా రంగంలో ఏదైనా డిఫరెంట్గా చేయాలనే తలంపుతో ఆదిత్య గ్రూప్స్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చెన్నైలోని ఉతాండి, ఈస్ట్కోస్ట్ రోడ్లో నిర్మించిన ఈ స్టూడియో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆప్ ది బెస్ట్స్టూడియోగా నిలిచింది.
ఈ
సందర్భంగా ఆదిత్యరామ్ స్టూడియో అధినేత ఆదిత్యరామ్ మాట్లాడుతూ ` ‘‘బిజినెస్మేన్అయిన నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి. అందుకే సినిమారంగంలో ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నాలుగు మంచి సినిమాలు నిర్మించాను. సినిమారంగానికి ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు అన్ని అధునాతన సౌకర్యాలతో ఒక స్టూడియో నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అందులో భాగంగా చెన్నయ్లోని ఉతాండి, ఈస్ట్కోస్ట్ రోడ్లో ఈ భారీ స్టూడియోను నిర్మించడం జరిగింది. ఈ స్టూడియో ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఇందులో ముఖ్యంగా రెండు ఫేజ్లుంటాయి. మొదటి భాగంలో సాంగ్స్ చిత్రీకరించుకునేందుకు వీలుగా వుండే ఒక సెట్వుంటుంది. మరో ఫేజ్లో స్ట్రీట్సెట్, టెంపుల్, చర్చి, మసీద్ వంటి సెట్స్ వేసుకోవడానికి అనువుగా వుంటుంది. మా స్టూడియోలో దర్శకనిర్మాతల అవసరాల మేరకు అద్భుతమైన సెట్స్ను వేసే ఆర్ట్ డైరెక్టర్స్ ఉంటారు. అందుకే ఈ స్టూడియోలో నిర్మించిన ఏ సెట్కైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకు చాలా ఉదాహరణలు వున్నాయి. యూనివర్సల్ హీరో కమల్హాసన్ తెరకెక్కించిన దశావతారం చిత్రం కోసం వేసిన హిస్టారికల్ పార్ట్ సెట్ సినిమాకే పెద్ద హైలైట్ అయింది. అలాగే ఆవారా హీరో కార్తీ, సెల్వరాఘవన్ కాంబినేషన్లో రూపొందిన విజువల్ వండర్ యుగానికొక్కడు చిత్రానికి సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను మా స్టూడియోలోనే చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా హన్సిక, శ్రీదేవి, శృతిహాసన్ కాంబినేషన్లో శింబుదేవన్ దర్శకత్వంలో ‘పులి’ చిత్రాన్ని మా స్టూడియోలోనే చిత్రీకరిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సెట్స్కి ఉన్న ప్రాముఖ్యతను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి అవసరానికి తగ్గట్టుగానే మా స్టూడియోలో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. ఈ సినిమా కోసం స్టార్టింగ్లో వేసిన సెట్ను చూసి ఒన్ ఆఫ్ ది బెస్ట్ సెట్ అని అందరూ ప్రశంసించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పటికే మా స్టూడియో అన్ని అధునాతన సౌకర్యాలతో దర్శకనిర్మాతల పాలిట స్వర్గధామంగా వుంది. భవిష్యత్తులో ఈ స్టూడియోకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా తీర్చిదిద్దబోతున్నాం’’ అన్నారు.
8 P టాలీవుడ్
బా
లీవుడ్ హాట్ భామ అనుష్క శర్మ అంటే అందరికి హాటే ? ఈ భామ ఏ సినిమాలో చేసిన ఆ సినిమాలో కుర్రకారుని మెత్తెక్కిస్తుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు బోంబే వెల్వెట్ అనే సినిమాలో నటిస్తుంది రన్భీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క , రన్భీర్ ల మద్య దాదాపు ఏడూ ముద్దు సన్నివేశాలు ఉన్నాయట. అవికూడా ఘాటు లిప్ లాక్ సీన్స్ కావడం విశేషం. ఈ ముద్దులపై అడిగితె దానికి అనుష్క సమాధానం ఇస్తూ... నాకు, రన్భీర్ కు ఇద్దరికీ వేరు వేరుగా లవర్స్ ఉన్నారు కాబట్టి మా ఇద్దరిమద్య రొమాన్స్ అలా కుదిరింది. సినిమాలో సన్నివేశం కోసం రన్భీర్ చాలా కేర్ తీసుకుంటాడు. అందుకే మామధ్య ఈ కెమిస్ట్రీ కుదిరింది. అయితే ఈ లిప్ లాక్ సీన్స్ ఈరోజుల్లో సాధారణమే అంటూ కామెంట్ చేసింది. మరి ఈ ముద్దు సన్నివేశాల్లో రెచ్చిపోయిన అనుష్క శర్మ ను చూసి విరాట్ ఎలా ఫీలవుతాడు అన్నదే అసలు సమస్య ?
టాలీవుడ్ P 9
సూ
పర్ స్టార్ రజనీకాంత్ చేసింది ముమ్మాటికీ తప్పే అంటున్నాడు కమల్ హాసన్. ఇంతకీ రజనీ చేసిన తప్పేంటో తెలుసా .......... ఇటీవల రజనీ నటించిన ''లింగ '' చిత్రం ఘోర పరాజయం పొందడంతో నష్టపోయిన పంపిణీదారులు నష్ట పరిహారాన్ని ఇవ్వాలని నానా రభస చేయడంతో స్పందించిన రజనీ కొంతమొత్తం చెల్లించారు. ఐతే ఆ పనిని తప్పు బడుతున్నాడు కమల్ ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇదొక ప్రహసనంగా మారుతుందని, ఈమధ్య ఫెయిలైన సినిమా తిరిగి డబ్బులు ఇవ్వాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు ................... రజనీ ఈ సంప్రదాయానికి తెరలేపినా మిగతావాళ్ళు దాన్ని ఫాలో కావాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అసలు విషయం ఏమిటంటే కమల్ నటించిన రెండు చిత్రాలు ప్రస్తుతం రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. దాంతో వాటి పరిస్థితి ఏంటో అని ఇలా అంటున్నట్లున్నారు కమల్.
రే
య్ భామ సయామీ ఖేర్ పై మనసు పారేసుకున్నాడు విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి . నిన్న జరిగిన పవనిజం పాట వేడుకలో పాల్గొన్న పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ సయామీ బాగుందని , పాపా ! బాగున్నావ్ తల్లీ అంటూ ఆ భామని పదే పదే చూస్తూ చాలా బాగున్నావ్ ............. చౌదరి కళ్ళలో పడ్డావ్ ఆయన లో రాజ్ కపూర్, రాఘవేంద్రరావు ఉన్నారని అంతటి రొమాంటిక్ దర్శకుడని తప్పకుండా ఈ సినిమా హిట్ అయి నీకు మంచి పేరు తెస్తుందని అంటూనే ఇటాలియన్ కళ్ళున్న అందాల భామ సయామీ అంటూ తన మనసు పారేసుకున్నాడు .
10 P టాలీవుడ్
అ
వును ఈ మాట వింటుంటే విద్దురంగా ఉన్నా ఇది నిజమే ? పదేళ్ళ వయసుకే ప్రేమాయణం నడిపిన ఈ చిన్నది ఎవరా అని అనుకుంటున్నారా ? ఇంకెవరు బాలీవుడ్ హాట్ భామ అలియ భట్ ??? ఈ అమ్మడు తనకు పదేళ్ళ వయసున్నప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డాను అని చెబుతుంది. అయితే ఈమె ప్రేమలో పడింది ఏ క్లాస్ లో అని అనుకుంటున్నారా ? క్లాస్ లో కాదండి బాబు షాహిద్ కపూర్ ను చూసట !! అవును ఇష్క్ విష్క్ సినిమాలో షాహిద్ ను చూసి ప్రేమలో పడిపోయాను అని చెప్పింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం షహీద్ తో కలిసి షాన్ దార్ చిత్రం లో నటిస్తుంది. ఈమె మాటలు వింటుంటే ప్రేమలో పడింది మాత్రం నిజమే కాని సినిమా కోసం షహీద్ పేరు చెప్పి ఉంటుంది అని బాలీవుడ్ లో గుసగులు వినిపిస్తున్నాయి.
