Tollywood Magazine Telugu November - 2014

Page 1

NOVEMBER 2014 VOL 11 ISSUE 11

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


వర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హుదుద్ తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచి 50లక్షల విరాళాన్ని ఇవ్వడమే కాకుండా వారిని పరామర్శించడానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ ని ఖమ్మంలో పలకరించి వైద్య సదుపాయాలకోసం 2లక్షల రూపాయలను ఇవ్వడమే కాకుండా బొమ్మలను కూడా ఇచ్చి ఆ చిన్నారి పరిస్థితి తెలుసుకొని కంటతడి పెట్టారు పవన్ కళ్యాణ్. కష్టాలకు చలించి కంటతడి పెట్టి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పట్ల అటు చిత్ర పరిశ్రమ లోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ప్రశంశల వర్షం కురుస్తోంది. తక్షణం స్పందించడమే కాకుండా బాధితులకు ధైర్యం చెప్పడానికి నేరుగా ఆ ప్రాంతాలకు వెళ్లి పలకరించి ధైర్యాన్ని నూరి పోశారు పవన్. పవన్ స్పందన అమోఘమని దర్శకరత్న దాసరి నారాయణరావు సైతం అభివర్ణిస్తూ పవన్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక అందాల ముద్దుగుమ్మ సమంత ఐతే పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది. ఇక పవన్ అభిమానులు ఐతే ఆకాశమే హద్దుగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే హుదుద్ తుఫాన్ బాధితులకు 50లక్షల విరాళం ఇవ్వడమే కాకుండా చిన్నారి కోరికని మన్నించి ఖమ్మం కు వెళ్లి పరామర్శించడం తో తిరుగులేని మానవతా దృక్పథాన్ని చాటి చెప్పారని కొనియాడుతున్నారు.

2 P టాలీవుడ్

పవర్ స్టార్ ైప ప ్ షం ్ర శంసల వర


ముద్దంటే చేదా ..... నీకా ఉద్దేశ్యం లేదా ..... ! అని అన్నాడో మహాను భావుడు. ఆ మహానుభావుడి సలహా ప్రకారం ముద్దంటే చేదు కాదని నాకా ఉద్దేశ్యం ఉందని చాటి చెబుతోంది హాట్ భామ రెజీనా. ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాల్లో ఘాటు లిప్ లాక్ సీన్లని చేసి ప్రేక్షకుల గుండెల్లో మంటలు రేపుతోంది ఈ భామ. ఇప్పటికే రెండుసార్లు సందీప్ కిషన్ కి ఘాటు లిప్ కిస్ ఇచ్చిన ఈ భామ రవితేజ తో కూడా లిప్ లాక్ చేసి తన ఉద్దేశ్యాన్ని చాటి చెప్పింది. ఇక తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కూడా లిప్ లాక్ చేసిందని తెలుస్తోంది. సాయి తో చేస్తున్న చిత్రం ''పిల్లా నువ్వు లేని జీవితం ''. ఆ చిత్ర ట్రైలర్ లో సాయి కి ఘాటు లిప్ ని అందిస్తూ దొరికి పోయింది. ఈ ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏతా వాతా చెప్పేది ఏంటంటే ఈ భామకి ముద్దంటే మహా మోజు అందుకే అధర మధురాలను జుర్రుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు రెజీనా .

రెజీనా ముద్దంటే పడి చస్తోన్నభామ

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2014

టాలీవుడ్ P 3


అనుష్క చేతికి గాయం

అందాల ముద్దుగుమ్మ అనుష్క చేతికి గాయాలు అయ్యాయి అయినప్పటికీ ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొని వృత్తి పట్ల తనకున్న అంకిత భా వాన్ని చాటి చెప్పింది. ఈ విషయాన్నీ రుద్రమదేవి దర్శక నిర్మాత గుణశేఖర్ ట్వీట్ చేయడంతో బయటకి పొక్కింది. రుద్రమదేవి చిత్ర షూటింగ్ సమయంలో అనుష్క మణికట్టు దగ్గర గాయం కావడంతో ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొని తన అంకిత భావం ఏంటో రుచి చూపించింది. దాంతో ఆమె ధృఢ సంకల్పానికి అచ్చెరువొందాడట గుణశేఖర్. భారీ ఎత్తున అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి . ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెలిసిందే .

గోనగన్నారెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి గా రుద్రమదేవి చిత్రంలో విశిష్ట పాత్ర పోషిస్తున్నాడు. ఈరోజు గోనగన్నారెడ్డి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ అదిరి పోయే రేంజ్ లో దర్శనం ఇచ్చాడు. రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న బన్నీ చిత్రం రుద్రమదేవి కావడంతో ఆ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో రుద్రమదేవి గా అనుష్క నటిస్తోంది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రుద్రమదేవి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ ఈ చిత్రంలో గోనగన్నారెడ్డి గా నటించడమే . అందుకే గోనగన్నారెడ్డి గా అల్లు అర్జున్ లుక్ ఎలా ఉంటుందో నని ఎంతో ఆసక్తితో చూసే అబిమానుల కోసం గోనగన్నారెడ్డి పోస్టర్ ని రిలీజ్ చేసారు దర్శక నిర్మాత గుణశేఖర్ .

4 P టాలీవుడ్

లుక్ అదిరిపోయింది


నగ్నంగా నటించిన ప్రియాంక చెల్లి

బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా నగ్నంగా నటించడానికి తన చెల్లికి ఎంతో సపోర్ట్ గా నిలిచిందట ! ఈ విషయాన్నీ ప్రియాంక చెల్లి ''బార్బీ హాండా '' నే స్వయంగా చెప్పింది. అక్క లాగే తను కూడా బాలీవుడ్ లో జెండా పాతాలని భావించిన ఈ భామ అందాలను ఆరబోయడానికి రెడీ అంటోంది.ఈ రోజుల్లో ఇంకా వంటి నిండా కప్పు కొని నటించడం ఏంటి అవసరమైతే నగ్నంగా నటించాలి అని చెప్పడమే కాకుండా నేను ఈ చిత్రంలో నగ్నంగా నటించాను ,పైగా ఆ సన్నివేశం గురించి ప్రియాంక కి చెబితే తను నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిందని అంటోంది. అంతేనా ...... నా శరీర సౌష్టవం చూపించడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎంత కావాలంటే అంత చూపించడానికి నేను రెడీ అని చెబుతోంది. మొదటి చిత్రంతోనే ఇంతగా రెచ్చిపోతున్న ఈ భామ రాబోయే రోజుల్లో మరెంతగా రెచ్చిపోనుందో !బార్బీ హాండా అసలు పేరు కాగా సినిమా కోసం ''మనారా'' గా మార్చుకుంది. ప్రస్తుతం మనారా ''జిద్ ''అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

మూడు రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టిన షారుఖ్

రివ్యూ లకు భిన్నంగా మూడు రోజుల్లోనే వంద కోట్లను కొల్లగొట్టి బాలీవుడ్ బాద్ షా తన పవరేంటో రుచి చూపించాడు. ఈనెల 24న రిలీజ్ అయిన ''హ్యాపీ న్యూ ఇయర్ '' చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. అవలీలగా మూడు రోజుల్లోనే వంద కోట్లను వసూల్ చేసి భారీ విజయం దిశగా దూసుకు పోతోంది. ఐతే ఈ సినిమా విడుదల సమయంలో వచ్చిన రివ్యూ ల విషయానికి వస్తే అసలు ఈ సినిమా మొత్తం మీద వందకోట్లను రాబడితే గొప్పే అనుకున్నారు కానీ మూడు రోజుల్లోనే వంద కోట్లను వసూల్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.మూడు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 108కోట్ల 86లక్షలు వసూల్ చేసినట్లు రెడ్ చిల్లీస్ సంస్థ ప్రకటించింది. ఇక బాద్ షా షారుఖ్ ఖాన్ దీపికా తో చేసిన రెండు చిత్రాలు ''ఓం శాంతి ఓం '',''చెన్నై ఎక్స్ ప్రెస్ '' భారీ విజయం సాధించడమే కాకుండా అప్పటి ట్రెండ్ కి అనుగుణంగా ట్రెండ్ సెట్ చేసిన సినిమాలు అవి. ఆ రెండు చిత్రాల తర్వాత తిరిగి మూడోసారి జతకట్టి హ్యాట్రిక్ సాధించారు.

