Tollywood Magazine Telugu June - 2015

Page 1

JUNE 2015 VOL 12 ISSUE 6

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


భా

రి స్తాయిలో రూపొందిన బాహుబలి విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా తరువాత ప్రబాస్ నటించే సినిమాకు రంగం సిద్దం అయ్యింది. రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ దొరికింది. బాలీవుడ్ హాట్ భామ అలియా భట్ ఈ సినిమాలో హీరోయన్ గా నటిస్తుందట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. మిర్చి, జిల్ చిత్రాలను నిర్మించిన యువి క్రియేషన్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అలియా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అన్నట్టు ఈ భామ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె. మరి టాలీవుడ్ లో అలియా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి . వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.








 తె

లుగులో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ ఎవరయ్యా అని అంటే టక్కున చెప్పే పేరు సమంత కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు సినిమా సమంత చేతిలో లేదు . కానీ రింగ్ రివర్స్ అయినట్లుగా తమిళనాట సక్సెస్ సాధించాలని ఎన్నో రోజులుగా ఆశపడుతున్న సమంత కు ఇప్పుడు పరిస్థితులు కలిసి వచ్చాయి . కత్తి సూపర్ హిట్ సాధించడంతో సమంత కు అవకాశాల వెల్లువ తలెత్తింది . ప్రస్తుతం తమిళ అగ్ర హీరోలైన సూర్య ,విజయ్ ,అజిత్ ,విక్రం,ధనుష్ లతో వరుసగా చిత్రాలు చేసే అవకాశం రావడంతో సమంత ఉబ్బి తబ్బిబ్బై పోతోంది . ఇన్నాళ్ళు రచ్చ గెలిచిన సమంత తాజాగా ఇంట కూడా గెలుస్తోంది . Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JUNE 2015

టాలీవుడ్ P 3






చి

రంజీవి ప్రస్తుతం పెద్ద సమస్య ఎదుర్కొంటున్నాడు . దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత కెమెరా ముందుకు వస్తుండటం తో మెగా అభిమానులు సంతోషంగా ఉండగా

చిరు మాత్రం ఓ సమస్య ని ఎదుర్కొంటున్నారు . చిరుకి సమస్య ఏంటి ? అనేదే కదా మీ ప్రశ్న .............. చిరంజీవి కి ఇప్పుడు 59 ఏళ్ళు కావడంతో అయన తో నటించే హీరోయిన్ కోసం తీవ్రంగా చూస్తున్నారు . నయనతార 3కోట్లు ఇస్తే నటిస్తానని చెప్పడంతో ప్రస్తుతానికి ఆమెని పక్కన పెట్టారు ఇక ఉన్న హీరోయిన్ లలో అనుష్క అయితేనే కొద్దిగా బెటర్ గా ఉంటుంది ఇక మిగతా వాళ్ళ ని చిరు పక్కన ఊహించు కోలెం ఎందుకంటే జోడీ బాగా ఉండాలి లేదంటే స్టాలిన్ చిత్రంలో త్రిష తో చేసినట్లుగా తెలిసిందే కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు . యంగ్ హీరోయిన్ లు చిరు పక్కన సెట్ కారు అందుకే చిరు హీరోయిన్ ఎవరు అనేది ఒక సమస్య లా మారింది మరి ఎవరిని సెట్ చేసి చూపిస్తారో చూడాలి .

 బ ్ర

హ్మానందం ఎండవేడికి భయపడిపోయాడు అందుకే గత మూడు నాలుగు రోజులుగా బయటకు రావడానికి జంకుతున్నాడు . బ్రహ్మి ఎందుకు ఇంతగా భయపడుతున్నాడో తెలుసా ........... తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి ,ఎండల వల్ల ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వందల మందికి పైగా చనిపోయారు . దాంతో జనాలు బయటకి రావడానికి భయపడి పోతున్నారు . ఇక బ్రహ్మి విషయానికి వస్తే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో బయటకి వస్తే ఇబ్బందులు తప్పవు కాబట్టి ఎందుకు రిస్క్ అనుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాడు .

4 P టాలీవుడ్








భా

రీ బడ్జెట్ తో దర్శక నిర్మాత గుణశేఖర్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ''రుద్రమదేవి ''. వేసవి కంటే ముందే రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ సకాలంలో మాత్రం రిలీజ్ కాలేదు ఇప్పుడేమో రిలీజ్ కు ఎన్నో తంటాలు పడుతోంది . అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటించాడు దాంతో కొంత బెటర్ గానే అన్ని ఏరియాలు అమ్ముడు పోతాయి అని అనుకున్నాడు గుణశేఖర్ కానీ రింగ్ రివర్స్ అయ్యింది . రుద్రమదేవి కి 50కోట్ల పైనే ఖర్చు కావడంతో గుణ చెప్పే రేట్లతో బయ్యర్ల దిమ్మ తిరిగి పోతోంది . పైగా సినిమా రిలీజ్ కావాలంటే ఫైనాన్షియర్ల నుండి తీసుకున్న సొమ్ము మొత్తం తిరిగి చెల్లించాలి లేదంటే రిలీజ్ కానివ్వరు . దాంతో ఆర్ధిక ఇబ్బందులతో రుద్రమదేవి సతమతమౌతోంది .

        p 



 !

కప్పటి హాట్ హీరోయిన్ లిజి తాజాగా ఆత్మకథ రాయడానికి రెడీ అయ్యింది . 80వ దశకంలో తెలుగు ,తమిళ,మలయాళ భాషల్లో నటించిన ఈ భామ దర్శకులు ప్రియదర్శన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇద్దరు పిల్లలు కూడా, వాళ్ళు ప్రస్తుతం అబ్రాడ్ లో చదువుకుంటున్నారు ,అయితే గతకొంత కాలంగా లిజి ,ప్రియదర్శన్ ల మద్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో విడిపోయారు . వాళ్ళిద్దరిని కలపడానికి కమల్ హాసన్ ట్రై చేసినప్పటికీ కుదరలేదు . అయితే భర్త కు దూరంగా ఉంటున్న ఈ భామ ఆత్మకథ రాయాలని నిర్ణయించుకుంది . తన జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలను రాయాలని నిర్ణయించుకుంది ,అయితే అదే సమయంలో భర్త ప్రియదర్శన్ తో విభేదాలు ఎందుకు వచ్చాయి ,ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది అనే విషయాలను కూడా రాస్తుందా ? లేదా అన్నది తెలియాలి .

టాలీవుడ్ P 5


  

క్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ''బాహుబలి '' అన్న విషయం తెలిసిందే . దాదాపు 200 కోట్లతో తెరకెక్కిన బాహుబలి మొదటి భాగానికి వంద కోట్లకు పైగా బడ్జెట్ అయ్యిందని తెలుస్తోంది . అందుకే ఆ బడ్జెట్ బ్రేక్ కావాలంటే ఒక్క తెలుగులోనే కాకుండా తమిళంలో అలాగే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు . అయితే సినిమా ఏమాత్రం బాగున్నా 120 కోట్లను సాధించడం పెద్ద కష్టం కాదు కానీ తేడా వస్తే మాత్రం అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అందుకే మరో ప్లాన్ కూడా వేస్తున్నారు బాహుబలి దర్శక నిర్మాతలు . టికెట్ రేట్లను పెంచి భారీ వసూళ్ళ ని సాధించాలని బావిస్తున్నారు . ఇప్పటికే మల్టీ ప్లేక్స్ లలో 150 రూపాయలుగా ఉన్న టికెట్ రేటు ని 250 రూపాయలకు పెంచాలని అలాగే మిగతా థియేటర్ లలో కూడా మొదటి వారంలో టికెట్ రేటు ని డబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అందుకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి టికెట్ రేట్ లను పెంచేలా అనుమతి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ ప్రయత్నం నెరవేరితే బాహుబలి రికార్డుల మోత మోగించడం ఖాయం . గతంలో కూడా అగ్ర హీరోల చిత్రాలకు మొదటి వారం టికెట్ రేట్లను పెంచుకునే సౌలభ్యం కల్పించారు కాబట్టి జక్కన్న ప్రతిపాదన ను రెండు ప్రభుత్వాలు అంగీకరిస్తాయేమో . అయితే దీనివల్ల నష్టపోయేది మాత్రం సామాన్య ప్రేక్షకులే .