ప్ర
స్తుతం కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి ఊపుమీదున్న హాట్ భామ హన్సిక ప్రస్తుతం 3 సినిమాల్లో నటిస్తుంది. సినిమాలతో పాటు ఈ అమ్మడికి బీచ్ లో ఎంజాయ్ చేయడం, హాలిడేస్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమట! తన ప్రోపెషన్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తుంది. అయితే లేటెస్ట్ గా ఓ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే హన్సిక అర్థరాత్రి లో ఏమి చేస్తుంది అనే విషయం ? ఆ కంగారు పడకండి ... అసలు విషయం ఏమిటంటే ఈ భామ అర్థ రాత్రిళ్ళు బైక్ పై నగరం లో ఒంటరిగా బైక్ రైడింగ్ చేస్తుందట. షూటింగ్ అయిపోయిన తరువాత రోజు రాత్రిళ్ళు నగరాన్ని అలా అలా చుట్టేస్తుందట. ఈ విషయం పై ఈ భామ స్పందిస్తూ ... ఇలా బైక్ పై తిరిగితే చాలా హ్యాపీ గా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నా అంటూ చెబుతుంది. అది సంగతి ??
టాలీవుడ్ P 11
ప
కృ
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్య పుట్టినరోజు సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఓవైపు హీరోగా మరోవైపు రాజకీయ పార్టీ అధినేతగా వ్యవహారాలు చక్కబెడుతూనే పిల్లల కోసం కూడా తన సమయాన్ని కేటాయిస్తున్నాడు. పవన్ - రేణు దేశాయ్ ల కు ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే, ఆ ఇద్దరు కూడా మాజీ భార్య రేణు దేశాయ్ వద్దే పెరుగుతున్న విషయం కూడా పాఠకులకు విదితమే. కాగా తన ముద్దుల కూతురు ఆద్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసి వాళ్లతో కొద్దిసేపు సంతోషంగా గడపడానికి పూణే వెళ్ళడం బాగానే ఉంది. ఐతే ఈ విషయం బయటకి పొక్కేది కాదు ఎందుకంటే రేణు దేశాయ్ ఈ విషయాన్నీ ట్వీట్ చేయడంతో భయటి ప్రపంచానికి తెలిసింది.
ష్ణుడు హీరోగా శ్రీశివపార్వతి కంబైన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ‘నాకూ ఓ లవరుంది’ చిత్రాన్ని నిర్మించి మొదటి చిత్రంతోనే మంచి అభిరుచి వున్న నిర్మాతగా ప్రేక్షకుల్లోనూ, చిత్ర పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు నిర్మాత కె.సురేష్బాబు. రెండో ప్రయత్నంగా ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ని తీసుకొని ‘దక్షిణ మధ్య భారతజట్టు’ పేరుతో ఓ మెసేజ్ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో వుండగానే ఇప్పుడు ప్రొడక్షన్నెం.3గా ఓ విభిన్న చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు కె.సురేష్బాబు.
ఈ
సందర్భంగా కె.సురేష్బాబు మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలన్న ఉద్దేశంతోనే శ్రీశివపార్వతి కంబైన్స్ సంస్థను ప్రారంభించాం. మొదటి ప్రయత్నంగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించాం. రెండో చిత్రంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తెరకెక్కిస్తున్నాము. శ్రీశివపార్వతి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ చిన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తున్నాము. అలాగే చిన్న సినిమాల ఆడియోలను రిలీజ్చేయడానికి ఆడియో కంపెనీలు ముందుకు రాని టైమ్లో హేమాస్మీడియా పేరుతో ఓ ఆడియో కంపెనీని ప్రారంభించి చిన్న సినిమాల ఆడియోలను రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మా బేనర్లో మూడో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాము. బాలీవుడ్లో ఏక్తా కపూర్ దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసిన ప్రశాంత్శర్మను ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం చేస్తున్నాం. ప్రశాంత్శర్మ లండన్లో కూడా వర్క్షాప్స్నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్బాగా నచ్చి ఈ చిత్రం చేస్తున్నాను. మేలో ఈ చిత్రం షూటింగ్ప్రారంభిస్తున్నాము. ప్రస్తుతం స్క్రిప్ట్వర్క్జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో, హీరోయిన్లతో ప్లాన్చేస్తున్నాం. అలాగే టాలీవుడ్లోని టాప్ టెక్నీషియన్స్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’’ అన్నారు.
12 P టాలీవుడ్
పో
అ
త్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగులో రూపొందుతున్న చిత్రం బాహుబలి. రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మే 15న విడుదల చేస్తున్నట్టు జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు ఈ సినిమాకోసం ఇంకా ప్యాచ్ వర్క్ చాలా ఉందట. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో లో షూట్ చేస్తున్నారు. మరో వైపు తమిళ, హిందీ బాషలలో కుడా భారీగానే విడుదల ప్లాన్ చేసారు. మొత్తంగా ఈ సినిమా వర్క్ ఇంకా చాలానే మిగిలి ఉంది కాబట్టి మే 15 వరకు రెడీ అవుతుందో లేదో అనే విషయం ఆపి యూనిట్ వర్గాల్లో కుడా క్లారిటీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా అనుకున్న డేట్ కు వచ్చేది కష్టమే
ర్న్ భామ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన హాట్ భామ సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్ హాట్ ఫేవరట్ గా మారింది. సన్నీ తమ సినిమాలో కనిపిస్తే చాలానే అబిప్రాయం లో ఉన్నారు నిర్మాతలు. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కుడా ఈ అమ్మడికి క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఏక పహేలి లీల సినిమాలో నటిస్తున్న ఈ భామ త్వరలోనే ఓ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యింది. సినిమాతో పాటు టివి లో కూడా నిర్మాతగా తన ప్రొడక్షన్ హౌస్ పై సినిమాలు, టివి షోస్, లాంటివి నిర్మిస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ఏక్ పహేలి లీల సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తరువాత తన బ్యానర్ ని ప్రారంబించనుందట.
అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రప్రంచ వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి రేపిన ఈ సినిమా విడుదల గురించి మరి రాజమౌళి కన్ఫర్మ్ చెయ్యాలి.
టాలీవుడ్ P 13
తా
జాగా చరణ్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి సంగీత దర్శకుడు మారాడు. ఇంతకుముందు తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ని ఎంపిక చేసినప్పటికీ ప్రస్తుతం అనిరుద్ తమిళనాట బిజీ గా ఉండటం వల్ల అతడి స్థానంలో తమన్ ని ఎంపిక చేసారు . ఇంతకుముందు తమన్ చరణ్ హీరోగా రూపొందిన ''నాయక్ '' సినిమాకి సంగీతం అందించాడు. పైగా ఆ చిత్రాన్ని నిర్మించింది కూడా డివివి దానయ్య కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది . శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది .
ఫ
లానా టైం వరకు ఆయన సిఎం, ఈయన పిఎం గా ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కానీ మీరెప్పుడు సిఎం అవుతారు అని నేనడుగుతున్నాను , మీరు అడగండి అంటూ పవన్ ఫాన్స్ ని ఉద్దేశించి అన్నారు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ''రేయ్ ''చిత్రంలోని పవనిజం
14 P టాలీవుడ్
సాంగ్ విడుదలకు ముఖ్య అతిథి గా హాజరైన ఈ పీపుల్స్ స్టార్ పవన్ సిఎం కావాలని అన్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, జనసేన అనే రాజకీయ పార్టీని పెట్టారు కాబట్టి సిఎమ్ కూడా అవ్వండి ప్రజలకు సేవ చేయండి, ఎవరో సిఎమ్ గా ఉండాలని కోరుకోకండి మీరు సిఎమ్ కండి అని అన్నారు నారాయణ మూర్తి .