టాలీవుడ్ P 5


అల్లు అర్జున్ కి సవాల్ విసిరిన నాగార్జున

న్మధుడు అక్కినేని నాగార్జున అల్లు అర్జున్ ని సవాల్ చేస్తున్నాడు. సవాల్ అనగానే ఇదేదో ఇద్దరి మద్య పోటీ అనుకోవద్దు. అసలు విషయం ఏమిటంటే ఈమధ్య స్వచ్చ భారత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. దాంతో అనిల్ అంబానీ విసిరిన సవాల్ ని స్వీకరించి తన కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున తర్వాత అల్లు అర్జున్ ని నామినేట్ చేసాడు. ఈ స్వచ్చ భారత్ లో పాల్గొనాల్సిందిగా అల్లు అర్జున్ తో పాటు కన్నడ నటుడు ,ఈగ విలన్ సుదీప్ ,పుల్లెల గోపీచంద్ లను సవాల్ చేసాడు నాగార్జున. మరి నాగ్ విసిరినా సవాల్ ని అల్లు అర్జున్ ఎప్పుడు స్వీకరిస్తాడో చూడాలి .

విజయ్ తమిళ హీరో

విగ ్ర హాన్ని పెట్ టా రు

తమిళనాట రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్ . విజయ్ అంటే అంతగా ఇష్టపడే అభిమానులు తాజాగా ఆ హీరోకి విగ్రహాన్ని పెట్టారు. తమిళనాట గుడులు కట్టడం ,భారీ కటౌట్ లు పెట్టడం మామూలే కావడంతో మైనపు విగ్రహాన్ని పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. ఇక విజయ్ విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ నటించిన ''కత్తి '' చిత్రం మూడు రోజుల్లోనే ముప్పై కోట్లు కలెక్ట్ చేసి సంచలన విజయం దిశగా దూసుకు పోతోంది కత్తి . దాంతో విజయ్ విగ్రహాన్ని పెట్టాలని భావించారు అభిమానులు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు ముందు పలు అవాంతరాలను ఎదుర్కొన్న కత్తి రిలీజ్ అయ్యాక మాత్రం కలెక్షన్ల కనక వర్షాన్ని కురిపిస్తోంది. ఇక ఈ చిత్రంతో తమిళనాట సక్సెస్ సాధించాలన్న సమంత కోరిక నెరవేరింది.

6 P టాలీవుడ్


40

కోట్ల

సినిమా 11వందల కోట్ ్టింది లు కొల ్ల గొట

హా

లీవుడ్ లో ''అన్నా బెల్లి ''చిత్రం రికార్డులు బద్దలు కొడుతోంది . కేవలం 40కోట్ల తో రూపొందిన ఈ చిత్రం 11వందల కోట్లు కొల్లగొట్టి అందరి కళ్ళు బైర్లు కమ్మెలా చేసింది. మనకు 40కోట్లు పెద్ద బడ్జెట్ ఏమో కానీ హాలీవుడ్ లో మాత్రం 40కోట్లంటే చిన్న బడ్జెట్ అన్నమాట ! అలా చిన్న బడ్జెట్ తో రూపొందిన అన్నా బెల్లి భారీ కలెక్షన్లను సాధిస్తుండటం తో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మనదగ్గర భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాలు బాల్చీ తన్నేస్తుండటం తో కథ ,కథనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ బడ్జెట్ కి ,అగ్ర హీరోలకు కాదని ఎప్పుడు తెలుసుకుంటారో మనవాళ్ళు .

తే మామధ్య లోకి వస్

చరణ్ రఫ్ఫాడిస ్త ాం అంటున్న బాబాయ్ కి మాకు మద్య పెద్ద గొడవలంటూ ఏమీ లేవని బాబాయ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన మా కుటుంబం విడిపోదని మా మద్య కు ఎవరైనా వచ్చి మరింతగా రెచ్చగొడితే రఫ్ఫాడిస్తాం అని అంటున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఇటీవల తెలంగాణలో అప్రకటిత నిషేధానికి గురైన ఓ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న విభేధాల గురించి మాట్లాడాడు. మామధ్య చిన్న అభిప్రాయ బేధాలు తప్ప విభేదాలు లేవని అన్నాడు. అనవసరంగా ఆ విషయాన్నీ పెద్దదిగా చేస్తున్నారని ఆవేదన చెందాడు చరణ్. మేము ఎప్పటికైనా ఒకటేనని మామధ్య కు ఎవరైనా వస్తే నలిగి పోవడం ఖాయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు చరణ్ .

టాలీవుడ్ P 7


పవన్

నామస్మరణతో దద ్ద రిల్ లి న ఆడిటోరియం

హైదరాబాద్ లో శిల్ప కళా వేదికలో జరిగిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ''పిల్లా నువ్వు లేని జీవితం ''ఆడియో వేడుకలో మెగా హీరోలు అందరూ పాల్గొన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో మెగా హీరోలు చిరంజీవి ,నాగబాబు ,చరణ్ ,అల్లు అర్జున్ ,సాయి ధరమ్ తేజ్ లలో ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ అంటూ ..... పవర్ స్టార్ అంటూ అభిమానులు గోల చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నా పవర్ స్టార్ పవన్ నామస్మరణ తో శిల్పకళా వేదిక దద్దరిల్లి పోయింది. ఐతే చరణ్ మాట్లాడుతున్న సమయంలో మెగా అభిమానులు మళ్ళీ మళ్ళీ పవన్ ప్రస్తావన తీసుకు రావడంతో పవన్ బాబాయ్ అంటే మీ కంటే నాకే ఎక్కువ ఇష్టమని ,ఆయన ఈ వేదిక మీద ఉండాలని ఎంతగా కోరుకుంటున్నారో అంతకు రెట్టింపు కోరిక నాకు ఉందని ....... తల్లి మీద మీకు ఎంత ప్రేమ ఉందో అది బయటకి చెప్పలేరని అలాగే నాకు బాబాయ్ మీద ఉన్న ప్రేమ కూడా అలాంటిదే అని చెప్పి అభిమాచిన్న సినిమాగా వచ్చింది దుమ్ము రేపుతోంది.

చిన్న సినిమాగా వచ్చింది దుమ్ము రేపుతోంది

9

యంగ్ హీరో నిఖిల్ నటించిన ''కార్తికేయ '' చిత్రంపై పెద్ద అంచనాలు లేకపోవడంతో అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ విమర్శకుల ప్రశంసలను పొందుతూ దుమ్ము రేపుతోంది. ఎన్నో అవాంతరాల మద్య ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఈ మద్య విడుదలైన భారీ చిత్రాలన్నీ వరుసపెట్టి అపజయాలు పొందుతూ ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సమయం లో చిన్న చిత్రంగా వచ్చి అందరి మన్ననలను పొందుతూ భారీ విజయం దిశగా దూసుకు పోతోంది. నిఖిల్ -స్వాతి జంటగా వచ్చిన స్వామి రారా వంటి హిట్ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ కార్తికేయ ఘనవిజయం సాధిస్తున్డటం తో సంతోషంగా ఉన్నారు నిఖిల్ . నులను ఆకట్టుకున్నాడు చరణ్ .

8 P టాలీవుడ్


రాజమౌళి క్షమాపణ కోరిన

అపజయమేరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి క్షమాపణ కోరాడు. తీవ్ర పని వత్తిడి ఉండటం వల్ల ప్రభాస్ పుట్టినరోజు కి బాహుబలి టీజర్ రిలీజ్ చేయలేక పోయామని అందుకే ప్రభాస్ అభిమానులను క్షమించమని కోరాడు జక్కన్న . దక్షిణాది లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిస్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం బాహుబలి . ప్రభాస్ తన విలువైన రెండేళ్ళ కాలాన్ని బాహుబలి కోసం కేటాయించాడు దాంతో మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అభిమానులు ఎంతోకాలంగా ఆశగా ఎదురు చూస్తున్నారు బాహుబలి కోసం . అభిమానుల అంచనాలను తగ్గట్లుగా భారీ ఎత్తున రూపొందుతున్న బాహుబలి అందరినీ సంతోషంలో ముంచెత్తుతుందని నమ్మకంగా ఉన్నాడు జక్కన్న . అందుకే ఇంతకాలంగా ఎదురు చూస్తున్నందుకు నన్ను మన్నించండి అని అంటున్నాడు .