6 P టాలీవుడ్






స్నే

హ నెల తప్పడంతో సన్నాఫ్ సత్యమూర్తి షూటింగ్ సమయంలో ఆ చిత్ర యూనిట్ స్నేహ ని మహారాణి లా చుసుకున్నారట . ఇక మన నటకిరీటి రాజేంద్రప్రసాద్ అయితే ఇంటి నుండి నాలుగు రకాల మామిడికాయ పచ్చళ్ళను తీసుకొచ్చి కొసిరి కొసిరి మరీ తినమని చెప్పాడట . కడుపుతో ఉన్న సమయంలో ఆడవాళ్లు



పుల్లగా ఉండే వాటిని ముఖ్యంగా మామిడి ,చింతకాయ లను బాగా తింటారనే విషయం అందరికి తెలిసిందే . అందుకే రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా మామిడి పచ్చళ్ళని తీసుకొచ్చి స్నేహ కి ఇచ్చాడట . ప్రస్తుతం స్నేహకు ఏడో నెల కావడంతో ఆమెని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు భర్త ప్రసన్న .



పా

పం సన్నీ లియోన్ కి బ్యాడ్ టైం మొదలయినట్లుంది ,వరుసగా కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి . ఇప్పటికే మహారాష్ట్ర లో ఓ మహిళ సన్నీ పై కేసు నమోదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సన్నీ లియోన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు . ఇక చెన్నై లో కూడా కేసు నమోదు అయ్యింది . తాజాగా అరింజయ్ జైన్ అనే వ్యక్తి సన్నీ పై కేసు పెట్టాడు . ఒక సన్నీ లియోన్ పైనే కాకుండా గూగుల్ సీఈ ఓ పైన ,బాలీవుడ్ మేగజైన్ పై కేసు పెట్టాడు . విచ్చలవిడిగా సన్నీ లియోన్ ప్రవర్తిస్తోందని ,అసభ్యకరమైన ప్రవర్తన మాత్రమే కాకుండా ఓ భారతీయ మహిళ వ్యవహరించ కూడని రీతిలో వ్యవహరించిందని పోలీసులకు ఫిర్యాదు చేసాడు .

టాలీవుడ్ P 7


  బా

హుబలి కి అత్యంత భారీ బడ్జెట్ అయ్యిందని ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో అలాగే హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు అలాగే సాటి లైట్ రూపంలో కూడా ఈ మూడు భాషల్లో కలిపి 20కోట్ల నుండి 25కోట్ల వరకు రావచ్చు . ఇక థియేట్రికల్ రూపంలో మూడు భాషల్లో కలిపి వంద కోట్ల పైనే వచ్చే అవకాశం ఉంది మరి అటువంటి సమయమ్లో టికెట్ రేటు ని డబుల్ చేయాలనీ అనుకోవడం దారుణం . సామాన్యుడి వినోద సాధనం సినిమా అలాంటి సినిమా సామాన్యుడికి అందుబాటులో ఉంటేనే మంచిది లేదంటే ఇలాగే టికెట్ రేట్లను పెంచుకుంటూ పొతే ఇక సినిమాలను చూసేవాళ్ళు మరింతగా తగ్గే అవకాశం ఉంది . ఇప్పటికే మహిళా

8 P టాలీవుడ్

ప్రేక్షకులు సినిమాకి దూరం అయి బుల్లితెర కు అంకితం అయ్యారు ,అలాగే కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళాలంటే సామాన్యుడికి పెద్ద భారం కావడంతో వాళ్ళు కూడా సినిమాకి దూరం అయ్యారు . ఇక వస్తున్నది యువత మాత్రమే వాళ్ళలో కూడా అత్యధికులు మద్య తరగతి వాళ్ళు ,టికెట్ రేట్లను కనుక పెంచితే అది వాళ్ళపై పెను భారమే అవుతుంది . కాబట్టి టికెట్ రేటు పెంచాలనే ఆలోచన ని పక్కన పెట్టి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూడాలి అప్పుడే ఎక్కువ మంది సినిమాకు వస్తారు బాగుంటే పెద్ద హిట్ చేసి మీ డబ్బుల పెట్టెని బాగా నింపుతారు . కాబట్టి ఆ ఆలోచనని విరమించుకోండి జక్కన్న . బాహుబలి ని సామాన్యుడికి అందేలా చూడండి .


    



వ దశకంలో తెలుగు ,తమిళనాట కుర్రకారు గుండెల్లో మంటలు రేపిన నటి కుష్బూ . తమిళనాట ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఈ భామ ఇటీవల రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్డటంతో ఇకపై సినిమాలల్లో నటించాకుడదని నిర్ణయించుకుంది . సినిమాలు అంగీకరిస్తూ ,అటు రాజకీయాల్లో తిరుగుతూ రెండు పడవలపై కాళ్ళు పెట్టి ప్రయాణించడం ఇష్టం లేక ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంది . అందుకే ఇక నా సినీ ప్రస్థానం ముగిసినట్లేనని ప్రకటించేసింది కుష్బూ . ఆమధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ వచ్చే సంవత్సరం తమిళనాట ఎన్నికలు ఉన్నందున ఇకపై పార్టీ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించి కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆశ పడుతోంది . మరి ఆంటీ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది చూడాలి .

80



 బా

లీవుడ్ హాట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రంలో బెడ్ రూం సీన్లు ,అలాగే బోలెడు రొమాంటిక్ సీన్లు ఉన్నాయట ''ఎక్స్ ఎక్స్ ఎక్స్ '' చిత్రంలో . అందుకే పలువురిని వడబోసి బోలెడు కండీషన్లు పెట్టి నటీనటులను ఎంపిక చేసుకుంది ఏక్తా . ఇక ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు ఎక్కువ ఉండటమే కాకుండా నగ్న దృశ్యాలు కూడా ఎక్కువే కావడంతో యూనిట్ మద్య ఆ సన్నివేశాల్లో నటించడం ఇబ్బంది పడతారు నటీనటులు ముఖ్యంగా ఆడవాళ్లు . అందుకే శృంగార సన్నివేశాలు తీసే సమయంలో తక్కువమంది యూనిట్ సభ్యులు ఉండేలా అలాగే కెమెరా పర్సన్ మగవాడు కాకుండా ఒక లేడి అయితే బాగుంటుందని భావించిన దర్శకులు కెన్ ఘోష్ లేడి కెమెరా పర్సన్ ని తీసుకున్నారట . దాంతో శృంగార సన్నివేశాల్లో కానీ నగ్న దృశ్యాల్లో కానీ ఇక సంకోచం లేకుండా నటిస్తారు .

టాలీవుడ్ P 9


   

బా

హుబలి లో నేను నటించలేదు మహా ప్రభో అంటున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య . బాహుబలి సెకండ్ పార్ట్ లో సూర్య గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఖండించాడు హీరో సూర్య . బాహుబలి లో చిన్న వేషం ఇచ్చినా చెయ్యడానికి నేను రెడీ కానీ నాకు అటువంటి అవకాశం రాలేదు అందుకే మీ ద్వారా రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తునాను నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినా చేస్తాను అని తన మనసులోని మాటని బయట పెట్టాడు సూర్య . మరి జక్కన్న సూర్య కు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి .





ల్లు అర్జున్ దేశముదురు చిత్రం కోసం కండలు పెంచి దేహముదురు అనిపించుకున్నాడు మళ్ళీ ఇన్నాళ్ళకు అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా కండలు పెంచుతున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో బాగానే

10 P టాలీవుడ్

కష్టపడుతున్నాడు అల్లు శిరీష్ . అయితే సక్సెస్ కావాలంటే కండలు పెంచితే సరిపోదు సరైన కథ కథనాలు ఉండాలి . అయితే ఇప్పుడు మంచి కథ దొరికిందని తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు శిరీష్ . అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాత కొడుకు అయినప్పటికీ శిరీష్ కు ఇంకా హిట్ లభించకపోవడంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు .


పూ

ర్తి తెలంగాణ కళాకారులు, సాంకేతిక నిపుణులతో తెరకెక్కిన ‘బందూక్’ చిత్ర ఆడియో సీడీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తన క్యాంపు ఆఫీస్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ‘బందూక్’ చిత్ర నిర్మాత గుజ్జ యుగంధర్రావు, దర్శకుడు లక్షణ్ మురారీ(బాబీ), కో-డైరెక్టర్ రమేష్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్ఎల్ఎ గాదరి కిషోర్, ప్రభుత్వ సలహాదారుడు విద్యాసాగరరావు, ముఖ్యమంత్రి ఓఎస్డి దేశపతి శ్రీనివాస్లు పాల్గొన్నారు. సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణ పోరాట ఉద్యమ నేపథ్యాన్ని విస్తరిస్తూ.. పూర్తిగా తెలంగాణ కళాకారుల, సాంకేతిక నిపుణులతో ‘బందూక్’ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఈ చిత్రంలోని పాటలు, అలాగే చిత్రం మంచి విజయం సాధిస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తెలంగాణ చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులు మరింత







   

క్రియాశీలకంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో ఈ సినిమా ప్రివ్యూని కూడా చూస్తాను..’’ అన్నారు. శపతి శ్రీనివాస్, మిధున్రెడ్డి, చైతన్య, జోషి, దేవా, మధు, శహెరా మొదలగువారు ఈ చిత్ర తారాగణం.