తె
లుగు వారి అసలు సిసలైన పండుగ ఉగాది. ఆ ఉగాది పర్వదినాన నిండుగా కొత్త బట్టలు వేసుకొని తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి కానీ చార్మింగ్ గర్ల్ ఛార్మి మాత్రం బికినీ వేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ గ్లాస్ ని ముద్దుపెట్టుకుంటూ కైపెక్కిస్తూ ఉగాది శుభాకాంక్షలు అని చెబుతోంది . ఛార్మి ఉగాది శుభాకాంక్షలు చూసినవాళ్లు దీని సిగ దరగ ఉగాది రోజు ఇలా బికినీ వేసి మందు కొడుతూ ఉగాది శుభాకాంక్షలు చెప్పడం ఏంటని ఆశ్చర్య పోతున్నారు. చేతిలో సరైన సినిమాలు లేని ఈ భామ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ''జ్యోతి లక్ష్మి ''చిత్రంలో నటిస్తోంది .
మ
లయాళంలో ప్రతిభ ఉన్న హీరోయిన్ లు ఎందరో ఉండగా పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారని మలయాళ దర్శకుల పై కోపంగా ఉంది హీరోయిన్ పూర్ణ. తెలుగులో సీమ టపాకాయ్ ,లడ్డుబాబు, అవును, అవును2, తదితర చిత్రాల్లో నటించిన పూర్ణ తెలుగు తో పాటు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నప్పటికీ తన పుట్టినిల్లు అయిన మలయాళంలో మాత్రం అవకాశాలు రావడం లేదని ఆగ్రహంగా ఉంది. మలయాళంలో రెండు చిత్రాల్లో నటించినప్పటికీ సరైన చాన్స్ రాకపోవడంతో దానికి తోడూ ఐటెం సాంగ్ చేయమని పలు ఆఫర్లు వస్తుండటంతో చిరాకు వస్తోందట ఈ భామకి .
టాలీవుడ్ P 15
ప ్ర
స్తుతం వెంకటేష్ రెండు సినిమాల్లో నటించే సన్నాహాల్లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన దశరధ్ దర్శకత్వం లో రూపొందే సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది . ఈ సినిమా తో పాటు ఇటీవలే అవును 2 చిత్రాన్ని రూపొందించిన రవిబాబు దర్శకత్వం లో మరో సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ను రవి బాబు పూర్తి చేసాడని, వెంకటేష్ కి కుడా త్వరలో కథ చెప్పనున్నాడట. నిజానికి తన మొదటి సినిమా వెంకటేష్ తోనే చేయాల్సి ఉండేదని , కాని అది కుదరలేదని చెప్పాడు రవిబాబు . సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
‘ద
శావతారం’, ‘విశ్వరూపం’ వంటి చిత్రాల తర్వాత కమల్ హాసన్ చేస్తున్న మరో విలక్షణమైన చిత్రం ‘ఉత్తమవిలన్’. తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా ప్రై.లి., రాజ్కమల్ పిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్స్పై ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి.బ్యానర్పై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 17న వరల్డ్వైడ్గా విడుదలకానుంది . ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మా ‘ఉత్తమ విలన్’ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమా మీద ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వారి ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా సినిమా చాలా ఎక్స్ట్రా ర్డినరీగా వుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా సి.కె.ఎంటర్టైన్మెంట్స్బేనర్లో ‘ఉత్తమ విలన్’ మరో బిగ్గెస్ట్హిట్అవుతుందన్న నమ్మకం నాకు వుంది అన్నారు.
16 P టాలీవుడ్
ఏప్రిల్17న
రు
నా
ని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నటించిన మలయాళ కుట్టి మాళవిక నాయర్ వయసు ఎంతో తెలుసా ............... జస్ట్ 17ఏళ్లే నట ! అవును ఆమె వయసు విని షాక్ అయ్యాడట హీరో నాని . 1998 లో జన్మించిన మాళవిక నాయర్ ప్రస్తుతం ఇంకా చదువుకుంటోంది . 17ఏళ్ల ప్రాయమే అయినప్పటికీ చూడటానికి పెద్ద అరింద లా కనబడటం తో నాని సరసన హీరోయిన్ గా తీసుకున్నారు . మొన్న ఉగాది రోజున రిలీజ్ అయిన ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో సంతోషంగా ఉన్నారు చిత్ర యూనిట్ . ఐతే నాని కి ఒక్క విషయంలో మాత్రమే షాక్ అట ! అదే ఆ అమ్మాయి వయసు 17 అని .
ద్రమదేవి వంటి చారిత్రాత్మక చిత్రంలో ఐటెం సాంగ్ ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా ? లేదు కానీ అలా ఊహించకపోతే మీరు పప్పులో కాలేసినట్లే . ఎందుకంటే రుద్రమదేవి చిత్రంలో హాట్ భామ హంసా నందిని తో వీర లెవల్లో ఓ ఐటెం సాంగ్ చేయించాడు గుణశేఖర్ . అత్యంత ప్రతిస్టాత్మకంగా గుణశేఖర్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా రిలీజ్ కానుంది కాగా నిన్న వైజాగ్ లో మూడు పాటలను రిలీజ్ చేసారు వాటిలో హంసా నందిని పై చిత్రీకరించిన ఐటెం సాంగ్ కుర్రకారు ని ,మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది . ఈ ఐటెం సాంగ్ లో హంసా నందిని తో పాటు పాప్ సింగర్ బాబా సెహెగల్ ల పై చిత్రీకరించారు గుణ .
టాలీవుడ్ P 17
ని
న్న మొన్నటి వరకు ఎక్స్ పోజింగ్ కు ఆమడ దూరంలో ఉన్న స్పెషల్ భామ నిత్యా మీనన్ తాజాగా ఎక్స్ పోజ్ చేయడానికి రెడీ అయినట్లుంది . ఇప్పటికే రుద్రమదేవి చిత్రంలో కాస్త గ్లామర్ గా కనిపించిన ఈ భామ తాజాగా అల్లు అర్జున్ తో నటిస్తున్న చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి లో గ్లామర్ డోస్ పెంచి పిక్కల పైదాకా అందాలను చూపిస్తూ మతిపోగోడుతోంది . ఈ స్టిల్ చూసినవాళ్లు నిత్య అందాలను చూస్తూ నోరెళ్ళ బెడుతున్నారు. పెద్ద సినిమా కావడం బన్నీ హీరో కావడం ,ఇంకా త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అందాల ప్రదర్శనకు పూను కున్నట్లుంది ఈ భామ . సన్నాఫ్ సత్యమూర్తి లో నిత్య అందాలు మరింత ఊపునివ్వడం ఖాయంగా కనిపిస్తోంది .
18 P టాలీవుడ్
|| ఇంటర్
నెట్ లో బ్లూ ఫిల్మ్స్ అందునా సన్నీ లియోన్ పోర్న్ చిత్రాలు ఎక్కువగా చూస్తున్నది భారతీయులే అని లెక్కలు తేల్చిచెప్పినప్పటికీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మాత్రం చెబుతున్న మాట విని అవాక్కవ్వాల్సిందే . భారతీయుల్లో సెక్స్ యావ తక్కువే అని ,ఎంతసేపు భార్య ,పిల్లలు ,కుటుంబం అంటూ ఆ విషయాలు పట్టించు కుంటూ ఆ పనుల్లో పడిపోతారని ,సెక్స్ గురించి పట్టించుకునే ఓపిక తక్కువని టక్కున అనేసింది . భారతీయ మగాళ్ళ కు సెక్స్ పిచ్చి లేదని .............. ఎంతసేపు సంపాదన సంపాదన అంటూ తిరుగుతారని సెలవిస్తోంది .సన్నీ మాటతో భారతీయ మగాళ్ళ మైండ్ బ్లాక్ అయినట్లే ! ఇక ఈ పోర్న్ భామకి రణబీర్ సింగ్ అంటే చాలా చాలా ఇష్టమట ! అతడు చాలా హాట్ గా ఉంటాడని అంటోంది .
కొం
డా సురేఖ మాట్లాడుతూ ‘‘ పోరాటాలకు మారుపేరైన రుద్రమదేవి చరిత్రను సినిమాగా తెరకెక్కించిన గుణశేఖర్ గారిని అభినందిస్తున్నాను. సినిమాని 2డి, 3డి టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు. నేను సినిమా చూసి చాలా కాలమైంది. ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.
