Tollywood Magazine Telugu November - 2015

Page 1

RNI NO: APTEL/2003/10076





TOLLYWOOD.NET

/tollywood /tollywood

NOVEMBER 2015 VOL 12 ISSUE 11


అం

దాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఏ హీరోకైనా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది , అగ్ర హీరోలే కాదు బోలెడు ఫ్యాన్స్ రకుల్ వెంట పడుతున్నారు . విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో అభిమానులను సోషల్ మీడియా ద్వార కలవాలని భావించింది అంతే ప్రశ్నించండి సమాధానాలు ఇస్తాను అని రకుల్ చెప్పగానే రకుల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు ఫ్యాన్స్ . ఇక ఒకడైతే మీ సైజ్ ఎంత ? అని రకుల్ ని ప్రశ్నించాడు . జీరో సైజ్ పై మీ ఒపినీయన్ అంటూ ప్రశ్నించడంతో జీరో సైజ్ ఆరోగ్యానికి మంచిది కాదు ,నేను జీరో సైజ్ కాదు నా సైజ్ సిక్స్ అంటూ కొంటెగా సమాధానం చెప్పింది రకుల్ .

sb+\dTkC!


p

e &   eTs \T>esTT... తె

లుగు ఇండస్ట్రీ ఇతర భాషల హీరోయిన్స్ పై ఆధారపడితే...మనకు పూర్తి బిన్నంగా కోలీవుడ్ ఇండస్ట్రీ మన తెలుగు అమ్మాయిలపై ఆధారపడుతోంది.. తెలుగుమ్మాయిలైన అంజలి, బిందు మాధవి, శ్రీదివ్య, ఆనంది వంటి భామలు తమిళ తంబీలను ఎంటర్ టైన్ చేస్తూ హీరోయిన్లుగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు.. అయితే వీరికి తోడుగా మరో తెలుగు అమ్మాయి కోలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది.. అంతకు ముందు ఆ తరువాత ,బందిపోటు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఇషాకు ..తమిళ దర్శకుడు మార్కస్ తను తెరకెక్కించబోయే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడట.ఈ మూవీ కాకుండా మరో సినిమాలో కూడా నటించే అవకాశాలు ఉన్నట్లు సన్నిహితులకు చెప్తుందట ఇషా..ఇక్కడ నుంచి వెళ్లిన తెలుగు భామలు..అక్కడ ఎక్స్ ఫోజింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా అందాలను ఆరబోస్తున్నారు..కోలీవుడ్ కు న్యూ ఎంట్రీ ఇస్తున్న ఈభామ వారిదారిలో నడుస్తుందో లేదో చూడాలి..

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 NOVEMBER 2015

టాలీవుడ్ P 3


+# ddt  d+w+> q wt

కం

చె చిత్రం అనుకున్నట్లుగానే సక్సెస్ కావడంతో సంతోషంగా ఉన్నాడు దర్శకులు క్రిష్ . ఇన్నాళ్ళు చేసిన చిత్రాలకు మంచి పేరు వచ్చినప్పటికీ పెద్దగా లాభాలు మాత్రం రాలేదు కానీ కంచె చిత్రానికి మంచి పేరుతో పాటు డబ్బులు కూడా వస్తుండటంతో చాలా హ్యాపీ గా ఉన్నాడు క్రిష్ . ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు

n]+{ y[q

n\T nsTH

ల్లు అర్జున్ దసరా పండగ సందర్భంగా అత్తారింటికి వెళ్ళాడు సతీ సమేతంగా . తెలంగాణ లో దసరా పండుగ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటారన్న విషయం తెలిసిందే . అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్గొండ జిల్లా లోని చింతపల్లి గ్రామం కావడంతో పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని చింతపల్లి గ్రామానికి వెళ్ళాడు అల్లు అర్జున్ . అయితే అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరో చింతపల్లి గ్రామానికి వచ్చాడన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా గ్రామస్తులు బన్నీ ని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు దాంతో వాళ్ళందరినీ అదుపు చేయడం చాలా కష్టమైందట స్నేహ రెడ్డి కుటుంబ సభ్యులకు . అయితే చింతపల్లి గ్రామస్థులు అభిమానంతో చూడటానికి వచ్చారు కాబట్టి వాళ్ళని డిజప్పాయింట్ చేయకుండా అందరితో ప్రేమగా మాట్లాడి సంతోషం లో ముంచెత్తాడు బన్నీ .

4 P టాలీవుడ్

సైతం క్రిష్ చేసిన కృషి ని అభినందిస్తున్నారు ,ఇక ఇటీవల చిరంజీవి కంచె యూనిట్ ని తన ఇంటికి ఆహ్వానించాడు ప్రత్యేక అభినందనలు అందజేయడానికి . చిరంజీవి కి కూడా కంచె చిత్రం బాగా నచ్చిందట . ఇక చిరంజీవి ప్రశంసలతో క్రిష్ మరింత భారీ బడ్జెట్ చిత్రాలకు సిద్దం కానున్నాడు .


V] VssTTH

nsTT |+{ n+Tq

es T DY నా eTVwt - |P] >H< \

f{ @+{ \Tk

చెల్లి నిహారిక హీరోయిన్ అయితే తప్పేంటి ? చిత్ర పరిశ్రమ మరీ బ్యాడ్ కాదు ,హీరోయిన్ లను డీ గ్రేడ్ చేయకండి అంటూ తన చెల్లి నిహారిక కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు మెగా వారసుడు వరుణ్ తేజ్ . మెగా హీరోలు పుష్కలంగా ఉన్న మెగా ఫ్యామిలీ నుండి నిహారిక హీరోయిన్ గా వస్తుండటం తో మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారట నిహారిక ని హీరోయిన్ ని చేయొద్దని, కానీ నాగబాబు మాత్రం మెగా ఫ్యాన్స్ కు నచ్చజెప్పి పంపించాడట . రేపు కంచె రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో పలు విషయాలపై తన మనోభావాలను పంచుకున్నాడు వరుణ్ . ముకుంద సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నా నటన తేలిపోయిందని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చో పెద్దనాన్న చిరంజీవి ,బాబాయ్ పవన్ లు చెప్పారని అన్నాడు వరుణ్ .