పోర్న్ భామని అవమానించిన ముద్ దు ల

పో

హీరో

ర్న్ స్టార్ సన్నీ లియోన్ తో నటించడానికి ఏ హీరో అయిన ఎగిరి గంతేస్తాడు కానీ ఓ ముద్దుల హీరో మాత్రం ఆ పోర్న్ భామ తో నటించేఅవకాశం లేదని తేల్చి చెప్పి ఆమెని అవమానించాడు. ఇంతకీ హాట్ భామ సన్నీ లియోన్ తో కలిసి నటించే చాన్స్ వస్తే వద్దు అని నిరాకరించిన హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా ఆ హీరో ఎవరంటే .... బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మీ. ఉంగ్లీ అనే బాలీవుడ్ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటిస్తున్నాడు. ఆ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కోసం సన్నీ లియోన్ ని తీసుకోవాలని భావించారట ! ఈ విషయాన్నీ ఇమ్రాన్ హష్మీ కి చెప్పేసరికి సన్నీ తో అయితే ఐటెం సాంగ్ చేసేది లేదని ఖరాఖండిగా చెప్పడంతో మరో ఐటెం భామని ఎంపిక చేసే పనిలో పడ్డారట ఆ చిత్ర బృందం.

టాలీవుడ్ P 9


ఆదిని నిలబెట ్ట నున్న హీరోయిన్

ప్రేమకావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో ఆది. ఆ చిత్రంతో ఆకట్టుకున్న ఆదికి ఇప్పటివరకు బెస్ట్ హిట్ అంటూ ఏదీ లేకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న ''రఫ్ '' చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆది. ఐతే ఆది ఆశలకు తగినట్లుగా ఈ''రఫ్ '' చిత్రంలో గోల్డెన్ లెగ్ భామగా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడంతో రఫ్ చిత్రం రఫ్ఫా డిస్తుంది అని ఆశపడుతున్నాడు ఆది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో రఫ్ చిత్రం మంచి సక్సెస్ అయి హీరోగా నన్ను నిలబెడుతుందని నమ్మకంగా ఉన్నాడు. మరి ఆది ఆశలను ఎంతవరకు రకుల్ నిలబెడుతుందో చూడాలి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులు అకిరా నందన్ ,కూతురు ఆద్య లు ఎంతో కష్టపడుతూ దీపావళి విశిష్టత ని తెలుసుకుంటున్నారు. ఆ ఇద్దరు పిల్లలతో పాటు మరికొంతమంది పిల్లల తో కలిసి మట్టి ప్రమిదలను చేస్తూ దీపావళి పండగ ఔన్నత్యాన్ని చాటుతున్నారు. సాంప్రదాయ పద్దతుల్లో జరుగుతున్న పండగ విశేషాలను తెలుసుకుంటూ తల్లి రేణు దేశాయ్ చెబుతున్న మాటలను వింటూ పండగ వాతావరణాన్ని ఉట్టి పడేలా చేస్తున్నారు. ఈ విషయం బయటకి తెలిసేలా ఆ పిల్లల ఫోటో లను క్లిక్ మనిపించి పేస్ బుక్ లో పోస్ట్ చేసింది రేణు దేశాయ్.

10 P టాలీవుడ్

పవన్ వారసులు

కష్టపడుతున్న


మహేష్ తో శ్రీకాంత్ సినిమా కన్ఫర్మ్ అట సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న మహేష్ -శ్రీకాంత్ అడ్డాల తాజాగా మరో కుటుంబ కథా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుండగా దీని తర్వాత పూరి జగన్నాద్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ . ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపాడట మహేష్ . సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రం మహేష్ కెరీర్ లో మంచి చిత్రంగా నిలవడమే కాక పలు అవార్డులను కూడా తీసుకువచ్చిందిదాంతో శ్రీకాంత్ అంటే మహేష్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే శ్రీకాంత్ చెప్పిన లైన్ నచ్చి ఓకె చేసాడని అంటున్నారు.

ఇప్పుడు

ై డరెక్ట్ గానే తిరుగుతున్నారు ! గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హాట్ భామ అనుష్క శర్మ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిస్తుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . ఇన్ని రోజులు సెక్రెట్ గా కలుసుకున్న ఈ జంట ఇప్పుడు పబ్లిక్ గా తిరుగుతున్నారు? అవును ఇటివలే క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు జంటగా కనువిందు చేశారు. చాలా కాలంగా ప్రేమికులు అంటూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పూణేలో జంటగా కనిపించారు. పూణేలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ పోటీలను చూసేందుకు కోహ్లీ, అనుష్కాలు జంటగా వచ్చారు. ఐఎస్ఎల్ లో గోవా ఫ్రాంచైజీకి కోహ్లీ సహయజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఎఫ్ సీ గోవా, ఎఫ్ సీ పూణే జట్లు పోటీ పడడంతో జట్టు యజమానులు కోహ్లీ, హృతిక్ రోషన్ మైదానంలో సందడి చేశారు. మరి దీని వెనక ఉన్న అంతర్యం ఏమిటో..!

టాలీవుడ్ P 17


పాట

పవన్ - వెంకీ ల ఫ్యాన్స్ కి పండగే నట అల్లు అర్జున్ తో లెజెండ్ దర్శకుడు !

18 P టాలీవుడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -విక్టరీ వెంకటేష్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ''గోపాల గోపాల ''. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపు కుంటోంది. పవన్ కళ్యాణ్ -వెంకటేష్ ల మద్య అద్భుతమైన పాటని చిత్రీకరిస్తున్నారు దర్శకులు డాలీ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వచ్చే ఈపాట పవన్ -వెంకీ అభిమానులకు పెద్ద పండగే నట ! వెంకటేష్ తో పవన్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పైగా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కావడంతో పలు ఆథ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ ఒకరి అభిప్రాయాలను మరోకరు షేర్ చేసుకుంటారు. దాంతో ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తుండగా సురేష్ బాబు ,శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటివలే బాలకృష్ణ తో లెజెండ్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే బోయపాటి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని ఫిలిం నగర్ సమాచారం. అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆర్ధిక సమస్యల వలన ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కి వినిపించిన కథని లైన్లో పేటె పనిలో ఉన్నాడట బోయపాటి. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నట్లు సమాచారం. అప్పట్లో భద్ర సినిమా కథని మొదట అల్లు అర్జున్ కి బోయపాటి చెప్పాడు. అయితే అది తనకు సరైనది కాదని వదులుకోవడంతో రవితేజ ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు


అందాలతో చంపేసిన శృతి హాసన్ గ్లామర్

డాల్ శృతి హాసన్ తాజాగా ''పూజ ''చిత్రంలో నటించి తన అందాలతో ప్రేక్షకులను చంపేస్తోంది. విశాల్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వెండితెర పై తన అందాలను భారీగానే పరిచి ప్రేక్షకులకు కనువిందు చేసింది. పూజ చిత్రంలో శృతి నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా అందాలను చూపించడానికి మాత్రం కావల సిననంత స్కోప్ ఉండటం తో బాగానే రెచ్చిపోయింది. తెరపై అందాలను పరచడం శృతికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అవలీలగా అందాలను ఆరబోసి పసందు చేసింది. విశాల్ హీరోయిజం ,శృతి అందాలు ''పూజ '' చిత్రాన్ని మాస్ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి.