త
లసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ట్రీకి పూర్తి సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాను. ఈ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సి
రివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘తెలుగుజాతిని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన రుద్రమదేవి చరిత్ర మన హృదయాలనుండి చెరగలేదు. ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న రుద్రమదేవి కథను సినిమా తెరకెక్కించాలని కళ కన్న దార్శనికుడు, దర్శకుడు గుణశేఖర్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
ఉ
ప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘‘గుణశేఖర్, దిల్ రాజు, కృష్ణంరాజు, అనుష్క సహా టీమ్ ను అభినందిస్తున్నాను’’ అన్నారు.
రె
బల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ ‘‘అనుష్క చాలా బాగా నటించింది. గోనగాన్నారెడ్డి పాత్రను 30 ఏళ్ల క్రితం సినిమాగా తీయాలనుకున్నాను. ఇప్పుడు గుణశేఖర్ ఆ రోల్ ను ఈ సినిమాలో చూపించాడు. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
గు
ణశేఖర్ మాట్లాడుతూ ‘‘నేను ఎనిమిదవ తరగతి నాన్ డిటెయిల్ లో రుద్రమదేవి చరిత్రను చదివి ఇనస్ఫైర్ అయ్యాను. నేను 9 ఏళ్లుగా ఈ సినిమాని తెరకెక్కించాలని ట్రై చేస్తున్నన్నాను. అవతార్ సినిమా చూసి స్టీరియోస్కోపిక్ త్రీడీలో చూపించాలని నిర్ణయించుకున్నాను. ఇది మన తెలుగు వాళ్ల కథ. ప్రపంచంలోని తెలుగువాళ్ల కథ. మార్కోపోలో అనే ఇటాలియన్ టూరిస్ట్ కాకతీయుల గురించి, రుద్రమదేవి పరిపాలన గురించి ప్రస్తావించాడు. అంత ఉత్తేజమైన కథ. ఝాన్సీ రాణి, ఎలిజిబెత్ గురించి తెలిసిన మనకు రాణి రుద్రమదేవి గురించి తెలియదు. తెలియజేసే ప్రయత్నమే నాది. 70 కోట్ల బడ్జెట్ తో రుద్రమదేవి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగువాళ్ల రాణి అని మనం గర్వించేలా ఉంటుంది. నాతో పాటు గుణా టీమ్ వర్క్స్
కలిసి పనిచేశారు. అల్లుఅర్జున్ గోనగన్నారెడ్డి పాత్రను నేను చేస్తానంటూ ముందుకు వచ్చారు. గొప్ప సినిమా ప్రేమికుడు కాబట్టే ఈ పాత్ర చేయడానికి ముందుకు వచ్చాడు. అందుకు అల్లుఅర్జున్ కి రుణపడ్డాం. అనుష్క ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. రాణి రుద్రమ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తుంటే అనుష్కలా ఉంటుందనిపిస్తుంది. జోదా అక్బర్ కథ కంటే రాణి రుద్రమదేవి సినిమా చేయడం నా అదృష్టమని నీతాలూల్లా అన్నారంటే ఆమె ఎంత ఇన్ స్ఫైర్ అయ్యారో తెలుస్తుంది. రుద్రమదేవి అనే సినిమాని నిర్మించడానికి మేమందరం కూళీల్లాగా పనిచేశాం. బన్ని క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు. మాస్ యాంగిల్, యూత్ ఫుల్ గా కనపడతాడు’’ అన్నారు.
అ
నుష్క మాట్లాడుతూ ‘‘షూటింగ్ చేస్తున్నప్పుడు ఇది నా పుట్టిన ఊరులా మారిపోయింది’’ అన్నారు.
ది
ల్ రాజు మాట్లాడుతూ ‘‘అనుష్కను అరుంధతిలో ఎలా చూస్తారో ఈ సినిమాలో అంతకంటే ఎక్కువగా, బాగా కనపడుతుంది. రుద్రమదేవి కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమాలో బన్ని గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడని తెలిసింది. చాలా హ్యాపీగా అనిపించింది. గుణశేఖర్, బన్ని, అనుష్క కారణంగా సినిమా పెద్ద రేంజ్ లో తెరకెక్కింది. బన్ని ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయింది’’ అన్నారు.
స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ‘‘అనుష్కనే స్లిస్ఈటై సినిమాకి హీరో. అనుష్క కాబట్టి ఈ సినిమా
అయ్యింది. తన వల్లే ఈ సినిమా పూర్తయింది. వేరెవరితో ఈ సినిమా పూర్తి కాదు. కృష్ణంరాజు, రానా సహా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప టెక్నిషియన్స్ పనిచేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ సినిమా చేయడానికి ప్రథమ కారణం నాకు తెలుగు సినిమా అంటే ప్రాణం. నా వల్ల తెలుగు సినిమా ఒక మెట్టు ఎక్కుతుందంటే, నాకు అంత కంటే అదృష్టం ఇంకోటి లేదు. తెలుగు సినిమా మెట్టు ఎక్కితే గర్వపడతాను. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ హిస్టారికల్ మూవీ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. కానీ గుణశేఖర్ గారే నిర్మించారు. ఇవాళ సినిమా సెకండ్ అంటూ డబ్బే ఫస్ట్ అంటున్నారు. కానీ గుణశేఖర్ గారికి మాత్రం సినిమాయే ఫస్ట్. ఎప్పుడూ సినిమా కోసమే
నిలిచారు. సినిమాపై ప్యాషన్ ఉన్న దర్శకుడు. అంతటి ఫ్యాషనేట్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. ఈ సినిమా ఆయన కోసమే విజయం సాధించాలి. మనం ఎక్కడి నుండి వచ్చాం. ఎవరి వల్ల వచ్చాం. మనం ఎక్కడికి వెళ్లినా ఆ హిస్టరీని మరిచిపోకూడదు. నాకు ఓ హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవిగారు. ఆయన
ఎండలో కష్టపడితే ఆయన నీడ నుండి మేం పైకొచ్చాం. నాకు ఎవరైనా చిరంజీవిగారి తర్వాతే. ఎవరినైనా హర్ట్ చేయడం చాలా ఈజీ, వాళ్ల హార్ట్ లోకి వెళ్లడం చాలా కష్టం బన్ని అని చిరంజీవిగారు ఒకసారి నాతో అన్నారు. నన్ను ఇన్ని మెట్లు ఎక్కించిన మెగాభిమానులకు ధన్యవాదాలు’’ అన్నారు.
టెంపర్
తరువాత ఎన్టిఆర్ హీరోగా రూపొందే చిత్రం ఈ నెల 17 న ప్రారంబం కానుంది. సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టిఆర్ గెటప్ చాలా స్టైలిష్ గా ఉంటుందట ? దానికోసం ఎన్టిఆర్ ఇప్పటికే జుట్టు , గడ్డం బాగా
22 P టాలీవుడ్
పెంచాడట ! సుకుమార్ సినిమాల్లో హీరోకి నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు గెటప్ కుడా కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కోసం కుడా గెటప్ లో మార్పు చేస్తున్నాడు. మరి ఆ కొత్త లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి.