హేష్ బాబు -పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన రెండు చిత్రాలు ''పోకిరి '', ''బిజినెస్ మెన్ '' కూడా పెద్ద హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం పూరి చాలా కసరత్తులే చేస్తున్నాడు . డిఫరెంట్ టైటిల్స్ తో ఆకట్టుకునే పూరి తాజాగా మహేష్ తో చేసే సినిమా కోసం ఏ టైటిల్ ని అనుకుంటున్నాడో తెలుసా ......... ''ఎనిమీ ''. అవును ఎనిమీ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడు పూరి జగన్నాద్ . అయితే మహేష్ ఇప్పట్లో పూరి జగన్నాద్ కు డేట్స్ ఇచ్చే పరిస్థితి లో అయితే లేడు ఎందుకంటే ప్రస్తుతం బ్రహ్మోత్సవం చేస్తున్నాడు అది పూర్తయ్యాక మురుగదాస్ తో కలిసి చేయనున్నాడు అది పూర్తయ్యాకే పూరి జగన్నాద్ తో కలిసి చేయనున్నాడు .

టాలీవుడ్ P 5


|eTTK Vd qT&T

e& qTeT

ప్ర

ముఖ హాస్య నటుడు మాడా వెంకటేశ్వర్ రావు (65) ఇటీవల కన్నుమూసారు . గతకొంత కాలంగా శ్వాస కోశ వ్యాధితో బాధపడుతున్న కెరీర్ మొత్తంలో 300కు పైగా చిత్రాల్లో నటించాడు. ఆరోగ్యం బాగా క్షీణించడం తో ఆసుపత్రి కి తరలించారు కుటుంబ సభ్యులు . అయితే ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో ఇటీవల తుది శ్వాస విడిచాడు మాడా . ''చూడు పిన్నమ్మా పాడు పిల్లడు '' అనే పాటతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసాడు మాడా . తూర్పు గోదావరి జిల్లా దుళ్ళ గ్రామం లో 1950లో అక్టోబర్ 10న జన్మించిన మాడా కు ముగ్గురు కుమార్తెలు . మాడా వెంకటేశ్వర్ రావు అకాల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది .

మ అభిమాన హీరో పై తమ గుండె లోతుల్లో ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి సరికొత్త ప్రయత్నం చేసారు ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ప్రభాస్ ఫ్యాన్స్ . ప్రభాస్ పుట్టినరోజున వంద అడుగుల ఎత్తు 60అడుగుల పొడవు ఉన్న ప్రభాస్ చిత్ర పటాన్ని మదనపల్లి లోని ప్లే

6 P టాలీవుడ్

n_eq+ #Tq

|udt bH

గ్రౌండ్ లో వేసారు . ఈ చిత్ర పటానికి విశేష స్పందన వచ్చింది . ఇంత పెద్ద భారీ చిత్ర పటాన్ని వేయడంతో దాన్ని చూడటానికి అభిమానులతో పాటు ప్రజలు కూడా చూడటానికి తరలివచ్చారు . ఇటీవలే బాహుబలి తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్ బాహుబలి పార్ట్ 2కు రెడీ అవుతున్నాడు .


bsY - DY syT

eTM | nsTT+~

న్టీఆర్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయాలనీ ఎప్పటినుండో కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడు అది ఇన్నాళ్ళకు కుదిరింది . ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి వచ్చే ఏడాది సెట్ పైకి తీసుకెల్లనున్నారు . ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సుకుమార్ చిత్రం డిసెంబర్ నాటికీ పూర్తి అవుతుంది దాని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేసి దాని తర్వాత 2016లో వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తాడని తెలుస్తోంది . ఇటీవల వక్కంతం వంశీ చెప్పిన లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్ .

u\j T  eTqe&T

@+ |TH& \Tk

టీవల తిరుమల శ్రీవారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,బాలయ్య మనవడు దేవాన్ష్ అన్న ప్రాసన జరిగింది . భారీ ఎత్తున తిరుమల లో జరిగిన ఈ వేడుకలో బాలయ్య మనవడు దేవాన్ష్ ఏం పట్టుకున్నాడో తెలుసా .......... భగవద్గీత ! అవును బ్రాహ్మణి -లోకేష్ ల తనయుడు బాలయ్య మనవడు అయిన దేవాన్ష్ అన్న ప్రాసన కావడంతో కత్తి తో పాటు భగవద్గీత తదితర వస్తువులను దేవాన్ష్ ముందు ఉంచగా అతడు మాత్రం కత్తి పట్టకుండా భగవద్గీత ని పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇక బాలయ్య అయితే కత్తి పట్టలేదేన్ట్రా అంటూ గోల చేసాడట . దేవాన్ష్ భగవద్గీత పట్టుకోవడంతో నందమూరి - నారా వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది .

టాలీవుడ్ P 7


qe+sY   dr eTe+ $&T<\

స్‌.ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్‌ మూవీ 'సతీ తిమ్మమాంబ' సెన్సార్‌ మినహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సందర్భంగా చిత్ర నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ..'అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంతో ఏడెకరాల భూమిలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర గలిగిన తిమ్మమ్మ మర్రిమాను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు చేసుకుంది. ఈ మాను యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇటీవల నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్స్‌ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి నవంబర్‌ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..'' అని తెలిపారు. వ్యశ్రీ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రభాకర్‌, రంగనాధ్‌, చంద్రమోహన్‌, రాజశ్రీ, జూనియర్‌రేలంగి మొదలగు వారు ఇతర తారాగణం. చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్‌ హుస్సేన్,‌ పాటలు: బండారు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్‌: వినయ్‌, దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్‌. రామ్‌కుమార్‌, నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.