దే

సౌ

త్ క్రేజీ భామ శృతి హసన్ కు ఓ హీరో డిన్నర్ ఇచ్చాడట ? డిన్నర్ ఇవ్వడమే కాదు తానూ స్వయంగా బిరియాని వండి ఆ రుచి శృతి కి చూపించాడట ! అవును ఇంతకి ఆ హీరో ఎవరనుకున్నారు? హీరో అజిత్. అజిత్ హీరోగా నటిస్తున్న అచ్చమిల్లై సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శృతి హసన్. ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న శృతి హసన్ కు తన వంట రుచి చూపించాడట అజిత్. అప్పుడప్పుడు అజిత్ షూటింగ్ సమయం లో యూనిట్ కు బిరియాని వండి వడ్డించడం అలవాటు. అయన బిరియాని చేసాడంటే బాగా టేస్ట్ గా ఉంటుందని అంటుంటారు. అలగే ఈ సినిమా షూటింగ్ లో కుడా శ్రుతికి తన బిరియాని రుచి చూపించాడట. బిరియాని తిన్న శృతి బాగుందని చెప్పడమే కాదు లొట్టలేసుకుని మరి తిన్నదట ? అది విషయం !

టాలీవుడ్ P 11


  ప

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దాసరి నారాయణరావు ల కాంబినేషన్ లో ప్రారంభమయ్యే కొత్త సినిమా అక్టోబర్ లో పట్టాలెక్కనుందట . ఇటీవలే బొగ్గు స్కాం లో బెయిల్ పొందిన దాసరి ప్రస్తుతం కథలను సెలెక్ట్ చేయడంలో బిజీ గా ఉన్నాడట . పవన్ కోసం మూడు కథలను ఎంపిక చేసాడట వాటిలో పవన్ దేనికి పచ్చజెండా ఊపితే ఆ కథతో సినిమా నిర్మించడానికి దాసరి సిద్దం అవుతున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరో మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు . పవన్ కళ్యాణ్ ఏ కథ ని ఎంపిక చేసుకుంటారో అలాగే ఏ దర్శకుడి తో సినిమా చేస్తాడో చూడాలి .



 తె

లుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదని ,ఫైనాన్షియర్ లని మోసం చేసేవాళ్ళని లఫూట్ నాయాళ్ళ ని ఇక కొంతమంది నిర్మాతలు సిండికేట్ గా ఏర్పడి చిన్న నిర్మాతల జీవితాలతో ఆటాడుకోవాలని చూస్తున్నారని అటువంటి వాళ్ళ ఆగడాలను సహించేది లేదని అన్నారు మోహన్ బాబు . త్వరలోనే సిండికేట్ అయిన నిర్మాతల గురించి ఓ ప్రెస్ మీట్ పెడతానని ఆగ్రహాన్ని వెళ్లగక్కారు మోహన్ బాబు . ఇటీవల కొంతమంది అగ్ర నిర్మాతలు సిండికేట్ గా ఏర్పడిన విషయం తెలిసిందే . దాంతో మిగతా నిర్మాతలందరూ వాళ్ళపై మండిపడుతున్నారు . మరి మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి .

12 P టాలీవుడ్






ర్య .......... అల్లు అర్జున్ కెరీర్ లో ఓ పెద్ద హిట్ ? కేవలం హిట్ మాత్రమే కాదు అల్లు అర్జున్ కెరీర్ కు గట్టి పునాది వేసిన సినిమా అది ! ఆర్య సినిమా అంటే అల్లు అర్జున్ కు కూడా అంతే క్రేజ్ ? అందుకే ఆ సినిమా కు సీక్వెల్ గా రూపొందిన ఆర్య 2 లో కుడా నటించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగ నిలబడలేక పోయింది. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాలకు ఇప్పుడు మరో సీక్వెల్ రూపొందించాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ ? ప్రస్తుతం సుకుమార్ ఎన్టిఆర్ తో ఓ సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు అల్లు అర్జున్ కుడా బోయపాటి దర్శకత్వం లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తీ అయిన తరువాత సుకుమార్ - బన్నీ ల ఆర్య 3 చిత్రం సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై వీరిద్దరూ చర్చించుకున్నారట ! సో త్వరలోనే మనం ఆర్య 3 గురించి వివరాలు వెల్లడికానున్నాయి మరి ?

 అ



ప్పట్లో సంచలన విజయం సాదించిన చిత్రంగా నిలిచింది భారతీయుడు. జాతీయ నటుడు కమల్ హసన్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ ల కలయికలో వచ్చిన ఈ సినిమా అవినీతి పై ఓ వృద్దుడు చేసిన యుద్ధం ఈ చిత్రం. రెండు దశాబ్దాల తరువాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందే సన్నాహాలు జరుగుతున్నాయి ? అవును ఈ సినిమాను తెలుగు లో నిర్మించిన ఎ ఎం రత్నం ఈ విషయం పై స్పందిస్తూ .. ఇటివలే శంకర్ తో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ చేయాలనే విషయం పై మాట్లాడాను, ఈ సినిమా చేయడానికి అయన కుడా సుముకంగానే ఉన్నారు.. అయితే ప్రస్తుతం శంకర్ రోబో 2 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బారతీయుడు 2 రూపొందే అవకాశాలు ఉన్నాయి అంటూ చెప్పారు. సో దీన్ని బట్టి చూస్తే .. మరో సంచలన చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ??

టాలీవుడ్ P 13






కొ

త్త సంవత్సరం వచ్చింది అప్పుడే మే కూడా అయిపోవచ్చింది . కానీ సాలిడ్ హిట్ అంటే ఒక్కటంటే ఒక్కటే ఇప్పటివరకు అది కళ్యాణ్ రామ్ ''పటాస్ ''. అగ్ర హీరోల సినిమాలు చాలానే వచ్చినప్పటికీ వచ్చినవి వచ్చినట్లే పోతున్నాయి తప్ప బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలైతే రాలేదు . అయితే నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ''కిక్ 2'' చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది ,జూన్ మొదటి వారం లేక జూన్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కళ్యాణ్ రామ్ . మరి ఈ సినిమానైనా బాక్సాఫీస్ ని షేక్ చేసి బాక్సాఫీస్ కి కిక్ ఇచ్చే హిట్ అవుతుందా అని చూస్తున్నారు . రవితేజ నటించిన కిక్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది దానికి సీక్వెల్ గా వచ్చిన ఈ కిక్ 2 పెద్ద హిట్ అవ్వాలని తెలుగు సినిమా కళకళ లాడాలని ఆశిస్తున్నారు . ఈ అయిదు నెలలుగా సరైన హిట్ లేక బాక్సాఫీస్ బోసిపోయింది . మరి కిక్ 2 ఏమౌతుందో చూడాలి .



 రా మ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న టర్బో మేఘ తొలి ఫ్లైట్ హైదరాబాద్ చేరుకుంది . ట్రూ జెట్ గా నామకరణం చేసిన ఈ ఫ్లైట్ లో 78సీట్ల సామర్ధ్యం ఉంది . ఈ నెలాఖరున విమాన సర్వీసులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు . తొలి విమానం వచ్చినప్పటికీ తుది అనుమతులు ఇంకా రావాల్సి ఉంది అలాగే మరో వారం రోజుల్లో రెండో విమానం కూడా రానుంది అది కూడా వచ్చాక తమ సర్వీసులను ప్రారంభిస్తామని అన్నారు టర్బో మేఘ ఎయిర్ వేస్ ఫౌండర్ ఉమేష్ . రామ్ చరణ్ ఒక డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ ట్రూ జెట్ సర్వీసులను రాజమండ్రి ,ఔరంగాబాద్ ,తిరుపతి లకు అందించనున్నారు .

14 P టాలీవుడ్




  p

ప్పటి వరకు తమ్ముడు మనోజ్ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఇప్పుడు మల్లి తన జోరు పెంచాడు. ప్రస్తుతం డైనమైట్ చిత్రం లో నటిస్తున్నాడు. దేవా కట్ట దర్శకత్వం లో రుపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన మరో సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టాడు. హనుమాన్ ముప్పరాజు అనే నూతన దర్శకుడి దర్శకత్వం లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ భామ రేజీనా ను ఓకే చేసారు. ప్రస్తుతం ఈ అమ్మడు సాయి ధరం తేజ్ సరసన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమాలో నటిస్తుంది. విష్ణు హీరోగా రూపొందే సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది.

టాలీవుడ్ P 15


మె





గా హీరోలు కలిసి ఓ సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న బ్రూస్ లీ సినిమా షూటింగ్ యూరప్ లో జరుగుతుంది. మరో వైపు అయన మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి అల్లు అర్జున్ నటించే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఎవడు చిత్రం లో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. మల్లి వీరిద్దరి కలయికలో రూపొందే సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడవుతాయి.