ఎ
ప్పుడైతే ఈటివి జబర్దస్త్ టివి షో లో చేసిందో అప్పటినుండి హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత ఆ టివి షో నుండి తప్పుకున్న కుడా ఈ అమ్మడి క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం పలు టివి షో లలో చేయడమే కాకుండా మరో వైపు సినిమాల్లో కూడా నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈమె నాగార్జున హీరోగా రూపొందుతున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నటిస్తుంది. దాంతో పాటు అడవి శేష్ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తుంది. దాంతో పాటు మరో రెండు సినిమాల్లో అవకాశం దక్కింది. అంతే కాదు మరో వైపు కమర్షియల్ యాడ్స్ లో కుడా చేయడానికి బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయట. యాంకరింగ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఈ హాట్ భామ జోరు బాగా పెరిగింది అని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
సూ
పర్ స్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న మహేష్ బాబు తో నటించాలని ఎవరికైనా ఉంటుంది. నిన్నటి తరం హీరోయిన్ లనుండి నేటి తరం హీరోయిన్స్ వరకు అతనితో నటించాలని కోరుకుంటారు. లేటెస్ట్ గా అప్పట్లో హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించిన హాట్ భామ నగ్మా మహేష్ పై కామెంట్ చేసింది. కామెంట్ చేసిందంటే నెగెటివ్ అనుకునేరు ... కాదండీ బాబు పాజిటివ్ గానే. ఇంతకి విషయం ఏమిటంటే ఇటీవలే ఈ టివి లో రాఘవేంద్రరావు పై వస్తున్న సౌందర్య లహరి కార్యక్రమం లో పాల్గొంది నగ్మా , సినిమాలు తగ్గిపోయిన తరువాత ఈ అమ్మడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాని అనుకున్నంత క్రేజ్ రాకపోవడం తో మల్లి సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నట్టుంది. అయితే ఈ కార్యక్రమం లో పాల్గొన్న నగ్మను మీరు ఇప్పుడు హీరోయిన్ అయితే ఏ హీరో తో నటించడానికి ఎక్కువ ఇష్టపడతారు అంటూ అడిగింది ?.... దానికి ఆమె వెంటనే సమాధానం ఇస్తూ మహేష్ బాబుతో నటించాలని కోరుకుంటా అంటూ చెప్పేసింది. నిజంగా మహేష్ మంచి నటుడు . అతనితో నటించడం గొప్ప విషయం అంటూ చెప్పేసింది. సో నగ్మా కు మరో సారి హీరోయిన్ గా చాన్స్ ఇస్తే మహేష్ బాబును అల్లుకుపోతుందన్నమాట. ఏదైనా మహేష్ క్రేజ్ అలాంటిది మరి ?
టాలీవుడ్ P 23
ని
ప్ర
ద్ ప్రొడక్షన్ పై ఆకాష్ పూరి, ఉల్కా గుప్తా సా హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. రమేష్ ప్రసాద్ నిర్మాత. రాజ్ మాదిరాజు దర్శకుడు. పాల్వంచ, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... చిత్రనిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘ప్రసాద్ ప్రొడక్షన్ బ్యానర్ నుండి వస్తోన్న ప్రొడక్షన్ 30 మూవీ ఆంధ్రాపోరి. ఇటీవల ఈ చిత్రం చిత్రీకరణని పూర్తి చేసుకుంది ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మే 15న విడుదల చేయాలనుకుంటున్నాం. దర్శకుడు రాజ్ మాదిరాజు మా బ్యానర్లోనే గతంలో రుషి సినిమాని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు తను మంచి స్క్రిప్తో ట్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఇందులో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్, ఉల్కా గుప్తాలు మెయిన్ లీడ్స్ లో చక్కగా నటించారు. మరాఠిలో టైమ్ పాస్ పేరుతో మంచి సక్సెస్ను సాధించిన ఈ చిత్రాన్ని మా బ్యానర్లో ఓ కమిట్ మెంట్తో రూపొందించాం. దర్శకుడు ఈ సినిమాని చెప్పిన సమయంలో, బడ్జెట్ లో తెరకెక్కించారు. ఈ సినిమా కోసం 35రోజలు పాటు షూటింగ్ చేశాం. ఇదొక టీనేజ్ లవ్ స్టోరి. ప్రతి విషయంలో కొత్తదనం కనిపిస్తుంది. ఆకాష్
24 P టాలీవుడ్
ర్మాతకు అసలైన నిర్వచనాన్ని ఇచ్చిన మహా వ్యక్తి డి రామానాయుడు. దాదాపు 150 కి పైగా చిత్రాలు నిర్మించి, దేశం లో ఉన్న అన్ని భాషల్లో సినిమాలు నిర్మించిన ఏకైక వ్యక్తి , గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్తానం సంపాదించుకున్న రామానాయుడు అనారోగ్యం తో కన్నుమూసారు. ఆయన జ్ఞాపకార్థం ఓ ప్రతిష్టాత్మక అవార్డును అందించాలనే ఆలోచనలో ఉన్నారు అయన తనయులు సురశ్ , వెంకటేష్. అక్కినేని జాతీయ అవార్డ్ తరహాలో ఈ అవార్డును కుడా ఏర్పాటు చేస్తారట ! దీనికి సంబందించిన వివరాలను జూన్ 6న రామానాయుడు జన్మదినం రోజున వివరిస్తారట. దీనికి సంబందించిన సన్నాహాలు జరుగుతున్నాయి. చక్కగా నటించాడు. మన పాత చిత్రాలు చాలా మరాఠీ చిత్రాలే ఆధారంగా రూపొందాయి. మేం నిర్మించిన వదినగారి గాజులు కూడా మరాఠి చిత్రం ఆధారంగానే తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి సంగీతం ఉంటుంది. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ లో మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. తప్పకుండా అందరినీ అలరించే చిత్రమవుతుంది’’ అన్నారు.
ఈ
మద్య సినిమాలు తగ్గించుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు హీరో శివాజీ. బిజెపి పార్టీ వ్యక్తి గా ఉన్న శివాజీ ఈ మద్య ఎపి కి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కొన్ని కార్యక్రమాలు చేసాడు. ఆ కార్యక్రమాల ద్వారా మనోడికి మంచి క్రేజ్ వచ్చింది, కాని బిజెపి లో మాత్రం శివాజీ పై ఫైర్ అవుతున్నారు. ఇటీవలే ఆ పార్టీ జాతీయ నాయకుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అసలు శివాజీకి బిజెపి పార్టీ కి ఎలాంటి సంబందం లేదు. ఆయన మా పార్టీ వ్యక్తి కాదు అంటూ కామెంట్ చేసాడు. దాంతో శివాజీ పార్టీ మారనున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే శివాజీ ఆ పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పార్టీ వీడితే శివాజీ ఏ పార్టీ లోకి వెలతాడనే న్యూస్ కూడా వస్తున్నాయి. అయితే శివాజీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం శివాజీ పవన్ జనసేన పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చె అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబందించిన న్యూస్ త్వరలోనే రానుంది.
ని
-
తిన్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో త్వరలో ఓ సినిమా సెట్స్ పైకి రానుంది. వీరిద్దరి కలయికలో గతం లో హార్ట్ ఎటాక్ సినిమా వచ్చింది. ఆ సినిమా తరువాత వీరు కలిసి రూపొందించే సినిమాకు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. పూరి జగన్నాధ్ ప్రస్తుతం హాట్ భామ ఛార్మి ముఖ్య పాత్రలో నటిస్తున్న జ్యోతి లక్ష్మి చిత్రం రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. ఈ సినిమా ఈ నెల తో పూర్తి కానుంది. ఈ సినిమా తరువాత నితిన్ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే ఈ సినిమాకు మా అమ్మ సీతామాలక్ష్మి అనే టైటిల్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ పై తెగ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వార్తలు వెలువడే అవకాశం ఉంది.
టాలీవుడ్ P 25
రా
అ
క్కినేని నాగచైతన్య హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న దోచేయ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 24 న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ క్రేజ్ పెరిగింది. స్వామి రారా వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు కావడం తో ఈ సినిమా పై కుడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ కూడా క్రేజ్ గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ విషయం లో కుడా డైరెక్టర్ చాలా కంట్రోల్ చేసాడని, దానివల్లే ఈ సినిమాకు బిజినెస్ పరంగా కూడా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. నాగచైతన్య కెరీర్ లో ఈ సినిమా బిజినెస్ బాగా జరిగినట్టు సమాచారం. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆడియో కుడా త్వరలోనే విడుదల కానుంది.
26 P టాలీవుడ్
మ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ప్రారంబం అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్స్ట్ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఇటీవలే గోవిందుడు అందరి వాడెలే చిత్రాన్ని నిర్మించిన గణేష్ చరణ్ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. అయితే ఈ చిత్రానికి రేసుగుర్రం చిత్రం తో గత ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడట ! ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈ
మద్య సినిమా విడుదలై మొదటి వారం హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ఆడితే తప్ప నిర్మాత కళ్ళలో ఆనందం కనిపించడం లేదు? అలాంటిది విడుదలకు ముందే అల్లు అర్జున్ లాభాలను అందుకున్నాడు ? అవును అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే క్రేజీ బిజినెస్ పూర్తీ చేసుకుంది. అన్ని ఏరియా లు క్రేజీ రేటు కు అమ్ముడయ్యాయి. మరో వైపు శాటిలైట్ కూడా అంటే భారీగా అమ్ముడైంది. మొత్తంగా ఈ సినిమాకు పెట్టిన ఖర్చు పోను మరో 15కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసిందని సమాచారం. అంటే ఈ సినిమా సూపర్ హిట్ అయితే నిర్మాతకు లాభాలో మరింత వస్తుంది సో ... మొత్తంగా సత్యమూర్తి కొడుకు మంచి లాభాల్లోనే ఉన్నాడు ?