8 P టాలీవుడ్


న్టీఆర్ ని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ . శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన మైత్రి మూవీస్ సంస్థ తాజాగా ఎన్టీఆర్ తో జతకడుతోంది . కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఈరోజు ఉదయం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది . ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా చూపిస్తానని ,ఎన్టీఆర్ లో ఉన్న నటుడి కి ,అయన మాస్ ఇమేజ్ కు సరిపడే కథ ఇదని తప్పకుండా అందరినీ అలరించేలా రూపొందిస్తామని అన్నారు కొరటాల శివ . ఇక ఇందులో ఎన్టీఆర్ సరసన ఇద్దరు అందాల ముద్దుగుమ్మ లు నటించానున్నారట . జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రాన్ని ఆగష్టు 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

bsY 

leT+T&T jT{

#n_sqD+~+q Y  |eH

బ్రూ

స్ లీ ది ఫైటర్ చిత్రంతో సక్సెస్ అందుకున్న అబ్బాయి చరణ్ ని అభినందించాడు బాబాయ్ పవన్ కళ్యాణ్ . ఇటీవల హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ లో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే ,కాగా చరణ్ ఇటీవల బాబాయ్ ని కలవడానికి షూటింగ్ దగ్గరకు రావడంతో అబ్బాయ్ చరణ్

కు పుష్పగుచ్చం ఇచ్చి మరీ అభినందనలు తెలియజేసాడు పవన్ . చరణ్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ ని కలిసిన వాళ్ళలో ఉన్నాడు ,ఇటీవల రిలీజ్ అయిన బ్రూస్ లీ చిత్రానికి డివైడ్ టాక్ వస్తున్నప్పటికీ దసరా సెలవులు కావడం చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ తోడవడంతో భారీ వసూళ్లు సాధిస్తోంది బ్రూస్ లీ . దాంతో అబ్బాయ్ ని అభినందించాడు బాబాయ్ .

టాలీవుడ్ P 9


$j T s  \ yTq&\T l~e $yV eTe+

నా

10 P టాలీవుడ్

టి మేటి కథానాయిక, సీనియర్‌ దర్శకురాలు, గిన్నిస్‌రికార్డ్‌ హోల్డర్‌ ఘట్టమనేని విజయనిర్మల మేనకోడలు, శ్రీమతి పార్వతి దేవి, శ్రీ సమర్ధి రఘునాథ్ ల ద్వితీయ పుత్రిక చి.సౌ.శ్రీదివ్య వివాహం శ్రీమతి శాఖమూరి సరస్వతి, శ్రీ శాఖమూరి శరత్ ల పుత్రుడు ఎస్‌.సాయి నిఖిలేష్‌తో అక్టోబర్ 25 ఉదయం 11.19 గంటలకు హైదరాబాద్‌ హైటెక్స్లో ‌ సినీ,రాజకీయ ప్రముఖుల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.కె.చంద్రశేఖర్‌రావు ఈ వివాహ మహోత్సవానికి విశిష్ఠ అతిధిగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈనాడుఈటీవీ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీరావు, సూపర్‌స్టార్‌కృష్ణ, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, హీరో, నిర్మాత డా.ఎం.మోహన్‌బాబు, మేటి నాయిక, రాజకీయనేత జయప్రద, కాంగ్రెస్‌ నేత నాదెండ్ల భాస్కరరావు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, హీరో జగపతిబాబు, హీరో సుధీర్‌బాబు-ప్రియదర్శిని దంపతులు, హీరో సాయిధరమ్‌ తేజ్‌, అగ్ర నిర్మాతలు సి.కళ్యాణ్‌, అశ్వనిదత్‌, శ్యాంప్రసాద్‌ రెడ్డి, పొట్లూరి వరప్రసాద్‌ (పివిపి), సీనియర్‌ నిర్మాత రాఘవ, సీనియర్‌ దర్శకులు కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ, సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు, పద్మాలయ మల్లిఖార్జునరావు, సంగీతదర్శకుడు కోటి, నటులు శివకృష్ణ, నాగినీడు, నిర్మాత సురేష్‌కొండేటి, సీనియర్‌ నటీమణులు అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి తదితరులు ఈ వివాహ మహోత్సవంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకలో సహజనటి జయసుధ, సీనియర్‌ నరేష్‌ ఆద్యంతం అతిధులకు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు.


 d+^ <s&

eTVwt 

qwyTq

ప్ర

ముఖ తమిళ సంగీత దర్శకుడు హరీష్ జై రాజ్ తెలుగులో నేరుగా సంగీతం అందించిన చిత్రాలన్నీ పరాజయం పొందడంతో అతన్ని తెలుగు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పెట్టుకోవడానికి భయపడుతున్నారు అయితే తనకు అలాంటి భయం ఏది లేదంటూ తాజాగా తన చిత్రానికి హరీష్ జైరాజ్ ని ఎంపిక చేసారట ! ఈ వార్త విన్న మహేష్ ఫ్యాన్స్ కొంత భయపడుతున్నారు కారణం ఏమిటంటే హరీష్ జైరాజ్ తెలుగులో అందించిన అన్ని చిత్రాలు ఫ్లాప్ కాగా ఆ లిస్టు లో మహేష్ సైనికుడు చిత్రం కూడా ఉంది . దాంతో హరీష్ జైరాజ్ ని ఎందుకు ఎంపిక చేస్తున్నారు అంటూ వాదన చేస్తున్నారు . మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించే చిత్రానికి హరీష్ జైరాజ్ ని సంగీత దర్శకుడి గా ఎంపిక చేసారట అయితే ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు . అద్భుతమైన సంగీతం ని అందించే హరీష్ కు తెలుగులో నేరుగా హిట్ లేకపోవడంతో ఈ వాదన వస్తోంది . మరి మహేష్ మురుగదాస్ ల చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి .

jTTu  d+#\q+ dwdTq ఎ

bsY

న్టీఆర్ సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు ,ఇటీవల రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో టీజర్ యు ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది . యు ట్యూబ్ లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో 28లక్షల 82వేల వ్యూస్ తో దూసుకుపోయింది . ఈ టీజర్ లో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ గా ఉన్నాడు దానికి తోడూ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ఏమిటో ఓ శాంపిల్ చూపించాడు . ఎన్టీఆర్ గెటప్ ,సుకుమార్ టేకింగ్ ,భోగవల్లి ప్రసాద్ నిర్మాణం వెరసి నాన్నకు ప్రేమతో చిత్రం పై ఈ టీజర్ వల్ల మరిన్ని అంచనాలు పెరిగాయి . కేవలం 15గంటల్లోనే 6లక్షలకు పైగా వ్యూస్ తో దూసుకు పోతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు .

టాలీవుడ్ P 11


>|#+< Vs> u e jTwH kK+

ద్ద‌రు మ‌నుషులు ఎదురైన‌ప్పుడు పెదాల మీద చిరున‌వ్వుతో పాటు మ‌న‌సులోనుంచి వ‌చ్చే మాటే `సౌఖ్యంగా ఉన్నారా` అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులంద‌రూ సౌఖ్యంగా ఉండాల‌నుకునే వ్య‌క్తి క‌థ‌తో తెర‌కెక్కుతున్న సినిమా `సౌఖ్యం`. గోపీచంద్ హీరోగా భవ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న సినిమాకు `సౌఖ్యం` అనే పేరును ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు ఎ.ఎస్‌. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రెజీనా క‌థానాయిక‌. ఈ సినిమా గురించి నిర్మాత వి.ఆనంద్‌ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``త‌న ఇంట్లో ఉండే వారు మాత్ర‌మే కాదు, త‌న చుట్టుప‌క్క‌ల‌వాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాల‌నుకునే త‌త్వం మా హీరోది. అందుకోసం యాక్ష‌న్ బ‌రిలోకి దూక‌డానికైనా సిద్ధ‌మే. ఎంట‌ర్‌టైన్‌మెంట్ చేయ‌డానికైనా సిద్ధమే ‌ . న‌లుగురి సౌఖ్యం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉండే హీరో క‌థ‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ద‌శాబ్దం క్రితం ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి, గోపీచంద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `య‌జ్ఞం` ఆబాల‌గోపాలాన్ని ఎంత‌గా అల‌రించిందో తెలిసిందే. ఇప్పుడు అందుకు ఏమాత్రం త‌గ్గ‌కుండా సౌఖ్యం చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వారిద్ద‌రి కాంబినేష‌న్ అన‌గానే ప్రేక్ష‌కులు ఎదురుచూసే అంశాల‌న్నీ ఈ సినిమాలో ఉంటాయి. మ‌నుషుల మ‌ధ్య ఉంటే అనుబంధాలు, ఆప్యాయ‌తల ‌ ‌కు పెద్ద పీట వేసిన సినిమా ఇది. టాకీ పూర్త‌యింది. పాట‌లు మిగిలున్నాయి. ఈ నెల 26 నుంచి న‌వంబ‌ర్ 7 వ‌ర‌కు విదేశాల్లో మూడు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. అనూప్ రూబెన్స్ సంగీతంలో పాట‌లు చాలా హుషారుగా సాగుతాయి. విన్న ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉత్సాహం పొంగుతుంది. యూత్ త‌ప్ప‌కుండా ఫుట్ ట్యాపింగ్

12 P టాలీవుడ్

మ్యూజిక్ అని కితాబిస్తారు. స్విట్జ‌ర్లాండ్‌, ఆస్ట్రియాలో ర‌ఘు మాస్ట‌ర్ నేతృత్వంలో హీరో, హీరోయిన్‌పై మూడు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తాం. మిగిలిన రెండు పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తాం. అందులో ఒక‌టి ఐట‌మ్ సాంగ్‌, మ‌రొక‌టి హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌. దాంతో మొత్తం సినిమా పూర్త‌వుతుంది. మ‌రో వైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగానే డ‌బ్బింగ్ ప‌నుల‌ను పూర్తి చేశాం. క్రిస్‌మస్ ‌ కానుక‌గా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తాం`` అని అన్నారు. ద‌ర్శ‌కుడు ఎ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ ``సౌఖ్యంగా ఉన్నారా? అని ఎదుటివారు అడిగిన‌ప్పుడు మ‌న‌సు తెలియ‌కుండా ఒక‌ర‌క‌మైన ఆనందానికి లోన‌వుతుంది. ఎదుటివారి క్షేమ‌స‌మాచారాల‌ను క‌నుక్కోవ‌డం మ‌న‌కున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు త‌న వారి సౌఖ్యం కోసం, త‌న చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్ష‌నే చేశాడా? ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోనే కొన‌సాగాడా? అనేది ఈ సినిమాలో ప్ర‌ధానాంశం. గోపీచంద్‌, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అనూప్ మంచి సంగీతాన్నిచ్చారు. సినిమా చాలా బాగా వ‌స్తోంది. ప‌దేళ్ళ త‌ర్వాత గోపీచంద్‌తో మ‌ర‌లా ప‌నిచేస్తుంటే ఒక‌ర‌కమై ‌ న ఉత్సాహంగా ఉంది`` అని చెప్పారు. పీచంద్‌, రెజీనా జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో షావుకారు జాన‌కి, బ్ర‌హ్మానందం, పోసాని కృష్ణ ముర‌ళి, జ‌యప్ర ‌ ‌కాష్ రెడ్డి, జీవా, ర‌ఘుబాబు, కృష్ణ‌భగ ‌ ‌వాన్‌, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, ర‌ఘు, శివాజీరాజా, సురేఖావాణి, స‌త్య‌కృష్ణ‌, స‌త్యం రాజేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌థ‌, మాట‌లు; శ్రీ ధ‌ర్ సీపాన‌, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, గోపీ మోహ‌న్‌, కెమెరా: ప‌రీ సాద్ మూరెళ్ళ‌, ఎడిట‌ర్‌: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్‌, నిర్మాత‌: వి.ఆనంద్‌ప్ర‌సాద్‌.

గో


|udt

 H&+Tq

dT+<s+

ప్ర

భాస్ కత్తిలా ఉన్నాడని ,నాతో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడని ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తుతోంది అందాల సుందరాంగి మోడల్ మధు స్నేహ . ఎవరీ మధు స్నేహ అనే కదా మీ డౌట్ ? బాహుబలి చిత్రంలో ''మనోహరి '' అన్ పాటలో ముగ్గురు భామలతో ప్రభాస్ నటించిన విషయం తెలిసిందే . ఆ ముగ్గురిలో ఒక భామ ఈ మధు స్నేహ కావడం విశేషం . ముంబై లో మోడల్ గా ఓ ఊపు ఊపుతున్న ఈ భామ తెలుగులో ప్రభాస్ తో చేసే చాన్స్ రాగానే ఎగిరిగంతేసింది ,ఇక హైదరాబాద్ వచ్చి ప్రభాస్ ని చూడగానే దాదాపుగా పడి పోయిందట ! తెలుగులో మరిన్ని చాన్స్ లకోసం తహతహలాడుతున్న ఈ భామ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ,ప్రభాస్ నాకు చాలా క్లోజ్ అని అంటోంది .