టాలీవుడ్ P 19


ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం కావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాధితులకు అండగా మేమున్నాం అంటూ మా ఈ ఎదుగుదలకు కారణమైన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేమని మాకు చేతనైనంత సహాయం అందిస్తామని ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చిరంజీవి 50 లక్షలు (ఎంపి నిధులు ) బాలకృష్ణ 30 లక్షలు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 20 లక్షలు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ 50లక్షలు కృష్ణ 15 లక్షలు పవన్ కళ్యాణ్ 50లక్షలు సూర్య 25 లక్షలు మహేష్ బాబు 25 లక్షలు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి 25 లక్షలు ఎన్టీఆర్ 20 లక్షలు అల్లు అర్జున్ 20 లక్షలు రేణుదేశాయ్ 20 లక్షలు ప్రభాస్ 20 లక్షలు విశాల్ 15 లక్షలు రామ్‌చరణ్ 15 లక్షలు కార్తీ 12.5 లక్షలు జ్ఞాన్ వేల్ రాజా 12.5 లక్షలు విజయనిర్మల 10 లక్షలు నితిన్ 10 లక్షలు రవితేజ 10 లక్షలు రామ్ 10 లక్షలు వివి వినాయక్ 10 లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు కళ్యాణ్ రామ్ 10 లక్షలు సమంత 10 లక్షలు కాజల్ 5 లక్షలు బోయపాటి శ్రీను 7 లక్షలు హరీశ్ శంకర్ 3 లక్షలు ప్రకాశ్ రాజ్ 5 లక్షలు అల్లరి నరేష్ 5 లక్షలు శ్రీను వైట్ల 5 లక్షలు గోపిచంద్ 5 లక్షలు సునీల్ 5 లక్షలు పాప్ గాయని స్మిత 5లక్షలు బ్రహ్మానందం 3లక్షలు

20 P టాలీవుడ్

సందీప్ కిషన్ 2.5లక్షలు నిఖిల్ 2 లక్షలు పూరి ఆకాశ్ లక్ష 50 వేలు ప్రతాప్ కొలగట్ల,నందూ ,ఆలీ ,నవీన్ చంద్ర ,రాహుల్ ,రావురమేష్ ,రచయిత కోన వెంకట్ ,చిన్ని కృష్ణ ,రకుల్ ప్రీత్ సింగ్ ,సంపూర్నేష్ బాబు లు తలా ఒక లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. నగదు మాత్రమే కాకుండా మిల్క్ పౌడర్ ,మంచినీళ్ళు ,బియ్యం ,బిస్కెట్లు ,బ్రెడ్ లు కూడా బాధితులకు పంపించారు పలువురు సినీ ప్రముఖులు.


టాలీవుడ్ స్పందన అపూర్వం అమోగం

టాలీవుడ్ P 21


రెడీ అవుతున్న

గెడ్డం గ్యాంగ్

22 P టాలీవుడ్

తమిళంలో ఘనవిజయం సాధించిన ''సూదు కవ్వం '' చిత్రాన్ని తెలుగులో ''గెడ్డం గ్యాంగ్ '' పేరుతో రీమేక్ చేస్తున్నారు హీరో డా. రాజశేఖర్. చాలా కాలం తర్వాత రాజశేఖర్ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది. మరోసారి రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మాన్ గా విశ్వరూపం చూపించనున్నారు. గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక సరైన చిత్రాలు రాక సతమత మౌతున్న రాజశేఖర్ కు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం తో ఉన్నారు. సంతోష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ కూతుర్లు శివాని ,శివాత్మిక ఈ చిత్రానికి నిర్మాతలు కావడం విశేషం. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి గెడ్డం గ్యాంగ్ ని జనాలమీదకి వదలడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


మహేష్ తో శ్రీకాంత్ సినిమా కన్ఫర్మ్ అట సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రంతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న మహేష్ -శ్రీకాంత్ అడ్డాల తాజాగా మరో కుటుంబ కథా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుండగా దీని తర్వాత పూరి జగన్నాద్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్ . ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపాడట మహేష్ . సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు చిత్రం మహేష్ కెరీర్ లో మంచి చిత్రంగా నిలవడమే కాక పలు అవార్డులను కూడా తీసుకువచ్చిందిదాంతో శ్రీకాంత్ అంటే మహేష్ కి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ అభిమానంతోనే శ్రీకాంత్ చెప్పిన లైన్ నచ్చి ఓకె చేసాడని అంటున్నారు.

ఇప్పుడు

ై డరెక్ట్ గానే తిరుగుతున్నారు ! గత కొన్ని రోజులుగా బాలీవుడ్ హాట్ భామ అనుష్క శర్మ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిస్తుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే . ఇన్ని రోజులు సెక్రెట్ గా కలుసుకున్న ఈ జంట ఇప్పుడు పబ్లిక్ గా తిరుగుతున్నారు? అవును ఇటివలే క్రికెట్, బాలీవుడ్ ప్రేమ పక్షులు జంటగా కనువిందు చేశారు. చాలా కాలంగా ప్రేమికులు అంటూ వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పూణేలో జంటగా కనిపించారు. పూణేలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ పోటీలను చూసేందుకు కోహ్లీ, అనుష్కాలు జంటగా వచ్చారు. ఐఎస్ఎల్ లో గోవా ఫ్రాంచైజీకి కోహ్లీ సహయజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఎఫ్ సీ గోవా, ఎఫ్ సీ పూణే జట్లు పోటీ పడడంతో జట్టు యజమానులు కోహ్లీ, హృతిక్ రోషన్ మైదానంలో సందడి చేశారు. మరి దీని వెనక ఉన్న అంతర్యం ఏమిటో..!

టాలీవుడ్ P 17


పాట

పవన్ - వెంకీ ల ఫ్యాన్స్ కి పండగే నట అల్లు అర్జున్ తో లెజెండ్ దర్శకుడు !

18 P టాలీవుడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -విక్టరీ వెంకటేష్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ''గోపాల గోపాల ''. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపు కుంటోంది. పవన్ కళ్యాణ్ -వెంకటేష్ ల మద్య అద్భుతమైన పాటని చిత్రీకరిస్తున్నారు దర్శకులు డాలీ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వచ్చే ఈపాట పవన్ -వెంకీ అభిమానులకు పెద్ద పండగే నట ! వెంకటేష్ తో పవన్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పైగా వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కావడంతో పలు ఆథ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ ఒకరి అభిప్రాయాలను మరోకరు షేర్ చేసుకుంటారు. దాంతో ఇద్దరి మద్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలవనున్నాయి. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తుండగా సురేష్ బాబు ,శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటివలే బాలకృష్ణ తో లెజెండ్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే బోయపాటి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని ఫిలిం నగర్ సమాచారం. అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆర్ధిక సమస్యల వలన ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కి వినిపించిన కథని లైన్లో పేటె పనిలో ఉన్నాడట బోయపాటి. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నట్లు సమాచారం. అప్పట్లో భద్ర సినిమా కథని మొదట అల్లు అర్జున్ కి బోయపాటి చెప్పాడు. అయితే అది తనకు సరైనది కాదని వదులుకోవడంతో రవితేజ ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు


అందాలతో చంపేసిన శృతి హాసన్ గ్లామర్

డాల్ శృతి హాసన్ తాజాగా ''పూజ ''చిత్రంలో నటించి తన అందాలతో ప్రేక్షకులను చంపేస్తోంది. విశాల్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వెండితెర పై తన అందాలను భారీగానే పరిచి ప్రేక్షకులకు కనువిందు చేసింది. పూజ చిత్రంలో శృతి నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా అందాలను చూపించడానికి మాత్రం కావల సిననంత స్కోప్ ఉండటం తో బాగానే రెచ్చిపోయింది. తెరపై అందాలను పరచడం శృతికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అవలీలగా అందాలను ఆరబోసి పసందు చేసింది. విశాల్ హీరోయిజం ,శృతి అందాలు ''పూజ '' చిత్రాన్ని మాస్ ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాయి.