నందమూరి
బాలకృష్ణ హీరోగా సత్యదేవ దర్శకత్వం లో రూపొందుతున్న ఎన్ బి కే లయన్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల డేట్ ను ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు. అయితే ముందుగా అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందు అంటే మే డే రోజున కాకుండా ఏప్రిల్ 30న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ నెల 15న ఈ చిత్రం లోని పాటలను విడుదల చేసే అవకాశం ఉంది. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే లు హోరోయిన్స్ గా నటిస్తున్నారు.
టాలీవుడ్ P 27
బ
స్ స్టాప్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మారుతి ఆ తరువాత రూపొందించిన సినిమాలతో దర్శకుడిగా నిలబడ్డాడు. ఆ మద్య ఆయన నేతృత్వం లో వచ్చిన ప్రేమ కథా చిత్రం సంచలన విజయం సాదించింది. అయితే ప్రస్తుతం నాని హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్న మారుతీ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. సుదీర్ బాబు హీరోగా రూపొంది హిట్ అందుకున్న ప్రేమ కథా చిత్రం సినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. ప్రముఖ సంస్త పద్మాలయ స్టూడియో పతాకం పై హిందీలో రూపొందే ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం స్క్ర్తిప్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరి మారుతి అక్కడ కుడా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తాడో చూడాలి ?
28 P టాలీవుడ్
ఎ
న్నో రీమేక్ చిత్రాలని సక్సెస్ ఫుల్ చిత్రాలుగా మలచిన భీమనేని దర్శకత్వంలో, అల్లుడుశీను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో నూతన చిత్రం పూజ కార్యక్రమాలు ఫిల్మ్ నగర్ సాయిబాబా దేవాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబురావు కెమేరా స్విచ్ ఆన్ చేయగా షిర్డి సాయిబాబా విగ్రహంపై తొలిషాట్ చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు హాజరై యూనిట్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. దర్శకుడు భీమనేని సొంత సంస్థ 'గుడ్ విల్ సినిమా' బ్యానర్ పై నిర్మాణం కానున్న ఈ చిత్రం ఏప్రిల్ 16 నుండి మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి మే, జూన్ , జులై నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేస్తామని, ఆగస్ట్ 28న చిత్రాన్ని విడుదల చేయనున్నామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల తెలియజేశారు. తమిళ్ లో 'సుందర్ పాండియన్' గా, కన్నడలో 'రాజహులి' గా విడుదలై రెండు భాషల్లోనూ శతదినోత్సవాలు జరుపుకుని నిర్మాతలకి, పంపిణిదారులకి కనక వర్షం కురిపించిన కథకి ఇది తెలుగు రీమేక్ అని, మన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మలిచామని, 'సుడిగాడు' తర్వాత తనకిది మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే చిత్రమని దర్శకుడు భీమనేని తెలియజేశారు.
ఇ
టీవలే శృతి హాసన్ పై పెద్ద దుమారమే రేగింది. నాగార్జున, కార్తి హీరోలుగా రూపొందే మల్టి స్టారర్ సినిమాలో ముందుగా శృతి ని హీరోయిన్ గా తీసుకున్నారు. అంత ఓకే అయిన తరువాత షూటింగ్ టైం కు ఈ అమ్మడు డేట్స్ కుదరడం లేదంటూ ఈ సినిమానుండి తప్పుకున్నట్టు తెలిపింది. దాంతో సదరు నిర్మాతలు కోర్టు కు వెళ్లారు. కోర్టు శృతి కి కొత్త సినిమాలో నటించొద్దనే కండీషన్ పెట్టింది.. ఏదైనా దెబ్బ తగిలితే కాని నొప్పి తెలియదని ఈ భామ తెలుసుకున్నట్టుంది. అందుకే ఇప్పుడు రాజీకి వచ్చిందట ! మల్లి ఈ సినిమాకోసం డేట్స్ మార్చుకుంటానని రాయభారం నడిపిస్తుంది. కాని ఏం లాభం ఇప్పటికే శృతి ప్లేస్ లో తమన్నాను హీరోయన్ గా ఓకే చేసారు. మరి శృతి హాసన్ పరిస్తితి ఏమిటా అనేది ?? తెలియాలి.
సూ
పర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్స్ట్ సినిమాకు అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టాడు. శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వం లో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే బ్రహ్మోస్తవం అనే పేరును కుడా ఓకే చేసారు. ఈ చిత్రాన్ని మే 31 న అంటే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ప్రారంబిస్తారట. పివిపి బ్యానర్ పై రూపొందే ఈ చిత్రాన్ని ప్రసాద్ పి పోట్లురి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
టాలీవుడ్ P 29
టా
లీవుడ్ లోనే కాదు ఏ వుడ్ లో నైన వారసత్వ పరంపర ఇంకా జోరుగానే కొనసాగుతుంది. ఇప్పుడు నాలుగో తరం హీరోల ఎంట్రీ నడుస్తుంది. లేటెస్ట్ గా ఘట్టమనేని ఇంటి వారసుడు సూపర్ స్టార్ కృష్ణ తమ్మడు సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఇప్పటికే మహేష్ నటించిన నిజం సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రలో నటించాడు. లేటెస్ట్ గా అతడు మరోసారి నాని హీరోగా మారుతీ దర్శకత్వం లో రూపొందే సినిమాలో నటిస్తున్నాడు. నాని చిన్నప్పటి పాత్రలో జయకృష్ణ నటిస్తాడట. తన కొడుకు సినిమాల్లో నటించడం పై రమేష్ బాబు సుముకంగానే ఉన్నాడట .... సో త్వరలోనే జయకృష్ణ హీరోగా కుడా ఎంట్రీ ఇస్తాదన్నమాట !!
30 P టాలీవుడ్
మె
గాస్టార్ గా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న చిరంజీవి ప్రస్త్తుతం తన 150 వ సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ విషయం లో చిరు ఫెయిల్ అయ్యాడట ! ఇంతకి అది ఏ విషయం అని అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నాం . అప్పట్లో సంచలన విజయం సాదించిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా , చిరు ల మద్య ఓ రొమాంటిక్ లిప్ లాక్ సీన్ ఉందట !! ఈ విషయం పై దర్శకుడు రాఘవేంద్ర రావు నగ్మా కు చెబితే మొదట ఆమె చేయనని చెప్పిందట ! కాని సినిమాకు అది చాలా అవసరం అని కన్వే చేయడం తో సరే అందట నగ్మా . రొమాంటిక్ ముద్దు సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు చిరు నగ్మా పెదలపై ముద్దు పెట్టడం లో ఫెయిల్ అయ్యాడట ? కాని నగ్మా మాత్రం కరక్ట్ గా పెట్టిందట ??? అవును ఆ తరువాత మల్లీ సరిగ్గా చేసారనుకోండి అది వేరే విషయం. ఇంతకి ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా ? స్వయంగా నగ్మా ... అవును నగ్మే ఈ విషయాన్నీ ఓ కార్యక్రమం లో తెలియచేసింది. అదీ విషయం
సౌ
త్ లో హాట్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు కొట్టేసిన హాట్ భామ ప్రియమణి ఈ మద్య సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామకు లేటెస్ట్ గా ఓ అవకాశం దక్కింది. దర్శకుడు రామ్ హీరోగా నటించే ఓ సినిమాలో హీరోయిన్ గా ఓకే అయ్యింది. ఈ సినిమాకు మిస్కిన్ కథ అందిస్తున్నాడు. అంతే కాదు మిస్కిన్ విలన్ పాత్రలో కుడా నటిస్తున్నాడట ! మిస్కిన్ శిష్యుడు ఆదిత్య దర్శకత్వం లో ఈ సినిమా ఉంటుంది . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరి ఈ సినిమాతో అయిన ఈ భామకు దశ తిరిగేనో లేదో చూడాలి ?