టాలీవుడ్ P 13


 <+s+ qTeT ప్ర

ముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం (70) ఇటీవల కన్నుమూసారు . గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళ్ళు చిదంబరం రెండు నెలలుగా విశాఖ పట్టణం లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసారు . 1945 అక్టోబర్ 10న విశాఖ పట్టణం లో జన్మించిన చిదంబరం అసలు పేరు కొల్లూరి చిదంబరం కాగా ఆయన నటించిన మొదటి చిత్రం ''కళ్ళు '' కావడంతో అప్పటి నుండి కళ్ళు చిదంబరం గా పేరు పొందారు . కళ్ళు చిదంబరానికి ఇద్దరు కూతుర్లు ,ఇద్దరు కుమారులు . 300 చిత్రాలకు పైగా నటించిన కళ్ళు చిదంబరం మృతికి తెలుగు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు .

|eH - eTVwt \qT &s #jT&yT

lqT y &+ n ప

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సూపర్ స్టార్ మహేష్ బాబు లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం చేయడమే నా డ్రీం ప్రాజెక్ట్ అని అంటున్నాడు దర్శకులు శ్రీను వైట్ల . చరణ్ నటించిన ''బ్రూస్ లీ '' ది ఫైటర్ చిత్రంతో మళ్ళీ తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శ్రీను వైట్ల . ఆల్రెడీ మహేష్ తో రెండు సినిమాలు దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ని ఆగడు వంటి డిజాస్టర్ ని అందించిన శ్రీను వైట్ల ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రం చేయాలనీ ఉందని చెప్పాడు . మహేష్ తో చేసి ఉన్నాడు కాబట్టి సరైన కథ ఈ ఇద్దరికీ సరిపడేది దొరికితే తప్పకుండా వాళ్ళు అంగీకరిస్తారు అయితే పవన్ - మహేష్ లు నటించే చిత్రం అంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి కాబట్టి అందుకు తగ్గ కథ కుదరాలి దాన్ని పవన్ - మహేష్ లు నమ్మాలి అప్పుడే శ్రీను వైట్ల కల నెరవేరుతుంది .

14 P టాలీవుడ్


{sY +#Y #dq శం

|eH DY

కరాభరణం టీజర్ ని లాంచ్ చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . నిఖిల్ హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్నాడు కాగా ఇటీవల సర్దార్ గబ్బర్ సింగ్ సెట్లో శంకరాభరణం టీజర్ ని లాంచ్ చేసారు పవన్ . రచయిత కోన వెంకట్ పవన్ కు మంచి మిత్రుడన్న సంగతి తెలిసిందే దాంతో కోన అభ్యర్దన మేరకు టీజర్ ని లాంచ్ చేసి యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశాడు పవన్ . ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ ,కోన వెంకట్ ,దర్శకులు ఉదయ నందనవనం తదితరులు పాల్గొన్నారు .

u\j T   s#>=& |e<eT

ద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం ,నాలాంటి వాణ్ణి రెచ్చగొట్టడం నీ జీవితానికే ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నాడు డిక్టేటర్ బాలయ్య . నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా శ్రీవాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ''డిక్టేటర్ ''. ఇటీవల బాలయ్య నటించిన డిక్టేటర్ టీజర్ రిలీజ్ అయ్యింది , విజయదశమి రోజున రిలీజ్ కావాల్సిన టీజర్ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేసారు . ఇక ఈ టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ డైనమెట్ లా పేలిపోయింది . ''నీ హిస్టరీ లో బ్లడ్ ఉందేమో , నా బ్లడ్ కే హిస్టరీ ఉంది అంటూ చెప్పిన బాలయ్య డైలాగ్ సంచలనం సృష్టిస్తోంది . ఇక బాలయ్య కాస్త స్టైలిష్ గా కనిపిస్తున్నాడు ఈ చిత్రంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు .

టాలీవుడ్ P 15


21st



యశంకర్ చిరుగుల దర్శకత్వంలో వెంకట్ ,వింధ్య ,నవీన్ ప్రధాన పాత్రల్లో సన్ ఫ్లవర్ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ ఫిలిమ్స్ ,అవుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై యాదగిరి నిర్మిస్తున్న చిత్రం ''21 st ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది ,కాగా ఆడియో వేడుకను ప్రముఖ దర్శకులు ఎన్ శంకర్ ఆవిష్కరించి , చిత్ర ట్రైలర్ బాగుందని

జయశంకర్ ,యాదగిరి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని ఛిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశాడు . దర్శక నిర్మాతలు జయశంకర్ ,యాదగిరి లు మాట్లాడుతూ ''కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిందని ,అందరి సహకారం తో సినిమా చాలా బాగా వచ్చిందని అభిషేక్ అందించిన సంగీతం అందరినీ అలరించేలా రూపొందిందని తప్పకుండా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేసారు .

XuH uT de వి bs+u+

తె

లుగు వారి ప్రియతమ అందాల కథానాయకుడు .ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వెండితెర సోగ్గాడు , ఇప్పుడు ఆయన పేరు మీద ఒక చిత్రం రూపుదిద్దుకుంటుంది .. లగ్రామ్ పతాకం పై విప్లవ్ .కె నిర్మాణ దర్శకత్వంలో ,అలా ఎలా ,టైగర్ విజయాల తరువాత రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం " శోభన్ బాబు ".