టాలీవుడ్ P 19


ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం కావడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాధితులకు అండగా మేమున్నాం అంటూ మా ఈ ఎదుగుదలకు కారణమైన ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేమని మాకు చేతనైనంత సహాయం అందిస్తామని ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చిరంజీవి 50 లక్షలు (ఎంపి నిధులు ) బాలకృష్ణ 30 లక్షలు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 20 లక్షలు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ 50లక్షలు కృష్ణ 15 లక్షలు పవన్ కళ్యాణ్ 50లక్షలు సూర్య 25 లక్షలు మహేష్ బాబు 25 లక్షలు తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి 25 లక్షలు ఎన్టీఆర్ 20 లక్షలు అల్లు అర్జున్ 20 లక్షలు రేణుదేశాయ్ 20 లక్షలు ప్రభాస్ 20 లక్షలు విశాల్ 15 లక్షలు రామ్‌చరణ్ 15 లక్షలు కార్తీ 12.5 లక్షలు జ్ఞాన్ వేల్ రాజా 12.5 లక్షలు విజయనిర్మల 10 లక్షలు నితిన్ 10 లక్షలు రవితేజ 10 లక్షలు రామ్ 10 లక్షలు వివి వినాయక్ 10 లక్షలు త్రివిక్రమ్ శ్రీనివాస్ 10 లక్షలు కళ్యాణ్ రామ్ 10 లక్షలు సమంత 10 లక్షలు కాజల్ 5 లక్షలు బోయపాటి శ్రీను 7 లక్షలు హరీశ్ శంకర్ 3 లక్షలు ప్రకాశ్ రాజ్ 5 లక్షలు అల్లరి నరేష్ 5 లక్షలు శ్రీను వైట్ల 5 లక్షలు గోపిచంద్ 5 లక్షలు సునీల్ 5 లక్షలు పాప్ గాయని స్మిత 5లక్షలు బ్రహ్మానందం 3లక్షలు

20 P టాలీవుడ్

సందీప్ కిషన్ 2.5లక్షలు నిఖిల్ 2 లక్షలు పూరి ఆకాశ్ లక్ష 50 వేలు ప్రతాప్ కొలగట్ల,నందూ ,ఆలీ ,నవీన్ చంద్ర ,రాహుల్ ,రావురమేష్ ,రచయిత కోన వెంకట్ ,చిన్ని కృష్ణ ,రకుల్ ప్రీత్ సింగ్ ,సంపూర్నేష్ బాబు లు తలా ఒక లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. నగదు మాత్రమే కాకుండా మిల్క్ పౌడర్ ,మంచినీళ్ళు ,బియ్యం ,బిస్కెట్లు ,బ్రెడ్ లు కూడా బాధితులకు పంపించారు పలువురు సినీ ప్రముఖులు.


టాలీవుడ్ స్పందన అపూర్వం అమోగం

టాలీవుడ్ P 21


రెడీ అవుతున్న

గెడ్డం గ్యాంగ్

22 P టాలీవుడ్

తమిళంలో ఘనవిజయం సాధించిన ''సూదు కవ్వం '' చిత్రాన్ని తెలుగులో ''గెడ్డం గ్యాంగ్ '' పేరుతో రీమేక్ చేస్తున్నారు హీరో డా. రాజశేఖర్. చాలా కాలం తర్వాత రాజశేఖర్ నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది. మరోసారి రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మాన్ గా విశ్వరూపం చూపించనున్నారు. గతకొంత కాలంగా సరైన సక్సెస్ లేక సరైన చిత్రాలు రాక సతమత మౌతున్న రాజశేఖర్ కు ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం తో ఉన్నారు. సంతోష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. రాజశేఖర్ కూతుర్లు శివాని ,శివాత్మిక ఈ చిత్రానికి నిర్మాతలు కావడం విశేషం. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి గెడ్డం గ్యాంగ్ ని జనాలమీదకి వదలడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


ఆ నగ్న వీడియో నాది కాదంటున్న లక్ష్మీ రాయ్ లక్ష్మీ రాయ్ నగ్న వీడియో ఇంటర్ నెట్ లో దర్శనం ఇస్తోంది అని తెలియడంతో నెటిజన్లు తీవ్రంగా వెదుకుతున్నారు ఆ వీడియో కోసం. ఐతే ఆ నగ్న వీడియో లో ఉన్నది మాత్రం నేను కాదు మహా ప్రభో అని అంటోంది హాట్ భామ లక్ష్మీ రాయ్ . వెండితెర మీద వేడి వేడి అందాలను విరివిగా ఆరబోసి ప్రేక్షకుల గుండెల్లో మంటలు రేపుతున్న ఈ భామ దక్షిణాది న ఓ ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే . ఐతే నగ్న వీడియో లో ఉన్నది లక్ష్మీ రాయ్ కి దగ్గరి పోలికలు ఉండటం తో ఆమె లక్ష్మీరాయ్ అని అనుకోని ఆశగా చూస్తున్నారు . ఇంతకీ ఆ వీడియో లో ఉన్నది ఏమిటంటే బట్టలు మార్చుకుంటుండగా ఆ వీడియో ఎవరో కావాలని తీసారు కానీ అందులో ఉన్న భామ మాత్రం ఎవరో కరెక్ట్ గా చెప్పలేక పోతున్నారు ఐతే ఆ అమ్మాయి మాత్రం లక్ష్మీరాయ్ కి దగ్గరి పోలికలు ఉండటం తో ఆ అందాలను ఆస్వాదించ డానికి వళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నారు . బాలీవుడ్ ,టాలీవుడ్ ,కోలీవుడ్ ,మాలీవుడ్ ఇలా ఏ ఉడ్ లలో చూసిన అందమైన భామలు తమ అందాలను చూపించ డానికి ఏమాత్రం వెనుకాడడం లేదు సరికదా ఇంకా రొమాంటిక్ గా ఎలా ఉంటే బాగుంటుందో ,ఎలా అందాలను చూపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ భామలే సలహాలు ,సూచనలు ఇస్తున్నారు దర్శక నిర్మాతలకు . ఇక బికినీ అంటే చాలు ఎగిరి గంతేస్తున్నారు. ఈ భామ ఆ భామ అనే తేడా లేకుండా విచ్చల విడిగా అందాలను చూపించడానికి 2పీస్ బికినీ వేసి తెగ హొయలు పోతున్నారు. తాజాగా ఇషా గుప్తా బికినీ వేసి వీరంగం వేసింది . బాలీవుడ్ లో ఇప్పటికే తన ప్రత్యేకత నిలుపుకున్న ఈ భామ తాజాగా బికినీ వేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది .

బికినీ

అంటే ఎగిరి గంతేస్తున్నారు

టాలీవుడ్ P 23


బాహుబలి అనే పదానికి అసలు సిసలు నిర్వచనం లా ఉన్నాడు ప్రభాస్. బాహుబలి లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో మనం చూసి ఉన్నాం కానీ తాజాగా బాహుబలి 2015లో వస్తోంది అన్నట్లుగా విడుదలైన పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరి పోయింది. బాహుబలి అనే టైటిల్ కి సరైన నిర్వచనం లా నిలిచాడు ప్రభాస్ . దక్షిణాది లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో బాహుబలి కి ఎనలేని క్రేజ్ వచ్చింది.ప్రభాస్ సరసన అందాల ముద్దుగుమ్మలు అనుష్క ,తమన్నా లు నటిస్తుండగా రానా ప్రతి నాయకుడి పాత్రలో కనిపించ నున్నాడు .

24 P టాలీవుడ్

బాహుబలి అదిరిపోయిన ప్రభాస్ లుక్


బాలికని చూసి కంటతడి పెట్టిన పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటతడి పెట్టారు. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ ని చూడటానికి ఖమ్మం వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్నారి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకొని శ్రీజ ని పలకరించి మాట్లాడటానికి అన్ని విధాల చేసిన ప్రయత్నం ఫలించలేదు దాంతో శ్రీజ ఆరోగ్య పరిస్థితి చూసి చలించి పోయిన పవన్ కళ్యాణ్ శ్రీజ ...... శ్రీజ అంటూ కంటతడి పెట్టారు. చిన్నారి శ్రీజ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో తీవ్ర అనారోగ్యం పాలైన ఆమె పవన్ ని చూడాలని డాక్టర్లను ,తల్లిదండ్రుల ను కోరడం తో ''మేక్ ఏ విష్ '' సంస్థ వాళ్ళు పవన్ కి ఆ చిన్నారి కోరిక ని తెలియజేయడం తో స్పందించిన పవన్ తుఫాన్ బాధితులను పరామ ర్శించి తిరుగు ప్రయాణంలో ఖమ్మం చేరుకొని చిన్నారి కోరికని తీర్చాడు ఆ సమయంలో పవన్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు.

తుఫాన్ బాధితులను పరామర్శించిన బాలయ్య

హిందూపురం ఎం ఎల్ ఏ నటసింహం నందమూరి బాలకృష్ణ హుదుద్ తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. నిన్న సాయంత్రం పాయకరావు పేటలో తుఫాన్ బాధితులను పరామర్శించారు. ఈ రోజు వైజాగ్ లోని పలు ప్రాంతాలను సందర్శించి బాధితులకు ధైర్యాన్ని నూరి పోయనున్నారు బాలయ్య. బాలయ్య ఇప్పటికే తుఫాన్ బాధితుల కోసం 30లక్షల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటు 20టన్నుల బియ్యాన్ని ,అవసరమైన మందులను పంపించారు బాలయ్య. బాలయ్య ప్రజాప్రతినిధి కూడా కావడంతో ఆయన పర్యటనలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.