16 P టాలీవుడ్

హేష్ బాబు మేనల్లుడు చరిత్ మానస్ కూడా నటుడయ్యాడు. మహేష్ బావ అయిన హీరో సుదీర్ బాబు తనయుడు ఈ చరిత్ మానస్ . సుదీర్ బాబు హీరోగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ''మోసగాళ్ళకు మోసగాడు '' ,ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించాడు చరిత్ . అయితే ఈ విషయాన్ని ఇన్నాళ్ళు గోప్యంగా ఉంచారు . ఈరోజు ఆ సినిమా రిలీజ్ కాబట్టి నిన్న ఆ విషయాన్ని తెలిపారు సుదీర్ . మహేష్ పాటలకు బ్రహ్మాండమైన డ్యాన్స్ చేస్తాడట ఈ చరిత్ . కృష్ణ తో నట ప్రస్థానం మొదలవగా రమేష్ బాబు దాన్ని కొనసాగించగా మహేష్ స్టార్ ఇమేజ్ అంటే ఏంటో రుచి చూపించాడు ఇక ఇప్పుడు మహేష్ మేనల్లుడు వస్తున్నాడు .




...!

 నం

దమూరి బాలకృష్ణ అంటే ఒకింత కొందరికి బయమే ? అయితే ఆయనలోని చిలిపితనం బయటికి వస్తే అది ఎలా ఉంటుందో ... తెలుసా ఇదిగో ... అచ్చం ఇలాగే ? అవును బాలకృష్ణ హీరోగా నటించిన లయన్ సక్సెస్ మీట్ లో హాట్ యాంకర్ తో ఇలా చిలిపిగా సెల్ఫి కి పోజిచ్చాడు. ఇది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. బాలయ్యలో భలే చిలిపితనం ఉందే అని ? మరి ఆయన చిలిపితనాన్ని మీరూ చూడండి...!







క సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు !! ఆ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉంటారు చాలామంది ? ఇప్పుడు అలాంటి ట్రెండ్ బాగా నడుస్తోంది. లేటెస్ట్ గా పందెం కోడి సినిమాతో హీరోగా మంచి క్రేజీ తెచ్చుకున్న విశాల్ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే పనిలో పడ్డాడు. లింగుస్వామి దర్శకత్వం లో తెరకేక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి చెల్లి అక్షర హసన్ నటిస్తుందట. ఇటీవలే షమితాబ్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఈ సినిమాతో తమిళం లోకి కుడా ఎంట్రీ ఇస్తుంది. పందెంకోడి సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుందట ! త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. మరి ఈ సినిమాతో అక్షర తమిళ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి !

టాలీవుడ్ P 17




 ఆ

దా శర్మ కు ఇటీవల షూటింగ్ సమయంలో దెబ్బలు తగిలాయని గాలి వార్తలు గుప్పుమనడంతో కంగారు పడ్డ పలువురు సినీ ప్రముఖులు ఆదా కి ఫోన్ చేసి యోగ క్షేమాలు అడగడంతో స్పందించిన ఆదా శర్మ నేను క్షేమంగానే ఉన్నానని ,నాకు ఎటువంటి ప్రమాదం జరుగలేదని ట్వీట్ చేసింది . అయితే ఎండ వేడి ఎక్కువ ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోతున్నానని అందువల్ల ఈ గాలి వార్త మరీ దావానలం లా వ్యాపించిందని అంటోంది . నితిన్ హీరోగా నటించిన ''హార్ట్ ఎటాక్ '' చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ తాజాగా మదన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది .

18 P టాలీవుడ్


సూ

పర్ స్టార్ రజని కాంత్ లింగ సమస్యలనుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. లింగ సినిమా తరువాత ఆయన నటించే సినిమాకు రంగం సిద్దం అయ్యింది. రంజిత్ అనే దర్శకుడితో సినిమా చేయడానికి రజని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో వైపు రజని తో రోబో 2 సినిమా చేయడానికి దర్శకుడు శంకర్ కుడా భారీగానే ప్రిపెర్ అవుతున్నాడు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఓ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ లో సంచనలం క్రియేట్ చేస్తుంది. అదేమిటంటే రజని సినిమాలో హీరోయిన్ లేదట??? అదేంటి అలా షాకయ్యారు. ఎంత రజని కాంత్ సినిమా అయితే మాత్రం హీరోయిన్ లేకపోవడం ఏమిటా ? అని అనుకుంటున్నారా ! అవును ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇందులో రజని గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అందుకే హీరోయిన్ లేదని యూనిట్ వర్గాల సమాచారం. మరి హీరోయిన్ లేకుంటే ఈ సినిమాను జనాలు చూస్తారా ? రజని స్టైల్ కు గ్లామర్ తోడయితే ఆ కిక్కే వేరు ? మిగతా విషయాలు తెలియాలంటే మాత్రం అసలు విషయం బయటికి వచ్చే వరకు ఆగాల్సిందే.








తె

లుగుతెరకు తనని పరిచయం చేసింది కింగ్ నాగార్జున కాబట్టి అందాల బొమ్మాలి అనుష్క కు నాగార్జున అంటే ఎనలేని గౌరవం ,అభిమానం ఉన్నాయి దాంతో నాగార్జున ,కార్తీ ల మల్టీ స్టారర్ సినిమాలో ఓ అతిథి పాత్రలో నటించాలని దర్శకులు పైడిపల్లి వంశీ కోరగానే ఓకే చెప్పేసిందట . పైగా కార్తీ అంటే కూడా ఓ స్పెషల్ అనుష్క కు ఇలా ఇద్దరు అభిమాన హీరోల చిత్రంలో నటించే చాన్స్ రావడంతో అనుష్క ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పిందట . ఇక దర్శకులు పైడిపల్లి వంశీ కూడా ఆ క్యారెక్టర్ కున్న ప్రాధాన్యత ని వివరించి చెప్పడంతో సంతోషంగా చేస్తానని చెప్పిందట అనుష్క .

   


చి

రంజీవి 150వ చిత్రం లోని డైలాగ్స్ ని కంప్లీట్ చేయడానికి తనకు బాగా ఇష్టమైన బ్యాంకాక్ వెళ్ళాడు దర్శకులు పూరి జగన్నాద్ . తన ప్రతీ సినిమాకి రచన చేసే సమయంలో పూరి బ్యాంకాక్ వెళతాడనే విషయం పాఠకులకు తెలిసిందే . చిరంజీవి తో చేసిన సినిమా మరింత ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి దాని కోసం బాగానే కష్టపడుతున్నాడు పూరి . బ్యాంకాక్ బీచ్ లో కూర్చొని మెదడుకి మేత పెడుతూ పవర్ ఫుల్ డైలాగ్స్ ని రాసుకోవడం పూరి స్పెషల్ . పైగా ఆగస్టు 22న చిరు పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రారంభించాలి కాబట్టి ఈలోపు త్వరితగతిన డైలాగ్స్ ని పూర్తి చేసేపనిలో ఉన్నాడు పూరి .






 జా



తీయ నటుడు కమల్ హసన్ హీరోగా మరో చిత్రం మొదలైంది. ఉత్తమ విలన్ సినిమా తరువాత అయన తెలుగు స్ట్రైట్ చిత్రం లో నటిస్తున్నారు. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో హీరోయిన్ త్రిష , ప్రకాష్ రాజ్ , కోశోర్, దర్శకుడు రాజేష్ , రచయితా అబ్బూరి రవి , సాను జాన్ వరుఘేస్ తదితరలు పాల్గొన్నారు. కమల్ హసన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. అనంతరం అయన మాట్లాడుతూ .. నేను ఎప్పటినుండి చెప్పిన మాట తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేస్తానని, ఇప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాను. నాకు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలనీ చాలారోజుల నుండి ఉంది. కాని వేర్ సినిమాల వల్ల అడికుదరలేదు. ఇప్పుడు ఈ సినిమా తరువాత కుడా వీలున్నప్పుడల్లా తెలుగులో సినిమా చేస్తా. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే దీనికి మంచి కత కుదిరింది. రాజేష్ ఏడేళ్ళ క్రితం నా దగ్గర అసిస్టెంట్ అయ్యాడు. అయన దర్శకుడిగా మారటానికి ఏడేళ్ళు పట్టింది. ఈ సినిమా కోసం వండర్ ఫుల్ సబ్జెక్టు రెడీ చేసాడు. నేటి పరిస్తితులకు అద్దం పట్టేలా ఉండే చిత్రమిది. దేన్నీ తమిళం లో కుడా విడుదల చేస్తాం. అయితే ఎక్కువ షూటింగ్ మాత్రం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ చక్కటి పాత్ర చేస్తున్నారు . అయన కూడా మా గురువు బాలచందర్ గారి శిష్యుడు. అలాగే త్రిష తో కుడా వరుసగా సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాను. నా ప్రవర్తన మొత్తం మా గురువు బాలచందర్ గారిదగ్గర నేర్చుకున్నదే. ఆయనతో 36 సినిమాలు చేశాను. ఉత్తమ విలన్ 37 వ సినిమా. సినిమా డెమోక్రాటిక్ కల . దాని నెరవేర్చుకోవడానికి ఇంతమంది పనిచేస్తాం అన్నారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ .. ఇది ఓ గొప్ప అవకాశం గా బావిస్తున్నాను. ప్రతి ఒక్క నటులకు ఇది ఓ పెద్ద కల . ఆయనతో నటించే అవకాశం రావడం. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.