నే
హా దూపియా ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ టాప్ లేపెస్తోంది . అన్నట్లు ఈ అమ్మడి వయసు 38కాగా ఇంకా పదహారేళ్ళ పడుచు ప్రాయంల షార్ట్ లు వేసి కుర్రకారు కి కిక్ ఎక్కిస్తోంది . తాజాగా రీబక్ టాప్ వేసి ఆ టాప్ లేపేస్తూ తన ఎద భాగాన్ని చూపరులకు చూపిస్తూ మాంచి కిక్ ఇస్తోంది . ఈ ఫోటో షూట్ హాట్ ఫోటోలను చూసిన నెటిజన్లు గుడ్లప్పగిస్తూ నేహా అందాలను చూస్తూ .......... ఆ అందాలను ఆస్వాదిస్తున్నారు . అన్నట్లు ఈ హాట్ భామ తెలుగులో రెండు చిత్రాల్లో బాలయ్య , రాజశేఖర్ ల సరసన నటించింది . అవి హిట్ కాలేదు దాంతో ఈ భామ అందాలు అడవి కాచిన వెన్నెలే అయ్యింది . దాంతో కొంతకాలం తెరమరుగు అయిన ఈ భామ తాజాగా మళ్ళీ ఈ హాట్ ఫోటో షూట్ తో వార్తల్లోకి ఎక్కింది .
టాలీవుడ్ P 31
ప్ర
మె
గా స్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు సాయి ధరం తేజ్ , పిల్ల నువ్వు లేని జీవితం సినిమా మంచి హిట్ అయ్యి సాయి ధరమ్ ను హీరోగా నిలబెట్టింది. ఇక ఈ హీరో మొదటి మూవీ రేయ్ ఇటీవలే విడుదలై మరింత క్రేజ్ తెచ్చింది. ఈ సినిమాలో మనోడు డాన్స్ లను అదరగొట్టాడు, ఎనర్జీ లెవల్స్ కూడా బాగా ఉన్నాయనే క్రెడిట్ కొట్టేసాడు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ లో డాన్సర్ లకు కొదవ లేదు. ఈ సినిమాతో సాయి కుడా డాన్సర్ గా వారికి గట్టి పోటి ఇస్తాడని వేరే చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా రేయ్ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు.
32 P టాలీవుడ్
స్త తు ం పండగ చేస్కో సినిమాలో నటిస్తున్న రామ్ వెంటనే మరో సినిమాకు కమిట్ అయ్యాడు. రమేష్ తుమ్మల అనే దర్శకుడు రూపొందించే ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. హరికథ పేరుతో రూపొందే ఈ సినిమాలో మల్లు భామ కీర్తి సురేష్ హీరోయన్ గా ఓకే అయ్యింది. తమిళ , మలయాళ బాషలలో నటిస్తున్న ఈ అమ్మడు తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ లేటా అందాలా భామ తెలుగుప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి ?
ఎ
వరగ్రీన్ అనే పదానికి సరైన అర్థాన్ని ఇచ్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు తెరపైకి అడుగుపెట్టి నేటితో యాభై వసంతాలు పూర్తి అయ్యాయి. నటషేఖరుడి గా పేరు గాంచిన కృష్ణ తెలుగులో చేసినన్ని సాహసాలు ఏ హీరో చేయలేదంటే అతిశయమే. తొలి 70 ఎం ఎం సినిమా, తొలి కలర్ స్కోప్ సినిమా ఇలాంటి ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా నెరవేర్చిన ఈ నటుడు సాహసానికి మారుపేరుగా నిలిచాడు. దాదాపు 350 కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన కృష్ణ
ఎవరగ్రీన్ హీరోగా నిలిచాడు. నిర్మాతల హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న కృష్ణ మూడు షిఫ్ట్ లలో కూడా సినిమాల్లో నటించిన రోజులున్నాయి. ఒకే ఏడాది దాదాపు 12 సినిమాలను విడుదల చేసిన హీరోగా ఒక్క కృష్ణ గారికే చెల్లింది. 1965 లో తేనెమనసులు సినిమాలో నటించాడు. ఈ సినిమా ఈ రోజు అంటే 31 మార్చ్ - 1965న విడుదల అయ్యింది. లేటు వయసులో హీరోగా నటించి కుడా మంచి విజయాలు అందుకున్నాడు ఈ సూపర్ స్టార్ .. వీలైతే తన మనవడు గౌతం తో కుడా నటిస్తానని అంటున్న కృష్ణ కు అబినందనలు తెలుపుతుంది టాలీవుడ్ . నెట్
ర
కుల్ ప్రీత్ సింగ్ ఈ భామ కోసం టాప్ హీరోలంతా పడి చస్తున్నారు. ఈ అందాల ముద్దుగుమ్మ ని తమ సినిమాలో పెట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండగా అదే ఈ భామ పాలిట కష్టంగా మారిందట . అందరు హీరోలు ఈ భామనే కావాలని పట్టుబడుతుండటంతో అందరికీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సతమతం అవుతోందట . దాంతో ఎన్టీఆర్
తో చేసే సినిమా నుండి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది . ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని ఎంపిక చేసినప్పటికీ , తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రకుల్ ఎన్టీఆర్ చిత్రానికి డేట్స్ కేటాయించలేని పరిస్థితి ఉండటంతో ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది .
టాలీవుడ్ P 33
సి
నిమాల్లో ఐటెం సాంగ్స్ కు ఉన్న ప్రత్యేకత ఈనాటిది కాదు . అప్పట్లో జ్యోతి లక్ష్మి , జయమాలిని , సిల్క్ స్మితా ఇలా ఐటెం సాంగ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న వారే. అలాంటి హాట్ హాట్ ఐటమ్ సాంగ్ తో లేటెస్ట్ గా ఓ క్రేజీ అవకాశాన్ని కొట్టేసింది హాట్ భామ నారా ఫతేహి! లేటెస్ట్ గా ఎన్టిఆర్ హీరోగా టెంపర్ సినిమాలో హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా ఈ సాంగ్ తో జక్కన్న మనసునే దోచుకుందట ! అవును ఈ అమ్మడి పాట చూసిన రాజమౌళి ఈ భామ తో బాహుబలి సినిమాలో ఓ క్రేజీ ఐటెం సాంగ్ చేయాలనీ ప్లాన్ చేసాడు. త్వరలోనే ఈ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఒక్క సాంగ్ తో క్రేజీ అవకాశం కొట్టేసింది కదూ ...!!
ద
క్షిణాదిలో సంచలన తారగా నిలిచినా నయనతార జీవితం లో ప్రేమాయణాల గురించి అందరికి తెలిసిందే. శింబు తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ భామ అతనితో విడిపోయి ఆ తరువాత ప్రభు దేవాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది . ఆ మద్య వీరిద్దరిమద్య ప్రేమాయణం కూడా జోరుగా జరిగింది. ఆ తరువాత ఏవో కారణాలతో ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు నయనతార అన్నింటికీ దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా మల్లి నయనతారతో కలవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఓ నిర్మాత తో ఆయన మంతనాలు సాగిస్తున్నాడట ? అయితే ఈ విషయం పై నయనతార
34 P టాలీవుడ్
మాత్రం ప్రభుదేవా గురించి నయన ఇంకా కోపంగానే ఉందని ఆ నిర్మాత అంటున్నాడు. ఈమెను పెళ్లి చేసుకునే ముందు ప్రభుదేవా తన బార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెల్సిందే . మరి ప్రభుదేవా ను ఈ సారి నయనతార క్షమిస్తుందో లేదో చూడాలి !!!