సా

16 P టాలీవుడ్

జయ దశమి పండుగ పురష్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త పూజ కార్యక్రమాలు ఫిలింనగర్ ఆఫీస్ లో జరిగాయి ... న్ని వర్గాలను అలరించే ఒక రొమాంటిక్ కామెడీగా రుపొందబోతున్న చిత్రానికి విజయం కలగాలని ఆ యూనిట్ సభ్యులు పూజలందించారు.. హుల్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ రెండో వారంలో ఉంటుందని సంగీతం రమణగోగుల అందిస్తున్నారని దర్శక నిర్మాత విప్లవ్ తెలిపారు.

రా


 మ





నం

దమూరి కళ్యాణ్ రామ్ మేనల్లుడు దేవాన్ష్ ను ముద్దు చేస్తున్న ఫోటో ను తన అభిమానులకు షేర్ చేసాడు కళ్యాణ్ రామ్ ..అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో తన బోసి నవ్వులతో ప్రధాని మోదీని కట్టుకున్న నారా చంద్రబాబు ,బాలయ్య ముద్దుల మనువడు,నారాలోకేష్ తనయుడు దేవాన్స్ ను ఒళ్లో కూర్చోబెట్టుకున్న ఫోటో ను ఫేస్ బుక్ ,ట్విటర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు కళ్యాణ్ మ్ ..ఆ ఫోటో ను నందమూరి అభిమానులు షేర్లతో తమ అభిమానాన్నిచాటుకుంటున్నారు..

రా

హేష్ బాబు తనయుడు గౌతమ్ కు పారిస్ లోని ఈఫిల్ టవర్ ని చూపిస్తానని ప్రామిస్ చేసాడట అందుకే దసరా సెలువులు రాగానే పారిస్ కి గౌతమ్ తో పాటు భార్య నమ్రత ని అలాగే ముద్దుల కూతురు సితార ని కూడా తీసుకెళ్ళాడు . ప్రస్తుతం పారిస్ లో కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ . ఇటీవలే శ్రీమంతుడు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్నాడు అది పూర్తయ్యాక మురుగదాస్ దర్శకత్వంలో మరో సోషల్ మెసేజ్ ఉన్న చిత్రం చేయనున్నాడు . అయితే పారిస్ లో వివధ ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు సంతోషాన్ని పంచాడు మహేష్ .

yTq\T&T

<yH 

DY syT

టాలీవుడ్ P 17


$jT<X$T sEq bs+uyTq ~, Msu<yT\ #T{\usTT s>T\sY wO{+>

వ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ప్రేమకావాలి, లవ్‌లీ వంటి సూపర్‌హిట్‌చిత్రాలతో యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైన లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, అహనా పెళ్లంట, పూలరంగడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వీరభద్రమ్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ అక్టోబర్‌ 22 విజయదశమి రోజున ప్రారంభమైంది. సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''ఆది కెరీర్‌లో 'చుట్టాలబ్బాయి' ఒక డిఫరెంట్‌ మూవీ అవుతుంది. మలయాళ హీరోయిన్‌ నమిత ప్రమోద్‌ ఈ చిత్రంలో ఆది సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. విజయదశమి రోజున మా చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాం. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది'' అన్నారు. ర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్‌తలారి మాట్లాడుతూ - ''మా బేనర్స్లో ‌ ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'చుట్టాలబ్బాయి' రూపొందుతుంది. వీరభద్రమ్‌ చెప్పిన కథ

ఈ ని

18 P టాలీవుడ్

చాలా అద్భుతంగా వుంది. ప్రతి ఒక్కర్నీ ఎంటర్‌టైన్‌ చేసే విధంగా ఈ చిత్రం వుంటుంది. విజయదశమి రోజున మా 'చుట్టాలబ్బాయి' రెగ్యులర్‌షూటింగ్‌స్టార్ట్‌చేశాం. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌చెయ్యడానికి ప్లాన్‌చేస్తున్నాం'' అన్నారు. వ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, అభిమన్యు సింగ్‌, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, దువ్వాసి మోహన్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్:‌ గుణకర్‌, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.


REBEL STAR

 



బా

లీవుడ్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ కి గొప్ప చరిత్ర ఉంది అటువంటి గొప్ప సంస్థ నుండి ప్రభాస్ కు ఆహ్వానం అందింది తమ చిత్రంలో నటించమని కానీ ఆచాన్స్ ని తృణప్రాయంగా వదులుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . ఈ విషయాన్నీ ప్రభాస్ స్వయంగా వెల్లడించాడు . ధూమ్ సిరీస్ లలో వచ్చిన ధూమ్ ,ధూమ్ 2 ,ధూమ్ ౩ లు వరుసగా సంచలన విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే కాగా తాజాగా ఆ సంస్థ ధూమ్ 4 ని ప్లాన్ చేస్తోంది . ఆ చిత్రంలో విలన్ పాత్ర లో ప్రభాస్ ని నటించమని కోరారట కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి పూర్తయ్యే వరకు మరో సినిమా చేసేది లేదని ఆ చాన్స్ ని వదులుకున్నాడట. అదీ విషయం .


SAI KAARTHIK CITY CENTER NH-5, CHILAKALURIPET ANDHRA PRADESH-16 chpetcitycenter@gmail.com Mobile: 9848 361 546



జా

తీయ ఉత్తమ నటుడు ,లివింగ్ లెజెండ్ కమల్ హాసన్ నటించిన తెలుగు స్ట్రైట్ చిత్రం ''చీకటి రాజ్యం '' నవంబర్ 20 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . త్రిష ,ప్రకాష్ రాజ్ ,మధు శాలిని ,కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తమిళనాట ''తూంగ వనం" '' పేరుతో ఈనెల 10 న రిలీజ్ అవుతుండగా తెలుగులో మాత్రం పది రోజులు ఆలస్యంగా నవంబర్ 20 న రిలీజ్ కానుంది . సినిమా పై నమ్మకం ఉంది కాబట్టే పది రోజులు ఆలస్యంగా నైనా రిలీజ్ చేయడానికి ఎటువంటి భయం కలగడం లేదని ఎందుకంటే తప్పకుండా హిట్ అయ్యే సినిమా అని అన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిదని అన్నారు కమల్ హాసన్

 