జా

క్వె లెన్ ఫెర్నాండేజ్ పూమా షూస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది . అందులో భాగంగా పూమా షూస్ ని వేసుకోవడానికి వంగిన సమయంలో ఎద భాగం బయటకి పొంగు కోస్తూ ఉండటంతో ఫోటో గ్రాఫర్లు పండగ చేసుకున్నారు . స్లీవ్ లెస్ టాప్ లో టాప్ భాగం అవలీలగా కనిపిస్తున్డటంతో పండగ చేసుకున్నారు . ఇక ఇలాంటి పండగలను కావాలనే సదరు హీరోయిన్ లు ఇస్తుంటారు . జాక్వెలేన్ ఫెర్నాండేజ్ కి బాలీవుడ్ లో మంచి చాన్స్ లను ఇస్తూ బాగానే ప్రోత్సహిస్తున్నాడు సల్లూ భాయ్ .

టాలీవుడ్ P 23


 



 చే



తిలో సినిమాలు లేవు అందుకే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంటూ మీటింగ్ ల మీద మీటింగ్ లు పెడుతున్నాడు హీరో శివాజీ . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంటూ పోరాడుతున్నాడు కానీ పాపం శివాజీ గోడు పట్టించుకున్న నాధుడే లేకపోయాడు అయితే ఒక చానల్ వాళ్ళు మాత్రం శివాజీ ని హీరో ని చేయడానికి నానా కష్టాలు పడుతున్నప్పటికీ జనాలు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు . కొంతమంది శివాజీ పోరాటానికి మద్దతు ఇచ్చినప్పటికీ అది నామమాత్రమే అయ్యింది . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది మిధ్య లాగానే కనిపిస్తోంది ,ఎందుకంటే అందుకోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు కానీ అధికార తెలుగు దేశం పార్టీ కానీ పెద్దగా పోరాటం చేసింది శూన్యం . పైగా శివాజీ ఓ మామూలు నటుడు మాత్రమే అతడికి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు ,ఇక జనాలు ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి శివాజీ ది అరణ్య రోదనే అయ్యింది .

24 P టాలీవుడ్

వన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఎన్టీఆర్ కూడా గడ్డం పెంచుతున్నాడు అలాగే సీనియర్ హీరో వెంకటేష్ కూడా గడ్డం పెంచుతున్నాడు ఇలా హీరోలను గడ్డాల తో చూస్తున్న వాళ్ళు ఈ గడ్డాల గోల ఏందిర బాబూ ! అని తల పట్టుకుంటున్నారు . పవన్ గబ్బర్ సింగ్ 2 కోసం పెంచగా ఎన్టీఆర్ కూడా సుకుమార్ చిత్రం కోసం గడ్డం పెంచుతున్నాడు ఇక వెంకటేష్ గడ్డం కథ ఏంటో ? అనే ప్రశ్న తలెత్తుతోంది . గోపాల గోపాల చిత్రం తర్వాత వెంకీ ఇంకా కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు . అయితే త్వరలోనే వెంకటేష్ ఓ కొత్త చిత్రంలో నటించనున్నాడని ఆ కథ కోసమే వెంకీ గడ్డం పెంచుతున్నాడని వినబడుతోంది . అయితే కథ ఏంటి ? దర్శకుడు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది .






మద్య ఎక్కడ చూసిన సెల్ఫి ల గోలా మరి ఎక్కువైంది. ఎవరు చుసిన సెల్ఫి ... సెల్ఫి అంటూ ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ మద్య సినిమా తారలు కూడా ఈ సెల్ఫి ల క్రేజీ ఎక్కువగా పెంచుకున్నారు. లేటెస్ట్ గా సౌత్ క్రేజీ భామ సమంతా ! ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ లో నటిస్తున్న వి ఐ పి 2 సినిమా షూటింగ్ సమయం లో తన హీరో ధనుష్ తో సెల్ఫి దిగి ఇలా క్రేజీ గా పోజిచ్చింది. మరి ఆ లుక్ పై మీరు ఓ లుక్ వేయండి !!

టెం

పర్ సినిమా తరువాత ఎన్టిఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందే చిత్రం అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లేటెస్ట్ సమాచారం ప్రకారం జూన్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది. ఇప్పటికే దీనికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తీ అయ్యాయని, ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరగనుందట. ఇప్పటికే ఈ సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ను పెట్టె అవకాశం ఉన్నట్టు యూనిట్ సబ్యుల సమాచారం. ఈ సినిమా కోసమే ఎన్టిఆర్ తన గడ్డాన్ని భారిగా పెంచినట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నాడు.





టాలీవుడ్ P 25




 ‘అ

లా ఎలా’ చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు రాహుల్ రవీంద్రన్ నటిస్తున్న తాజా చిత్రం ‘హైదరాబాద్ లవ్స్టోరి’.రేష్మి మీనన్, జియా నాయికలు. ఎస్.ఎన్.ఆర్ ఫిల్మ్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై పద్మజ.ఎస్ సమర్పణలో ఎస్. ఎన్.డ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజ్ సత్య దర్శకుడు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా ఈ చిత్రం సెన్సారు బుధవారం పూర్తిచేసుకుంది. యుబైఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ హైదరాబాద్ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ఇది. హైదరాబాద్ సంస్కృతి, యాస, వేషధారణ, హైదరాబాద్ ప్రజల అభిరుచులు ఇలా పలు అంశాలను ఈ చిత్రంలో చూపించబోతున్నాం.రొమాన్స్, ఎమోషన్స్, ఫాంటసీ అంశాల కలయికలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. నిర్మాత

26 P టాలీవుడ్

ఎస్.ఎన్.డ్డి మాట్లాడుతూ ‘ సరికొత్త ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం వుంది. ముఖ్యంగా యువతను అలరించే అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రావు రమేష్, తాగుబోతు రమేష్, అంబటి, చంటి, రమాప్రభ, మధుమణి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: బీవీ అమర్నాథ్ రెడ్డి, ఎడిటర్:ఎం.ఆర్.వర్మ, సమర్పణ: పద్మజ.ఎస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజేందర్ రెడ్డి పిన్నింటి, సహ నిర్మాత: ఎస్.శ్రీలక్ష్మి, రచన-దర్శకత్వం: రాజ్సత్య


పె

ద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే చాలు బాగా ఆడుతున్న చిన్న సినిమాను తీసి అవతల పడేస్తారు. మరో వైపు చిన్న సినిమాలకు అసలు థియేటర్స్ దొరకవు. ఇలాంటి సమస్యలతో ఇప్పటికి చిన్న నిర్మాతలు సతమతమవుతున్నారు. దీనికి పరిష్కారం గా మినీ థియేటర్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు కుడా జరుగుతున్నాయి. అయితే ఈనాడు గ్రూప్ ల అద్వర్యం లో రామోజీరావు మినీ థియేటర్స్ నిర్మాణం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన నిర్మాతలతో కుడా మాట్లాడాడట. పత్రిక , చానల్ , బిజినెస్ , వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఈనాడు గ్రూప్ ఆద్వర్యం లో కొన్ని ముక్య పట్టణాల్లో 200 థియేటర్స్ కెపాసిటీ తో మినీ థియేటర్స్ ను నిర్మిస్తారట. దీనికి సంబందించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి

 



   ప

వన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ 2 చిత్రం పూణే లో ప్రారంబం కానుంది. ఇప్పటికే పవన్ అక్కడకు వెళ్ళాడు. ఈ సినిమా రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోనుంది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను విడుదలకు ప్లాన్ చేసారు. ఈ సినిమా తరువాత పవన్ , దాసరి నారాయణరావు ల క్రేజీ కలయికలో రూపొందే సినిమాకు కుడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు దర్శకుడిగా డాలి ( గోపాలా గోపాలా ఫేమ్ ) ఓకే అయినట్టు తెలుస్తోంది. దాసరి నారాయణరావు నిర్మించే ఈ చిత్రం అక్టోబర్ లో ప్రారంబం కానుంది.