సె
క్స్ సుఖం కోసం పెళ్లి చేసుకునేంత వరకూ ఎవరూ ఈరోజుల్లో ఆగడం లేదని అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే చేసారని ,ఇంకా చేస్తున్నారని అంటోంది బాలయ్య తో లెజెండ్ చిత్రంలో పద్దతిగా నటించిన రాధికా ఆప్టే . తెలుగులో ఈ భామ నటించిన చిత్రాలన్నీ పద్దతిగా ఉన్నాయి కానీ ఇటీవల బాలీవుడ్ లోనూ ,హాలీవుడ్ లోను రెచ్చిపోయి నటించిన ఈ భామ సెక్స్ గురించి మాట్లాడుతూ పెద్ద లెక్చరే ఇస్తోంది . సెక్స్ సుఖం కోసం పెళ్ళికి ముందే ఆ పని తొందరపడి చేస్తున్నారని ,ఆ పని కోసం పెళ్లి అయ్యేదాకా ఆగే ఓపిక ఇప్పటి అమ్మాయిల్లో లేదని అంటోంది . మరి ఈ అమ్మడి సంగతి ఏంటో ? ఆ విషయంలో .
టాలీవుడ్ P 35
హా
ట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను మత్తెక్కించిన ముద్దుగుమ్మ చార్మి ప్రసుతం గోవా బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది. అసలే ఎండాకాలం కావడంతో అక్కడ చల్లని సముద్రం లో జలకాలు ఆడుతుంది ? అవును అయితే అది ఒంటరిగా కాదండి బాబు ? సినిమా కోసం ? అవును చార్మి ప్రస్తుతం జ్యోతి లక్ష్మి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతుంది. అక్కడా బీచ్ సన్నివేశాలతో పాటు ఓకే సాంగ్ కూడా తీస్తారట ? ఈ చిత్రం లో బార్ డాన్సర్ గా ఈ భామ కనిపిస్తుంది . త్వరలోనే షూటింగ్ పూర్తి చేసి చిత్రాన్ని సమ్మర్ లోనే విడుదల చేస్తారట .
36 P టాలీవుడ్
ఈ
మద్య కెరీర్ పరంగా బాగా వెనక్కి తగ్గిన రాజశేఖర్ లేటెస్ట్ గా నటించిన గడ్డం గ్యాంగ్ కుడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమాతో ఇక హిట్ కొడతానని కలలుగన్న రాజశేఖర్ కు నిరాశే మిగిలింది . పోనీ కనీసం వర్మ దర్శకత్వం లో రూపొందుతున్న పటప ్ట గలు సినిమా అయినా తన హిట్ కోరిక తీరుస్తుండానే నమ్మకం తో ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిందట ? అయితే కొన్ని క్మా లై క్స్ సన్నివేశాలు రాజ కు నచ్చలేదట , దాంతో వర్మతో మల్లీ ఈ సీన్స్ బాగా లేవని చెప్పాడు . వర్మ సరే మల్లీ రీ షూట్ చేద్దామని చెప్పాడట ? కాని ఇంతవరకు ఈ సినిమా విషయాన్నే వర్మ మరచిపోయినట్టు ఉన్నాడు . వరుసగా వేరే సినిమాల బిజిలో ఉన్నాడు. మరి రాజ శేఖర్ కోరికా అలాగే మిగిలేనో లేదో. ప్రస్త తు ం వర్మ 365 డేస్ సినిమాతో బిజీగా ఉన్నాడు . కనీసం పటప ్ట గలు సినిమాతో అయినా హిట్ కొట్టాలనే కోరిక ను వర్మ తీరుస్డో తా లేదో చూడాలి ?
డ
ర్టీ గర్ల్ పూనం పాండే తెలుగులో నటిస్తున్న చిత్రం ''మాలిని అండ్ కో ''. ఈ చిత్రం లోని మసాజ్ సాంగ్ ని నిన్న శ్రీరామ నవమిని పురస్కరించుకొని మసాజ్ సాంగ్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు. పూనం కు రెచ్చిపోవడం కొత్త కాదు కానీ ఈ సినిమాలో మాత్రం పూనం బాగానే రెచ్చిపోయి అందాలను ఆరబోసి కుర్రకారు ని రెచ్చగొడుతోంది . రొమాంటిక్ యాక్షన్ కథాంశం తో తెరకెక్కిన ఈ చిత్రానికి వీరు కే దర్శకత్వం వహిస్తుండగా మనీషా బ్యానర్ పై కిషోర్ రాఠీ నిర్మిస్తున్నారు .
స
మాజాన్ని ప్రభావితం చేసే అంశాలు , ముఖ్యంగా పిల్లల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపే అంశాల పై సెన్సార్ బోర్డ్ కటినంగా వ్యవహరిస్తుంది. అవును ఇలాంటి అసభ్యకర సన్నివేశాలకు కత్తెర వేస్తుంది. లేటెస్ట్ గా అన్ఫ్రీడం అనే సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించారు. ముఖ్యంగా ఈ సినిమాలో హోమో సెక్స్ నేపద్యం లో ఇద్దరు యువతుల మద్య వచ్చే లైంగిక ప్రేరేపితమైన అంశాలను తొలగించారు. టెర్రరిస్ట్ నేపద్యం లో రూపొందిన ఈ సినిమాలో చాలా సీన్స్ కత్తెరకు గురయ్యాయి. ఇలాంటి హోమో సెక్స్ ను ప్రేరేపించే సన్నివేశాలు ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నందున కత్తెరకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయం ఇలాంటి వాటితో మంటగలిసి పోతాయని సెన్సార్ తెలిపింది. ఈ సన్నివేశాలు సినిమాకు ముఖ్యమని ఈ చిత్ర దర్శకుడు కోర్టుకు వెళ్లనున్నాడు. మరి కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి .
టాలీవుడ్ P 37
ఈ
మద్య హీరోయిన్స్ బాగా ముదిరిపోయారు. ముఖ్యంగా హాట్ హాట్ సన్నివేశాలకు, లిప్ లాక్ సీన్స్ కు, బికినిలకు సై అంటూ దానికి కావలసిన పారితోషికాన్ని అందుకుని రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ లో అయితే ఈ విషయం లో మరి చాలా అడ్వాన్స్ ? అయితే ఇవన్ని బాగానే ఉన్నాయి కాని హాట్ హాట్ గా రూపొందే ఓ సినిమా విషయం లో మాత్రం హీరోయిన్స్ ఆ సినిమా అంటేనే ఆమడ దూరం పరుగుతీస్తున్నారు? ఎంత రేమ్యూనరేషణ్ అయినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ ఉన్నా కూడా మేము చెయ్యం బాబోయ్ అంటూ దూరం పారిపోతున్నారు. ఇంతకి ఆ సినిమా ఏమిటో తెలుసా బాలీవుడ్ హాట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్న త్రిబుల్ ఎక్స్ సినిమా కోసం? కామసూత్ర నేపద్యం లో రూపొందే ఈ సినిమాలో లెక్కలేనన్ని రొమాంటిక్ సన్నీ వేషాలు, బికినిలు , స్కిన్ షో లు వంటి చాలా హాట్ ఉన్నాయట ? ఈ సినిమాలో నటిస్తే ఇక మేము పోర్న్ సినిమాలకే తప్ప మామూలు సినిమాలకు పనికి రామని అనుకున్నారో ఏమో ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఏ హీరోయిన్ ఫైనల్ కాలేదు మరి ?
టాలీవుడ్ P 38
సి
నిమాల్లో హీరోయిన్ అనగానే చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తారు, ముక్యంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందంటే వారి టెక్కు మాములుగా ఉండదు. అయితే తాను మాత్రం అలంటి దాన్ని కాదు అని అంటుంది హాట్ భామ ప్రణీత. జనరల్ గా హీరోయిన్స్ ఫ్లైట్ లో ట్రావెల్ చేసినప్పుడు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తారు .. కాని నేను ఎకనమి క్లాస్ లోనే ట్రావెల్ చేస్తానని అంటుంది. అంతే కాదు, నేను నిర్మాతను అవి కావాలి , ఇవి కావాలి అని టార్చర్ చేయను అని చెబుతుంది. సో ఈ అమ్మడు అందరిలంటిది కాదన్నమాట ! ఏమంటారు?
నేను మాత్రం అలాంటిదాన్ని కాదంటున్న
ప్రణీత