బా

{e &   dH |eT\

లీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ,సోనమ్ కపూర్ జంటగా సూరజ్ బరజాత్య తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.ఈ సంస్థ నిర్మించే హిందీ సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంది . గతంలో సల్మాన్ హీరోగా రూపొందిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్ చిత్రాలు ప్రేమ పావురాలు, ప్రేమాలయం పేర్లతో తెలుగులో రిలీజ్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించాయి. ఆ తరువాత సల్మాన్ హీరోగా నటించిన సినిమాలేవి తెలుగు డబ్ కాలేదు. మళ్లీ ఇంత కాలం తరువాత అదే బ్యానర్ లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రాన్ని ప్రేమలీల పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.హిందీలో నవంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ చితాన్ని తెలుగులో కూడా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రం లో సల్మాన్ పాత్రకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్తున్నాడు . చాలా రోజుల తరవాత ప్రేమలీలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న కండలవీరుడు ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

టాలీవుడ్ P 23


eTdj

* సూ

పర్ స్ర్ టా రజనీ కాంత్ లేటు వయసులోనూ జెట్ స్పీడ్ తో దుసుకేళ్తున్నాడు . ఆయన నటిస్న తు ్న లేటెస్ట్ మూవీ కబాలి ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు వయసుకు మించిన హార్డ్ వర్క్ చేస్తున్నాడు . రజనీ కాంత్ సరసన రాధిక ఆప్టే నటిస్న తు ్న ఈచిత్రాన్ని అటక్ట త్తి, మద్రాస్ మూవీస్ ఫేం దర్శకుడు రంజిత్ తెరకెక్కిస్న తు ్న సంగతి తెలిసిందే. లింగ సినిమా తర్వాత కొద్దిపాటి విరామం తీసుకున్న రజనీ ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది . మొన్నటివరకూ చెన్నైలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం ప్రస్త తు ం మలేషియాకు షిఫ్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో రజనీపై యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రం త్వరగా పూర్తి చేసి రోబో 2ని పట్టాలెక్కించాలన్నది తలైవా ప్లాన్ చేస్న తు ్నట్లు సమాచారం .

  గుం

టూరు పార్లమెంట్ సభ్యుడు , మహేష్ బాబు బావ అయిన గల్లా జయదేవ్ కు వార్నింగ్ ఇచ్చారు బిజెపి లీడర్ సోము వీర్రాజు . ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి స్పెషల్ స్ట టే స్ గురించి మాట్లాడకపోవడం నన్ను బాధించింది అని గల్లా జయదేవ్ మీడియా సమావేశంలో పేర్కొనడంతో బిజెపి నాయకులకు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే వెంటనే గల్లా జయదేవ్ ప్రధానమంత్రి కి క్షమాపణ చెప్పాలి ,అలాగే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి అంటూ మండిపడ్డాడు ఎం ఎల్ సి సోము వీర్రాజు . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఉన్న అడ్డంకులను అన్నింటిని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఇటువంటి సమయంలో ప్రధాని ప్రసంగం పై అసంతృప్తి వ్యక్తం చేస్తారా ? వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అని మండిపడుతున్నాడు మరి మహేష్ బావ ఏం చేస్తాడో చూడాలి .

24 P టాలీవుడ్


esTDY  #d >s+> +<+Tq sT ము కుంద తర్వాత వరుణ్ తేజ్ నటించిన కంచె రీసెంట్ గా ప్రేక్షకుల ముందు కొచ్చింది . వరుణ్ తేజ్ ,క్రిష్ (రాధాకృష్ణ జాగరమూ ్ల డి) కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందుతుంది . పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా రూపొందిన ఈ మూవీ ని మెగాస్ర్ టా చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించాడు . అనంతరం మీడియాతో మాట్లాడుతూ ' కంచె

సినిమాను ప్రయోగాత్మక చిత్రం అనేకంటే, విజయవంతమైన ప్రయోగం అంటే సరిగ్గా సరిపోతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమకథతో పాటు అంతర్జాతీయ స్ధాయి యుద్ధ సన్నివేశాలను ఒకే సినిమాలో చూపించటంలో క్రిష్ మంచి విజయం సాధించాడని చిత్ర యూనిట్ ను అబినందించారు . అంతేకాకుండా ఓ తండ్రిగా వరుణ్ తేజ్ నటన చూసి గర్వంగా ఫీల్ అవుతున్నా అని అన్నారు .

esTDY d+<X

s+ &{ | ..! యం

గ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితిక శేరు లవ్ స్రీ టొ కి ఫుల్ స్ఫ్ టా పెట్టి .. ఒక ఇంటివారు కాబోతున్నారు . వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పెదలు ్ద .. డిసెంబర్ 7న వరుణ్, వితికల నిశ్చితార్థం ను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్న తు ్నట్లు తెలుస్తోంది . నిశ్చితార్థం రోజునే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేసే అవకాశం వుంది . రీల్ లైఫ్ లో పడ్డానండీ ప్రేమలో మరి’ చిత్రంలో జంటగా నటించిన వీరిదరు ్ద ఆ తర్వాత రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. ‘హ్యాపీ డేస్ ,కొత్త బంగారు లోకం’ చిత్రాలు మినహా వరుణ్ పెదగా ్ద సక్సెస్ లేవు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాలతో వితిక శేరు బిజీగా ఉంది.

టాలీవుడ్ P 25


చి

న్న హీరోగా ఉన్న నాని ఒక్కసారిగా ''భలే భలే మగాడివోయ్ '' చిత్రంతో పెద్ద రేంజ్ కు వెళ్ళిపోయాడు . మొన్నటి వరకు ఒక్క హిట్ ,ఒక్క హిట్ వస్తే చాలు చిన్న హిట్ లభించినా చాలు అని అనుకుంటున్న సమయంలో నాని దిమ్మ తిరిగే హిట్ కొట్టి అగ్ర పథాన దూసుకుపోతున్నారు . చాలామంది అగ్ర హీరోలకు అందని ద్రాక్ష పండు అయిన 50కోట్ల క్లబ్ ని సునాయాసంగా చేరుకొని దాన్ని దాటేసి 55కోట్ల కు చేరుకున్నాడు నాని . ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 4న రిలీజ్ అయిన భలే భలే మగాడివోయ్ చిత్రం 55కోట్ల వసూళ్ళ ని రాబట్టి సరికొత్త సంచలనం సృష్టించింది . దాదాపు 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 55కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించడం గొప్ప విషయమే మరి .