టాలీవుడ్ P 27






హేష్ బాబు అబ్బాయిని ఆశీర్వదించాడు ,మహేష్ ఏంటి ? అబ్బాయిని ఆశీర్వదించడం ఏంటి ? అని ఆలోచిస్తున్నారా ? విజయనిర్మల తనయుడు నరేష్ మహేష్ కు అన్న అవుతాడనే విషయం తెలిసిందే . నరేష్ తనయుడు నవీన్ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ''ఐనా ఇష్టంనువ్వు '' . ఆ చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యింది . నవీన్ బాగున్నాడని అలాగే ఫస్ట్ లుక్ బాగుందని ఆ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసాడు మహేష్ . దాంతో నవీన్ సంతోషంగా ఉన్నాడు మహేష్ అభినందనలతో .





న్టీఆర్ తో రభస ఫ్లాప్ కావడం ,తనయుడు సాయి శ్రీనివాస్ తో చేసిన అల్లుడు శీను కి భారీ బడ్జెట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డ నిర్మాత బెల్లంకొండ సురేష్ తాజాగా లభించిన గంగ సూపర్ హిట్ తో కొంతమేరకు కష్టాలు తీరినట్లేనని అంటున్నారు ఫిలిం నగర్ వర్గాలు . గంగ చిత్రం రిలీజ్ కావడానికి ఎన్నో అవాంతరాలు వచ్చాయి మొత్తానికి రెండు వారాల తర్వాత అన్ని ఇబ్బందులను అంటే ఆర్ధిక ఇబ్బందులను అధిగమించి రిలీజ్ చేస్తే అది కాసుల వర్షం కురిపించింది . దాంతో బెల్లంకొండ కష్టాలు కొంతవరకు తీరినట్లే అని అంటున్నారు . గంగ చిత్రం నిజంగానే బాక్సాఫీస్ ని కుమ్మేసింది . ఓ డబ్బింగ్ చిత్రం ఇంత బీభత్సమైన వసూళ్ళ ని సాధించడంతో అందరూ నివ్వెర పోయారు . గంగ బెల్లంకొండ పాలిట కల్పతరువు అయ్యింది .

28 P టాలీవుడ్


హీరోయిన్

ఆర్తి అగర్వాల్

హీ

కన్నుమూత

రోయిన్ ఆర్తి అగర్వాల్ (31) కన్ను మూసింది . విక్టరీ వెంకటేష్ తో ''నువ్వు నాకు నచ్చావ్ '' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఆర్తి అగర్వాల్ ఆ చిత్రం తర్వాత వరుసగా అగ్ర హీరోలైన చిరంజీవి ,బాలకృష్ణ ,నాగార్జున ,వెంకటేష్ ,రాజశేఖర్ ,మహేష్ బాబు ,ఎన్టీఆర్ లతో నటించి అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది . అయితే యంగ్ తరుణ్ తో నిండా ప్రేమలో మునిగి పోయి కెరీర్ ని పక్కన పెట్టి ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుండి కెరీర్ మందగించింది . ఆ తర్వాత 2007లో ఉజ్వల్ అనే వ్యక్తిని పెళ్ళాడి విభేదాలతో కొద్ది కాలానికే విడాకులు తీసుకుంది . ఇండియా కి తిరిగి వచ్చి మళ్ళీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నించినప్పటికీ సరైన అవకాశాలు మాత్రం రాలేదు . పైగా ఆర్తి మరింత లావుగా మారడంతో అమెరికాలో లైపో సెక్షన్ చికిత్స తీసుకుంటోంది . ఆ చికిత్స వికటించడంతో ఆర్తి అగర్వాల్ అర్దాంతరంగా తనువూ చాలించింది .

 



క్కినేని అఖిల్ తో నితిన్ నిర్మిస్తున్న చిత్రానికి వివివినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే . ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తిచేసుకొని వచ్చిన యూనిట్ మరో షెడ్యూల్ కి కూడా త్వరలోనే రెడీ అవుతోంది . కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది . ఆలోపు చిత్రీకరణ పూర్తిచేసి విజయదశమి రోజున రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు . అఖిల్ సినిమాపై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి . వినాయక్ దర్శకుడు కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి . అక్కినేని వంశంలో ఏ హీరోకి రాని మాస్ ఇమేజ్ రిలీజ్ కి ముందే అఖిల్ కు రావడం విశేషం . ఇక రేపు రిలీజ్ అయ్యాక అఖిల్ మరెన్ని సంచలనాలను నమోదు చేయనున్నాడో .

టాలీవుడ్ P 29




టసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల తాతయ్య అయిన విషయం తెలిసిందే,బాలయ్య మనవడి పేరు ఏంటో తెలుసా ........ దేవాన్ష్ . అయితే మనవడికి ఇన్నాళ్ళు పేరు పెట్టలేదు ఎందుకంటే నందమూరి తారకరామారావు పుట్టినరోజు నాడు ఆ మహనీయుడి పేరు పెట్టాలని భావించారు . ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని నారా లోకేష్ -బ్రాహ్మణి ల తనయుడికి ''దేవాన్ష్ '' అనే పేరుని పెట్టారు . ఈ విషయన్ని సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ తెలిపాడు . బాలయ్య మనవడికి పేరు పెట్టడంతో బాలయ్య అభిమానుల్లో కొత్త జోష్ మొదలయ్యింది .





30 P టాలీవుడ్



హేష్ బాబు తాజా చిత్రం ''శ్రీమంతుడు '' సాటి లైట్ హక్కుల్లో సంచలనం సృష్టించాడు . ఇప్పటివరకు సాటి లైట్ హక్కుల్లో పది కోట్లు రావడమే గగనమై పోతుంటే మహేష్ తాజా చిత్రానికి 11కోట్ల పైనే రాబోతున్నట్లు తెలుస్తోంది . జీ తెలుగు చానల్ పోటీ పడి 11కోట్లకు పైగా చెల్లించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది . మహేష్ బాబు - శృతి హసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మిర్చి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు . ఈనెల 31న శ్రీమంతుడు టైటిల్ లోగో తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సినిమా మాత్రం జూలై 17న రిలీజ్ చేయనున్నారు .


 

యం

గ్ హీరో నితిన్ మల్లి జోరు పెంచాడు. ఇటివలే అయన నటించిన చిన్నదానా నీకోసం హిట్ అందించలేదు. దాంతో మల్లి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం లో నితిన్ హీరోగా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం చిరంజీవి 150 వ సినిమా కోసం పూరి వర్క్ చేస్తున్నాడు. దాంతో నితిన్ సినిమా వాయిదా పడింది అని అనుకున్నారు. కాని ఇటివలే నితిన్ ట్విట్ పెట్టడం తో ఇప్పుడు ఈ సినిమా ప్రారంబం అవుతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. నితిన్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో తెరకేక్కే ఈ సినిమా జూన్ నెల 15 న ప్రారంబం కానుంది. పూరి రూపొందిస్తున్న జ్యోతి లక్ష్మి జూన్ నెల 12న విడుదల అవుతుంది. ఒక వైపు నితిన్ తో సినిమా చేస్తూనే మరో వైపు చిరు సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు పూరి, తనలో ఇంకా స్పీడ్ తగ్గలేదని చెప్పకనే చెబుతున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్.





నభయ్యవ దశకంలో పలు విజయవంతమైన హాస్య చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు ఇన్నాళ్ళకు మళ్ళీ మెగా ఫోన్ చేత బట్టారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్నాడు . నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై వడ్డెం పూడి శ్రీనివాసరావు -మారెళ్ళ నరసింహారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''ఎలకా ..... మజాకా ''. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ శిష్యుడు బల్లేపల్లి మోహన్ సంగీతం అందిస్తున్నాడు . ఇప్పటివరకు 73చిత్రాలకు దర్శకత్వం వహించిన కుటుంబ కథా చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సమయంలో ఆయన చిత్రానికి సంగీతం అందించే గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని ఇప్పటివరకు నేను చాలా చిత్రాలకు సంగీతం అందించినప్పటికీ ఈ ''ఎలకా మజాకా '' చిత్రం ద్వారా నాకు బ్రేక్ రావడం ఖాయమని అంటున్నాడు బల్లేపల్లి . సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని ,నేను అందించిన సంగీతానికి రేలంగి ముగ్డుడయ్యారని అలాగే చిత్ర నిర్మాతలు శ్రీనివాసరావు -నరసింహారావు లు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారని ,పాటలు అద్భుతంగా



వచ్చాయని వాటిని తైదల బాపు ,గంగోత్రి విశ్వనాథ్ రచించారని అన్నారు బల్లేపల్లి మోహన్ .