టాలీవుడ్ P 25


మెగా స్టార్ దర్శకత్వం వహిస్తాడా !

అవుననే అంటున్నాయి మెగా వర్గాలు ? ఇప్పటికే చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడెప్పుడు ఆరంభమవుతుందాని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమవుతోంది. కానీ ఆ వార్తలన్నీ వదంతులుగానే మిగిలిపోతుండటం మాత్రం మెగా అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. తాజాగా చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేంటంటే అన్నయ్య చిరంజీవి తన 150వ చిత్రానికి తనే దర్శకత్వం వహించేయాలనే ప్లాన్ లో ఉన్నారట? ఇప్పటివరకూ చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ వీరెవ్వరూ కన్ ఫార్మ్ అవ్వలేదు. అయితే తనకున్న అనుభవంతో తనే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తే ఈ ప్రాజెక్ట్ కి భారీ క్రేజ్ నెలకొంటుందని కూడా చిరు భావిస్తున్నారట. చిరుకి అపారమైన జడ్జిమెంట్ ఉందని పరిశీలకులు అంటుంటారు. తన తండ్రి జడ్జిమెంట్ మీద రామ్ చరణ్ కి కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే చిరంజీవి దర్శకత్వం వహించాలనే ఆలోచనకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి మంచి ప్రోత్సహం లభిస్తోందట. మరి తన 150 వ చిత్రానికి చిరు దర్శకత్వం వహిస్తాడో లేదో

మహేష్ తో మరో సినిమా తు న్న చేస్ 14 రీల్స్ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ఎవరికీ ఉండదు చెప్పండి ? అయితే ఆయనతో మూడు సినిమాలు తీస్తే అందులో రెండు భారి ఫ్లాప్ లు వచ్చిన తరువాత కుడా మల్లి మహేష్ తో సినిమ చేయడానికి రెడీ అయ్యారు ఆ నిర్మాతలు . దీన్నే పోయిన చోటే వెతుక్కోవటం అని అంటారు . వరుసగా రెండు ఫ్లాపులు కొట్టిన 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ మరో సినిమా మహేష్ తో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు . ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ‘దూకుడు’ హిట్ తో మంచి లాభాలను ఆర్జించిన ‘14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ సంస్థ ఆ తర్వాత ‘1నేనొక్కడినే’ ‘ఆగడు’ సినిమాలతో బిగ్ ఫ్లాపులను మూటగట్టుకుంది. అయినా మహేష్ పై ఉన్న మోజు మాత్రం ఆ ముగ్గుఋ నిర్మాతలకు తీరటం లేదు. అందుకే ఇంకో సినిమా తీసేందుకు సిద్ధం అవుతున్నారు. 14రీల్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో

26 P టాలీవుడ్


రెండు నెలల హాలిడే లో మెగా హీరో ! లేటెస్ట్ గా గోవిందుడు అందరి వాడెలే సినిమాతో బిజీగా పని చేసిన రామ్ చరణ్ రెండు నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ సమయాన్ని పూర్తిగా విదేశాల్లో గడపాలనుకుంటున్నాడు. రెండు నెలల హాలిడే పూర్తయిన తర్వాతే రాంచరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడనే విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడని సమాచారం. 'గోవిందుడు' షూటింగ్ లో పాల్గొన్న చరణ్ శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే, కొంతకాలం విదేశాల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాతే తన తదుపరి సినిమా షూటింగ్ ను ప్రారంభించాలని

నవంబర్ 14న అఖిల్ సినిమా ప్రారంభం సిసింద్రీ చిత్రంతో తెరంగేట్రం చేసి సక్సెస్ కొట్టిన చిన్నారి అఖిల్ నేడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. మనం చిత్రంలో కనిపించింది రెండు నిమిషాలే అయినప్పటికీ ........ ఆ గెస్ట్ రోల్ లోనే రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ నని అనిపించేలా అదరగొట్టాడు అఖిల్. ఆ రెండు నిమిషాల క్యారెక్టర్ కే ఎక్కడా లేని క్రేజ్ రావడమే కాకుండా ఒక్కసారిగా భారీ అంచనాలు పెంచాడు అఖిల్. అందుకే అఖిల్ ని హీరోగా పరిచయం చేసే సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగార్జున. ఐతే ఎట్టకేలకు కథ సిద్దం అయ్యిందని నవంబర్ 14న అఖిల్ కొత్త సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక దర్శకుడిగా వి వి వినాయక్ కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే .

టాలీవుడ్ P 27


రేష్మి ని ఇబ్బంది పెడుతున్న నెటిజన్ లు

తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు ఒక్క జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా రావడంతో రేష్మి సంతోషంగా ఉంది కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉంచేలా లేరు నెటిజన్లు . ఎందుకంటే ఆమె నటించిన పాత సినిమాలలోని క్లిప్పింగ్ లను ఏరికోరి మరీ పోస్ట్ చేస్తూ రేష్మి ని కామెంట్ చేస్తూ ఆమె వెంట పడుతున్నారు. అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుండి బయటకి వెళ్ళడంతో అదృష్టం వరించింది రేష్మి కి. అప్పటి వరకు రేష్మి అంటే అంతగా తెలియని వాళ్ళకి జబర్దస్త్ వల్ల అందరికీ పరిచయం అవ్వడమే కాకుండా హాట్ హాట్ గా చేస్తున్న యాంకరింగ్ వల్ల కొంతమంది అభిమానులను సంపాదించుకాగా మరికొంత మంది కావాలని ఆమెని టార్గెట్ చేస్తూ ఆమె వల్గర్ పిక్స్ పెడుతూ కామెంట్ చేస్తూ రేష్మి ని ఇబ్బంది పెడుతున్నారు.

28 P టాలీవుడ్


కమెడియన్ తో నటించడానికి రెడీ అయిన అనుష్క తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అనుష్క తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇస్తోంది. తమిళంలో కూడా రజనీకాంత్ తో నటిస్తున్న ఈ భామ తాజాగా తమిళ హాస్య నటుడు సంతానం సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . తమిళంలో ఆర్య, సంతానం కాంబినేషన్ లో మొదలయ్యే చిత్రంలో ఆర్య సరసన తమన్నా జంటగా నటిస్తుండగా హాస్య నటుడు సంతానం సరసన అనుష్క అయితే బాగుంటుందని ఆమెని అప్రోచ్ అవగా వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. ఈ వార్త కనుక నిజమైతే అనుష్క అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు భారీ చిత్రాలైన రుద్రమదేవి ,బాహుబలి లలో నటిస్తోంది.

సూర్యా ది గ్ రే ట్

తమిళ స్టార్ హీరోలు సూర్య ,కార్తీ లు తెలుగు రాష్ట్రంలో జరిగిన ఘోర విపత్తుకు స్పందించి తుఫాన్ బాధితుల సహాయార్ధం యాభై లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధి కి అందించనున్నారు. సూర్య 25లక్షలు ,కార్తీ 12. 5లక్షలు ,సూర్య ,కార్తీ ల బంధువు నిర్మాత జ్ఞానవేల్ రాజా 12. 5లక్షలు మొత్తం కలిపి సూర్య కుటుంబం 50లక్షల విరాళాన్ని ప్రకటించారు. తమిళనాట స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సూర్య ,కార్తీ లకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటం తో మమ్మల్ని ఇంతగా ఆదరించి అక్కున చేర్చుకున్న తెలుగు ప్రజలకు సహాయం అందించాలని భావించిన సూర్య నిజంగానే గ్రేట్ . అలాగే మరో తమిళ హీరో విశాల్ కూడా స్పందించి 15లక్షల విరాళాన్ని ప్రకటించారు.

టాలీవుడ్ P 29


పెళ్ళికి రెడీ అవుతున్న భామ

పూజ

తమిళంలో పలు చిత్రాల్లో నటించిన శ్రీలంక భామ పూజ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతోంది. ఇన్నాళ్ళు కెరీర్ పరంగా ఎంతో కొంత గ్రోత్ ఉంటుందని ఆశించి నప్పటికీ కెరీర్ పరంగా తను ఆశించిన అవకాశాలు రాకపోవడంతో దానికి తోడూ తనకు బాగా సన్నిహితులైన హీరో ఆర్య ,దర్శకులు బాల కూడా తనని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో పెళ్ళికి రెడీ అయిపొయింది. శ్రీలంక కి చెందిన తన సన్నిహితుడు దీపక్ షణ్ముగం తో ఏడడుగులు వేయడానికి పచ్చజెండా ఊపింది. తమిళంలో ''జె జె '' చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ భామ కి ఆ తర్వాత మరికొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా పేరు రాలేదు దాంతో కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసింది. ఆ సమయంలో తన ప్రేమికుడు అయిన షణ్ముగం తో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ సహజీవనం చేసింది. మొత్తానికి వచ్చే నెలలో అతగాడితోనే వివాహ నిశ్చితార్దం చేసుకొని డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట .

30 P టాలీవుడ్


బెడ్ రూం సీన్లలో రెచ్చిపోయిన ఇల్లీ బేబీ

ఉండీ లేనట్లుగా ఉండే సన్నని నడుము సుందరి ఇలియానా బాలీవుడ్ కి వెళ్ళాక బాగానే రెచ్చిపోతోంది. మనదగ్గర పొదుపుగా అందాలను చూపిన ఈ గోవా భామ బాలీవుడ్ లో మాత్రం ఏమాత్రం అడ్డూ అదుపు లేకుండా ఉన్నవన్నీ చూపిస్తూ పిచ్చేక్కిస్తోంది. ఇటీవలే హాట్ బికినీ వేసి సంచలనం రేపిన ఈ భామ తాజాగా సైఫ్ ఆలీఖాన్ తో నటిస్తున్న చిత్రం ''హ్యాపీ ఎండింగ్''. ఆ చిత్రంలో బెడ్ రూం లో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించిందట ఈ గోవా భామ. సెకండ్ హ్యాండ్ సైఫ్ ఆలీఖాన్ తో బెడ్ పైన కింద మీద పడుతూ కౌగిలింతలతో ,ముద్దులతో బాగానే రెచ్చిపోయి రసిక ప్రేక్షకులకు నయనానందం కలిగించనున్నారట !బెడ్ రూం సీన్లన్నీ చాలా చాలా హాట్ గా రూపొందాయట !ఈ చిత్రం నవంబర్ 21న రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన తర్వాత మరెంత సంచలనం సృస్టించనుందో చూడాలి .

టాలీవుడ్ P 31


భామ కోసం డైరెక్టర్లు ఇద్దరూ కొట్టుకున్నారట

కెమెరా మెన్ అశోక్ కుమార్ మృతి

అందమైన భామ కోసం ఇద్దరు దర్శకులు గల్లా పట్టుకొని మరీ కొట్టుకున్నారట ! ఐతే ఇది జరిగింది తెలుగు సినీ రంగంలో కాదు బాలీవుడ్ లో . బాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించిన మర్డర్ 2,ఆషికీ 2,ఏక్ విలన్ ల దర్శకుడు మొహిత్ సూరి తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేస్తోంది లీనా టాండన్ . ఐతే ఈ భామ ఇంతకుముందు మరో బాలీవుడ్ దర్శకుడు విశాల్ దగ్గర కొంతకాలం దర్శకత్వ శాఖ లో పనిచేసి మానేసి అక్కడ నుండి మొహిత్ సూరి దగ్గర చేరింది. ఐతే ఈ దర్శకులిద్ద రూ గొడవ పడటానికి ఈ భామనే కారణం. ఎలాగంటే పబ్ లో విశాల్ ఉన్న సమయంలో మొహిత్ సూరి తో కలిసి రావడమే కాకుండా అతగాడితో చాలా సన్నిహితంగా లీనా వ్యవహరించడం తో కోపం ఆపుకోలేక బాతుల వర్షం కురిపించాడు దర్శకులు విశాల్ . దాంతో మొహిత్ కల్పించికొని గొడవకు దిగడంతో ఇద్దరూ కాలర్లు పట్టుకు న్నారట ,అంతేనా .... పిడి గుద్దులు కూడా గుద్దుకున్నారట ! ఇదంతా ఎందుకంటే ఒకప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న లీనా ఇప్పుడు మరొకరితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేని విశాల్ బూతుల వర్షం కురిపించాడట . ఇద్దరు దర్శకులు కాలర్లు పట్టుకొని కొట్టుకుంటుండటం తో కొంతమంది విడిపించారట ! అదీ విషయం .

తెలుగులో ''అభినందన '' వంటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ చెన్నై లో మరణించారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్ కుమార్ కి చెన్నై లోనూ ,హైదరాబాద్ లోను పలు ఆసుపత్రుల లో వైద్యం చేయించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. భారతీయ భాషల్లోని దాదాపు వంద సినిమాలకు ఆయన కెమెరామన్ గా పనిచేశారు. జీన్స్ లాంటి అద్భుతమైన చిత్రానికి అశోక్ కుమార్ కెమెరామెన్ గా పనిచేసారు. ఇక 1988లో వచ్చిన అద్భుత ప్రేమకథా చిత్రం ''అభినందన ''తో దర్శకుడిగా తన ప్రతిభా పాటవాలను చూపారు అశోక్. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో ,హిందీ లలో కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

32 P టాలీవుడ్


యంగ్ టైగర్

ఎన్టీఆర్ సినిమా 25నుండి గోవా షెడ్యూల్

H

ఎన్టీఆర్ -పూరి జగన్నాద్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఈ నెల 25నుండి గోవా షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే గోవా షెడ్యూల్ జరగాల్సి ఉన్నప్పటికీ ఫెడరేషన్ సమస్యలతో షూటింగ్ లు నిలిచి పోయిన విషయం తెలిసిందే. దాంతో సినిమా షూటింగ్ ల షెడ్యూల్ లన్నీ అప్సెట్ అయ్యాయి ఐతే తాజాగా షూటింగ్ లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతుండటం తో ఎల్లుండి నుండి గోవాలో షెడ్యూల్ మొదలు కానుంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

టాలీవుడ్ P 33


పబ్లిగ్గా ముద్దుల వర్షం కురిపించారు

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సంతోషాన్ని ఆపుకోలేక దీపికా పై ముద్దుల వర్షం కురిపించాడు. ఇక ఆ ముద్దుల గోల కి స్పందించిన హీరోయిన్ దీపికా పడుకొనే కూడా షారుఖ్ కి ముద్దులు పెట్టేస్తూ రెచ్చిపోయింది. ఈ సంఘటన చూసిన దర్శకురాలు ఫరా ఖాన్ కి కూడా మూడొచ్చింది ఇంకేముంది దీపికా తో కలిసి షారుఖ్ కి ఏకకా లంలో ఘాటు ముద్దులిచ్చి సంతోషాన్ని పంచుకున్నారు. అంతేనా అక్కడే ఉన్న బొమన్ ఇరానీ ,సోనూ సుద్ లకు కూడా ముద్దులిచ్చి అందరూ కలిసి ముద్దుల వర్షం కురిపించారు. ఇదంతా పబ్లిగ్గా జరగడంతో ఇక ఫోటోగ్రాఫర్లకు పండగే పండగట ! దాంతో ఆ ముద్దుల వర్షాన్ని తమ కెమరా లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు. ఈ ముద్దుల గోల కు కారణం ఏమిటంటే ఇటీవల షారుఖ్ ,దీపికా లు నటించిన ''హ్యాపీ న్యూ ఇయర్ '' చిత్రం టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను సాధిస్తున్డటం తో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు . ఆ వేడుకలో ఇక షారుఖ్ ,దీపికా ,ఫరా ఖాన్ ,బొమన్ ఇరానీ ,సోనూ సుద్ లు ముద్దుల వర్షం కురిపించారు.