టాలీవుడ్ P 31


సూ

పర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు మే31. ఈ ఏడాది 73వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న కృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నాగారంలోని పద్మాలయా స్టూడియోలో అభిమానులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ నిర్మాతలు సి.వి.రెడ్డి, జగదీష్‌ చంద్రప్రసాద్‌, కె.సి.శేఖర్‌బాబు, కె.యస్‌.రామారావు, అనిల్‌ సుంకర్‌, రామ్‌ అచంట, గోపిచంద్‌ అచంట, రవి, డైరెక్టర్‌ బి.జయ, ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్‌, ఆల్‌ ఇండియా సూపర్‌స్టార్‌ కృష్ణ అభిమానుల సంఘం ప్రెసిడెంట్‌ దిడ్డి రాంబాబు, ఆల్‌ ఇండియా కృష్ణ`మహేష్‌బాబు ఫ్యాన్స్‌ సంఘం అధ్యక్షుడు ఖాదర్‌ గోరి సహా పలువురు ప్రముఖులు సినీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ... పర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ సారి హైదరాబాద్‌లో పుట్టినరోజును అభిమానుల మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీమంతుడు టీజర్‌ విడుదలైంది. చాలా బావుంది. ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసి కొత్త రికార్డులను నెలకొల్పాలి. ఫ్యూచర్‌లో మా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు పరిచయం కానున్నారు. జయదేవ్‌ పిల్లలు కూడా యాక్ట్‌ చేయాలనుకుంటున్నారు. అలాగే నవీన్‌ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మా థర్డ్‌ జనరేషన్‌ను కూడా ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. మతి విజయనిర్మల మాట్లాడుతూ ‘‘ఈ స్టూడియోలో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉంది. సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు థాంక్స్’‌’ అన్నారు. .జయ మాట్లాడుతూ ‘‘రాజుగారు కృష్ణ అభిమాని అయితే నేను కృష్ణగారు, విజయనిర్మలగారి అభిమానిని. నేను జర్నలిస్ట్‌గా పనిచేసిన రోజుల్లో అందరినీ ప్రశ్నలు అడిగేదాన్ని అయితే కృష్ణగారిని మాత్రం ప్రశ్నలు అడగలేకపోయేదాన్ని. ఎందుకంటే నేను ఆయన హర్డెస్ట్‌ ఫ్యాన్‌. ఆయన టక్కరి దొంగ`చక్కని చుక్క సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత ఆయన్ను గుండమ్మగారి మనవడు సినిమాలో డైరెక్ట్‌ చేసే అవకాశం కలిగింది. విజయనిర్మలగారి తర్వాత కృష్ణగారిని డైరెక్ట్‌ చేసిన మహిళా దర్శకురాలు నేనే. ఆయన ఇలాంటి పుట్టిరోజులు మరెన్నెంటినో జరుపుకోవాలని కోరుకుంటన్నాను’’ అన్నారు. .యస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘కృష్ణగారంటేనే సాహసం. నేను చూసిన అతి మంచి హీరోల్లో ఆయన ఒకరు. నా చిన్నతనం నుండి ఆయన్ను చూస్తున్నాను.

 

సూ

శ్ రీ

బి

కె

32 P టాలీవుడ్

ఇప్పటికీ ఆయనలోని మంచితనం, హీరోయిజం అలాగే ఉంది’’ అన్నారు. .వి.రెడ్డి మాట్లాడుతూ ‘‘ఇండియన్‌ సినిమాలో ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన హీరో కృష్ణగారు. అలాగే తన సినిమా జయాపజయాలు గురించి నిర్మొహమాటంగా మాట్లాడేవారు’’ అన్నారు. నిల్‌ సుంకర మాట్లాడుతూ ‘‘మహేష్‌ శ్రీమంతుడు టైటిల్‌కి కరెక్ట్‌ అర్థం చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్‌స్టార్‌ కృష్ణగారు మాత్రమే. ఆయన మరెన్నో బర్త్‌డేలను సెలబ్రేట్‌చేసుకోవాలి’’ అన్నారు. భాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నేను పద్మాలయా బ్యానర్‌ నిర్మించిన సూర్యవంశం సినిమాతోనే నా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను. తర్వాత కృష్ణగారితో మానవుడు`దానవుడు సినిమా చేశాను. తర్వాత ఇదే ఫ్యామిలీ హీరో సుధీర్‌తో ప్రేమకథాచిత్రమ్‌చేసి సక్సెస్‌కొట్టాను’’ అన్నారు. కార్యక్రమంలో పద్మాలయా స్టూడియో సిబ్బంది, కృష్ణ అభిమానులు తీసుకువచ్చిన కేక్‌ను కృష్ణ కట్‌ చేశారు. మల్లికార్జున్‌, ఖాదర్‌గోరి, దిడ్డి రాంబాబు సూపర్‌స్టార్‌కృష్ణను శాలువాతో సత్కరించారు.

సి

అ ప ్ర






ప్ర

స్తుతం వరుసగా విజయాలు అందుకుంటూ మంచి జోరుమీడున్నాడు హీరో నిఖిల్. సూర్య వర్సెస్ సూర్య తరువాత నిఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం శంకరాభరణం . ఉదయ్ నందనవనం దర్శకత్వం లో కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం తెగ వెతికారు. ఫైనల్ గా అందాల భామ నందిత ఎంపికయింది. ప్రస్తుతం ఈ అమ్మడు సుదీర్ బాబు సరసన కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ చిత్రం లో నటించింది. నిఖిల్ నటిస్తున్న ఈ సినిమా జూన్ లో 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది. మరి ఈ సినిమాతో నిఖిల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి ?

టివలే పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ మల్లి సినిమా షూటింగ్ లో బిజీగా మారాడు. ఆయన హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంబం అయ్యింది. జి ఈశ్వర్ దర్శకత్వం లో తెరకేక్కే ఈ చిత్రం ఫిలిం నగర్ లో ప్రారంబం అయ్యింది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మనోజ్ హీరోగా నటించిన

       అటాక్ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఓల్డ్ సిటీ నేపద్యం లో రూపొందింది. మనోజ్ కొత్త సినిమా జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుంది.

టాలీవుడ్ P 33




ప్ర

ముఖ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ కవితలతో కూడిన 'అక్షరాంజలి' అనే సంకలనాన్ని రచించారు. ఈ రచనను భగీరథ కె.వి.రమణాచారికి అంకితం ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోశయ్య, కోడెల శివప్రసాద్, కె.వి. రమణాచారి, సి.కళ్యాన్, చెరుకూరి హరిప్రసాద్, పుల్లెల గోపీచంద్, వై.వి.ఉమాపతి వర్మ, కె.వి.కృష్ణకుమారి, శివాజీరాజా, ఆళ్ళ శ్రీనివాస్, వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభాపతి కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ "30 కవితలతో కూడిన ఈ రచనాన్ని భగీరథ మనసుపెట్టి రాసారు. ఎన్నో రచనలను రాసిన అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. మంచి చిత్రాలతో ఈ రచనను ప్రచురించారు. భగీరథ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ 'అక్షరాంజలి'లో నాగండ్ల గ్రామం గురించి అక్కడ పుట్టిన మహనీయులు గురించి వివరించారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే గ్రంధం రాసారు. స్వీయకర్తగా రమణాచారి గారు ఉండడం ఆనదకరమైన విషయం" అని అన్నారు. శయ్య మాట్లాడుతూ "శాసనసభ సభ్యుడిగా ఉన్న రోజుల్లో దగ్గరగా పరిచయమున్నటువంటి పాత్రికేయ మిత్రుల్లో భగీరథ ఒకరు. తన పని తాను చేసుకుంటూ పోయే మనిషి. ఓ జర్నలిస్ట్ గా వార్తలు సేకరించడం ఒక పద్ధతి. అలా కాకుండా సొంతంగా ఓ రచన చేయడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఈరోజు భగీరథ 'అక్షరాంజలి' అనే పుస్తకాన్ని రచించాడు. నాకు మంచి మిత్రుడైన ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఆయనను అభిమానించే మిత్రుడిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. భగీరథ మరిన్ని పుస్తకాలను రచించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. వాజీరాజా మాట్లాడుతూ "30 సంవత్సరాలుగా భగీరథ గారు మాకు మంచి ఆప్తులు. ఆయన

రో

శి

34 P టాలీవుడ్

రాసిన ప్రతి అక్షరం తెలుగువారి గుండెల్లో నిలిచిపోవాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. .కళ్యాన్ మాట్లాడుతూ "సినిమా ఇండస్ట్రీకి సేవలందించిన ఆఫీసర్స్ లో రమణాచారి గారు ప్రముఖులు. అలాంటి ఆయనకు ఈ 'అక్షరాంజలి' అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు భగీరథ గారికి నా ధన్యవాదాలు. ఆయన మరిన్ని రచనలను రచించాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు. .వి.ఉమాపతి వర్మ మాట్లాడుతూ "ఆత్మ, పరమాత్మ రెండింటిని మిళితం చేసే ప్రయత్నం చేసాడు భగీరథ. ఆయన రచనలు శ్రద్ధగా చదివితేనే అర్ధం అవుతాయి" అని చెప్పారు. .వి.కృష్ణకుమారి మాట్లాడుతూ "సుమారు ముప్పై సంవత్సరాల క్రితం భగీరథ గారు అక్షరాంజలి రాయడం మొదలుపెట్టారు. ఆ రచనను నాకు వినిపించినపుడు పుస్తక రూపంలో ఉంటే బావుంటుందని చెప్పాను. ఈరోజు 'అక్షరాంజలి' రచనను ఆవిష్కరించడం ఆనందదాయకం" అని చెప్పారు. గీరథ మాట్లాడుతూ "ఈరోజు నా జీవితంలో ఓ విశేషమైన రోజు. 1980వ సంవత్సరం జూన్ 1వ తేదీన నేను రాసిన 'మానవత' అనే పుస్తక ఆవిష్కరణ ప్రముఖ కవి శ్రీశ్రీ చేతుల మీదుగా జరిగింది. ఇప్పుడు నేను రచించిన 'అక్షరాంజలి' పుస్తకావిష్కరణ కూడా జున్1 న జరిపించమని రోశయ్య గారు చెప్పడం యాదృచ్చికంగా ఉంది. ఈరోజు ఈ సభ నా సాహిత్య జీవితానికి మరోమెట్టని భావిస్తున్నాను. ఈ పుస్తకం వెలుగు చూడడానికి ముఖ్య కారకులు సి.కళ్యాన్ గారు. ఆయనకు నా ధన్యవాదాలు. రమణాచారి గారికి పుస్తకం అంకితం ఇవ్వడం ఆనందంగా ఉంది. రావిపూడి వెంకటాద్రి, చెరుకూరి హరిప్రసాద్, పుల్లెల గోపీచంద్ వంటి ఆణిముత్యాలు జన్మించిన ఊరు గురించి వారి గురించి రాయాలనుకున్నాను. అదే ఊరులో నేను పుట్టానని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది" అని చెప్పారు. మణాచారి మాట్లాడుతూ "ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నన్ను బాగస్తుడిని చేయడం, 30 కవితలతో కూడిన ఈ 'అక్షరాంజలి' నాకు అంకితం చేయడం ఆనందంగా ఉంది. ఈ రచనలో అక్షరాలన్నీ ఒక ఎత్తయితే చిత్రాలన్నీ ఒక ఎత్తు. ప్రతి చిత్రం ఫ్రేం కట్టించుకోవాలని అనిపించే విధంగా చిత్రాలను అందించిన సురేష్ గారికి నా ధన్యవాదాలు. భగీరథ ఈ రచనలో తను పుట్టి పెరిగిన గ్రామం గురించి, తనకు చదువు చెప్పిన మాస్టర్ గురించి రాయడంలో తన గురు భక్తి తెలుస్తుంది. త్వరలోనే ఆయన 'భారత్-అమెరికా' అనే మరో రచనను కూడా రచించనున్నారు" అని తెలిపారు.

సి వై

కె




    p

టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న చిత్రం ''బ్రహ్మోత్సవం ''. ఈ చిత్రం ఇటీవల కృష్ణ పుట్టినరోజు

సందర్భంగా ప్రారంభమైంది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సినిమా పతాకంపై పోట్లురి వి ప్రసాద్ నిర్మిస్తున్నారు . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూలై 10 నుండి జరుగనుంది . మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రణీత లు నటిస్తున్నారు . బ్రహ్మోత్సవం విశేషం ఏమిటంటే ఈ చిత్రంతో మహేష్ నేరుగా తమిళంలో కూడా ఎంటర్ అవనున్నాడు ,ఇన్నాళ్ళు మహేష్ నటించిన పలు చిత్రాలు తమిళంలోకి డబ్ అయ్యాయి కానీ ఈ చిత్రంతో నేరుగా తమిళ ప్రేక్షకులను పలకరించనున్నాడు . అలాగే ఈ సినిమాకి మహేష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు . విజయవాడ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు ,తమిళ భాషల్లో షూటింగ్ జరుపుకోనుంది .

టాలీవుడ్ P 35


    నం

దమూరి బాలకృష్ణ, అంజలి జంటగా వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వంలో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'డిక్టేటర్'. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ ను ఇవ్వగా, బి.గోపాల్ స్విచ్ ఆన్ చేసారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ "మొదటిసారి శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. లయన్ సినిమా షూటింగ్ సమయంలో 'డిక్టేటర్' అనే టైటిల్ చెప్పారు. టైటిల్ కు తగ్గట్లుగానే కథను

36 P టాలీవుడ్

సిద్ధం చేయమని చెప్పాను. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం సంతోషంగా ఉంది. అంజలికి పాత్రకు ఇంపార్టన్స్ ఉంటుంది. ఈ 'డిక్టేటర్' ప్రాణం పోసే ఆయుధం కాబోతుంది. ప్రజలకు రీచ్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం"అన్నారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ "నేను దర్శకునిగా మారిన తరువాత బాలకృష్ణ గారితో సినిమా చేయాలని అనుకున్నాను. లక్ష్యం సినిమా తరువాత ఆయనతో సినిమా చేయాలనుకున్నాం. కాని కొన్ని కారణాల వలన చేయడం కుదరలేదు. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. కోన-గోపి మోహన్ ఓ మంచి స్టొరీ చెప్పారు. స్క్రిప్ట్ వర్క్ బాగా జరిగింది. ఈ సినిమాలో బాలయ్య రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. సినిమాకి మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెలుగులో మొదటిసారి ఈ చిత్రం ద్వారా ప్రొడక్షన్ మొదలుపెట్టారు. హీరోయిన్ అంజలి పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూడగలిగే సినిమా ఇది" అని అన్నారు.


అం

దాల భామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన హాట్ హాట్ అందాల భామ ఐశ్వర్య రాయ్ త్వరలోనే ఓ తెలుగు సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం పై కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... మణిరత్నం దర్శకత్వం లో రూపొందే మల్టి స్టారర్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుందట. నాగార్జున - మహేష్ ల కలయికలో రూపొందే ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఓకే బంగారం సినిమాతో మాల్లో లైం లైట్ లోకి వచ్చిన మణిరత్నం ఈ ఇద్దరు హీరోల కలయికలో ఓ సినిమా చేసేందుకు కసరత్తులు చేస్తున్నాడట ? నాగార్జునకు జోడిగా ఐశ్వర్య నటిస్తే .. మహేష్ కి జోడిగా శృతి హసన్ నటించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 aishwarya rai

 

టాలీవుడ్ P 37


 

 గో

పీచంద్ హీరోగా సినిమాలను నిర్మిస్తూ దాదాపు గోపీచంద్ ఇంటి బ్యానర్ గా ఉన్న ఓ బ్యానర్ లో ఇప్పుడు మహేష్ బాబు ఓ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. అదే భవ్య క్రియేషన్స్. గతం లో గోపీచంద్ తో వాంటెడ్, లౌక్యం వంటి చిత్రాలని నిర్మించిన బ్యావ్య అదినేత ఆనంద్ ప్రసాద్ మహేష్ తో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు ఇప్పటికే మహేష్ బాబు ఈ బ్యానర్ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వం వహిస్తాడట. ఇప్పటికే కథ చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో పాటు మహేష్ భవ్య సిమెంట్ కు కూడా బ్రాండ్ బాబుగా వ్యవహరిస్తాడని తెలిసింది. దీనికోసం 20 కోట్లు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.



 నం

దమూరి అభిమానులకు నిజంగా శుభవార్తే ! ఎందుకంటే నందమూరి హీరోల్లో అందరికీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో వాళ్ళు కలిసి నటిస్తే చూడాలని ఆ వంశ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు . నందమూరి అభిమానుల ఆశ తీర్చడానికి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు నడుం కట్టనున్నారు . ఈ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు . ఇటీవల టెంపర్ చిత్రంతో ఎన్టీఆర్ కు సక్సెస్ ఇచ్చిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు తెలుస్తోంది . వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు నచ్చడంతో ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి నందమూరి వంశాభిమానులను సంతోషంలో ముంచెత్తనున్నారు .

టాలీవుడ్ P 38








మె

గాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం పాటల చిత్రీకరణకు ముస్తాబయ్యింది. కధానాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు.

సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ 'ఈ నెల 21 నుంచి 30 వరకు 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరుగుతుంది. మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', రకుల్ ప్రీత్ సింగ్ ల పై ఈ పాటల చిత్రీకరణ ఉంటుంది. తిరిగి జూన్ 3 నుంచి హైదరాబాద్ లో చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

"నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు. అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

సందర్భంగా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో తాను రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.