34 P టాలీవుడ్


శ్రద్దా దాస్ అడల్ట్ సినిమాలో రెచ్చిపోయిన

తెలుగులో బోలెడు సినిమాల్లో శ్రద్దా దాస్ నటించినప్పటికీ ఈ భామకి సరైన సక్సెస్ దక్కలేదు ,అయినప్పటికీ అందాల ఆరబోత కు ఏమాత్రం వెనుకాడక చాలా చిత్రాల్లో అందాలతో చంపేసినప్పటికి ఈ భామ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోనేలేదు దాంతో ఇక లాభం లేదనుకొని బాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ తో వస్తున్న ''జిద్ '' అనే సినిమాలో రెచ్చిపోయి తన సత్తా ఏంటో చూపించింది. ఇటీవల విడుదలైన జిద్ ట్రైలర్ చూస్తుంటే ఆ చిత్రంలో నటించింది మన శ్రద్దా నేనా అని ఆశ్చర్య పోయేలా రెచ్చిపో యింది. పైగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్న చిత్రాలన్నీ అడల్ట్ కంటెంట్ తో వస్తుండటంతో ఇక ఓపిక పట్టలేక ఇంకొంత కాలం వేచి చూస్తే వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఇప్పుడే ఉన్నవన్నీ చూపిస్తూ ఎంతగా రెచ్చిపోవాలో అంతకు రెట్టింపు స్థాయి లో రెచ్చిపోయి రొమాన్స్ సాగించింది. మరి ఈ రకంగానైన సక్సెస్ కొడుతుందో చూద్దాం.

టాలీవుడ్ P 35


బాలయ్య సినిమా సంక్రాంతికి రావడం లేదు

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఇప్పుడు చెబుతున్న దాని ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సత్య దేవా దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్నప్పటికి ఇంకా పనులు మిగిలి ఉన్నందున దానికి తోడూ బాలయ్య కు కలిసి వచ్చిన వేసవి ని అనుగుణంగా మార్చుకునేందుకు మార్చిలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట ! ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష ,రాధికా ఆప్టే లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి పలు టైటిల్స్ అనుకున్నప్పటికీ చివరకు ''లయన్ '' దగ్గర ఆగిపోయారట ! ఐతే ఆ టైటిల్ ని ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. మొత్తానికి బాలయ్య సినిమా సంక్రాంతి కి వస్తుందని ఆశించినప్పటికీ ...... బాలయ్య సంక్రాంతి బరిలోనుండి తప్పుకొంటున్నాడని తాజా సమాచారం.

సుకుమార్

్త సినిమా 9నుండి కొత

36 P టాలీవుడ్

సుప్రసిద్ద దర్శకులు సుకుమార్ నిర్మాతగా మారి తన మిత్రులతో కలిసి ఉయ్యాల జంపాల ఫేం రాజ్ తరుణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం నవంబర్ 9న ప్రారంభం కానుంది. కరెంట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ ప్రేమ కథా చిత్రం తెరకెక్కనుంది. రాజ్ తరుణ్ సరసన షీనా బజాజ్ నటించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. క్యూట్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తన స్నేహితులైన విజయ్ బండ్రేడ్డి ,థామస్ రెడ్డి ల సహకారం తో నిర్మిస్తున్నారు.


ఇద్దరు హీరోలతో

తమన్నా

రోమాన్స్ !

లేటెస్ట్ గా మహేష్ బాబు తో నటించిన ఆగడు ఫ్లాప్ అవ్వడం తో పాటు అటు బాలీవుడ్ లో కూడా తను నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడుతున్నాయి. దాంతో ఎలాగైనా సరే మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉంది మిల్కీ బ్యూటి తమన్నా ? ప్రస్తుతం బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక కీలకపాత్రలో నటిస్తోందే తప్ప మిగతా సినిమాలేవీ లేవు . అందుకే ఈ అమ్మడు సినిమా అవకాశాలకోసం సౌత్ చిత్రపరిశ్రమలో బాగానే చక్కర్లు కొడుతోందని సమాచారం! వరుస ఫ్లాపుల కారణంగా స్టార్ డమ్ ను కోల్పోయిన ఈ బ్యూటీ తిరిగి తన స్టార్ డమ్ ను సంపాదించుకోవడం కోసం నానాతంటాలు పడుతోందని సమాచారం . ఈ నేపథ్యంలో ఈ అమ్మడు ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేయడానికి సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయి? ఇంతకి ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే అక్కినేని నాగార్జున తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్లాన్ లో వున్నారని, అయితే ఇందులో హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాకపోవడం వల్లే ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. మల్టీస్టారర్ కావడం వల్ల నిన్నమొన్నటివరకు ఇందులో ఇద్దరు హీరోయిన్లు వుంటారని అనుకున్నారు కానీ.. తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం ఒకే హీరోయిన్ వుంటుందని సమాచారం! ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఎంతోమందిని విశ్లేషించిన అనంతరం చివరకు మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకున్నారని యూనిట్ వర్గాల సమాచారం! సో ఇద్దరు హీరోలతో రొమాన్స్ చేయడానికి ఈ భామా ఓకే అందట !

టాలీవుడ్ P 37


మళ్ళీ ఆ భామతో చేయాలనీ ఆశ పడుతున్న

ై చతూ

నాగచైతన్య హీరోగా శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై కొండా విజయ్కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్మీట్ను బుధవారం అన్నపూర్ణ ఏడెకరాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు విజయ్కుమార్ కొండా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు సుమన్, సత్యం రాజేష్, మధునందన్, అమిత్కుమార్, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల, కెమెరామెన్ ఐ.ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది లవ్స్టోరీయే కాదు, మంచి ఫీల్గుడ్ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ రావాలంటే కంప్లీట్ ఫ్యామిలీ వుండాలి. థాంక్యూ టు ‘ఒక లైలా కోసం’ ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ 25వ చిత్రానికి ఇలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం. ఇదే ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చెయ్యాలని వుంది’’ అన్నారు.హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ ` ‘‘ఒక బ్యూటీఫుల్ మూవీలో అన్నపూర్ణ స్టూడియోస్లాంటి పెద్ద బేనర్లో చెయ్యడం మరింత ఆనందాన్ని కలిగించింది. ఇండస్ట్రీలోని అందరి నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాని ఆరు సార్లు చూశాను. ఈ సినిమా షూటింగ్ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశారు. నాగచైతన్య మంచి కోస్టార్. అతనితో నటించడం చాలా ఎక్సైట్ అయ్యాను’’ అని అన్నారు. దర్శకుడు విజయ్కుమార్ కొండా మాట్లాడుతూ ` ‘‘ఈ సినిమాని పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముందుగా నాగార్జునగారికి, చైతుకి థాంక్స్ చెప్తున్నాను. ఈరోజుల్లో ఐటమ్ సాంగ్ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా హోల్ ఫ్యామిలీ చూడగలిగే మంచి స్క్రిప్ట్ చెప్పగానే చాలా బాగుంది విజయ్ మనం చేస్తున్నాం అని ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ సక్సెస్కి కారణమైన యూనిట్లోని ప్రతి ఒక్కరికీ థాంక్స్. నాకు ఫేస్బుక్లో, ట్విట్టర్లో కార్తీక్లా ప్రేమించే అబ్బాయి కావాలని మెసేజ్లు వస్తున్నాయి. ఆడియన్స్కి ఈ సినిమా ఇంత దగ్గరగా వెళ్ళినందుకు చాలా ఆనందంగా వుందని ''అన్నారు.

38 P టాలీవుడ్


హ కుట్ న్ టిన సి క తేనె ని టీ

అందాల బొద్దుగుమ్మ హన్సిక ని ఓ తేనెటీగ కుట్టడంతో చేయి వాపు వచ్చిందట !ఈ సంఘటన ఓ తమిళ సినిమా షూటింగ్ లో జరిగింది. ఊటీ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో ఓ తేనెటీగ వచ్చి హన్సిక చేయిని కుట్టడంతో వెంటనే చేయి వాపు రావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మళ్ళీ షూటింగ్ కి రెడీ అయ్యిందట . ఐతే ఆమెని రెస్ట్ తీసుకోమని చిత్ర యూనిట్ కోరినప్పటికీ నేను విశ్రాంతి తీసుకోవడం వల్ల నిర్మాతకు బోలెడు నష్టం వస్తుందని అందుకే వెంటనే షూటింగ్ లో పాల్గొంటానని చెప్పి పాట ని పూర్తి చేసిందట. వ్రుత్తి పట్ల అంత అంకిత భావం ఉంది కాబట్టే గాయాన్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొని శభాస్ అనిపించుకుంది హన్సిక ,అందుకే తమిళనాట నెంబర్ వన్ హీరోయిన్ గా దున్నేస్తోంది.

టాలీవుడ్ P 39


40 P టాలీవుడ్


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.