 26 P టాలీవుడ్




XsY esY |

కో

లీవుడ్ లో నడిగర్ సంఘం ఎలక్షన్స్ ఫలితాలు వచ్చి వారం రోజులవ్వుతున్న అక్కడి వాతావరణం చల్ల బడినట్టు లేదు . ఎన్నికలు ముగిసిన రెండోరోజు సీనియర్‌ నటి రాధిక ట్విట్టర్‌ ద్వారా విశాల్‌ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించగా, తాజాగా నటుడు సూర్య లేఖాస్త్రాన్ని సంధించి శరత్‌కుమార్‌ వర్గంపై పరోక్ష విమర్శలు చేశారు. నడిగర్‌ సంఘం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ సూర్య శుక్రవారం ఒక లేఖ రాశారు. అందులో బాధ్యతల్ని సాయంగా చెప్పుకోవద్దని హితవు పలుకుతూ. కమల్‌హాసన్‌, విశాల్‌, కార్తీ సినిమాలు కష్టాల్లో ఉంటే తాను ఎంతో సాయం చేశానని, అందుకు వారికి కృతజ్ఞత కూడా లేదని శరత్‌కుమార్‌ పలుమార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘మీ బాధ్యతల్ని సాయంగా చెప్పుకోకండి. సంఘం సమైక్యతకు కృషిచేయండి. సీనియర్లను గౌరవించండి. కులం, భాష, జాతి పేరుతో దూషణలకు తావివ్వద్దు’ అని సూర్య తన లేఖలో ప్రత్యేకంగా పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నూతన కార్యవర్గం వ్యవహరించాలని సూర్య సూచించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి జోక్యం చేసుకోని సూర్య ఇలా హఠాత్తుగా లేఖాస్త్రం సంధించడం ఇండస్ర్టీలో సంచలనం కలిగించింది. తన తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌పై శరత్‌కుమార్‌ వర్గం చేసిన వ్యాఖ్యలు కూడా సూర్య లేఖ కు కారణం అయ్యుండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో సూర్య కామెంట్స్ పై శరత్‌కుమార్‌వర్గం ఎలా స్పందిస్తుందోనని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ds

d+#\q yT+{

టాలీవుడ్ P 27


 ఐ శ్వర్య సినీ స్టూడియో బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో రాజ్ కిరణ్, ఆర్.పి.రావు నిర్మించిన చిత్రం 'పాకశాల'. విశ్వ, శ్రీనివాస్, కీర్తి, జగదీష్ రెడ్డి, అర్పిత, వైజాగ్ ప్రసాద్ ముఖ్య పాత్రధారులు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. శశాల’ సినిమా మొదటి కాపీ తయారైనప్పటి నుండి సెన్సార్ కార్యకరమాలను పూర్తి చేసుకోవడానికి అయిదునెలలు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ సెన్సార్ బోర్డు అభ్యంతరాల తెలియజేసినప్పుడు ట్రిబ్యునల్ స్థాయిలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశాం. ట్రిబ్యునల్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శ్రీమతి రేఖా ఖేత్రపాల్, మెంబర్స్ బీనా గుప్తా, శేఖర్ అయ్యర్, విపిన్ గోగియా, రీజనల్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డిగారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ తెలియజేస్తున్నాం. త్వరలోనే ఆడియో, సినిమా విదుదల చేయాడానికి ప్లాన్స్ చేస్తున్నాం అని నిర్మాతలు రాజ్ కిరణ్, ఆర్.పి.రావు తెలియజేశారు. గతంలో షార్ట్ ఫిలింస్ డైరెక్ట్ చేశాను. వంటగది నేపథ్యంలో జరిగే సినిమా ఇది. కంప్లీట్ గా కొత్తవాళ్ళతో చేసిన చిత్రమిది. సెన్సార్ జరిగే కార్యక్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొని సక్సెస్ అయ్యాం. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా అవుట్ పుట్ బాగా రావడంలో సపోర్ట్ చేశారు. సహకరించిన అందరికీ థాంక్స్ అని దర్శకుడు పణి కృష్ణ



‘పా

28 P టాలీవుడ్

సిరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కథా రచయితన గురుకిరణ్, శ్రీనివాస్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ: గురుకిరణ్, సంగీతం: శ్రవణ్ ఎస్.మిక్కీ, సాహిత్యం: హరీష్ చక్ర సతీష్, కెమెరా: భరద్వాజ్ దాసరి, నిర్మాతలు: రాజ్ కిరణ్, ఆర్.పి.రావు, దర్శకత్వం: పణి కృష్ణ సిరికి .


eT*dVq dwt <|qs+T

>eTdT\T

సూ

పర్ స్టార్ మహేష్ ను దత్తత గ్రామస్తులు కలుసుకున్నారు . వెండితెర పై 'శ్రీమంతుడు గా నటించిన మహేష్ బాబు .. రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడు అని నిరూపించు కున్నాడు . ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్నందుకు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి అధ్వర్యంలో గ్రామస్థులు సూపర్ స్టార్ మహేష్ ను కలిసి తమ ధన్యవాదాలను తెలియజేశారు. గ్రామ సర్పంచ్ ఎర్రోజు నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య సహా శివాజీ యూత్ సహా యువజన సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్న మహేష్ అందరినీ కలిసి వారితో అప్యాయంగా మాట్లాడారు. తమ గ్రామానికి మహేష్ ను రావాల్సిందిగా మహేష్ ను కోరారు. మహేష్ కూడా తప్పకుండా వస్తానని చెప్పారు.

|eTTK VdqT& esT&T eT

మిళనాట ప్రముఖ హాస్య నటుడి గా విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నటుడు వివేక్ పుత్రశోకంలో ఉన్నారు . వివేక్ తనయుడు 13 ఏళ్ల ప్రసన్న కుమార్ నిన్న ఉదయం చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు . గతకొంత కాలంగా బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న ప్రసన్న కుమార్ చికిత్స పొందుతున్నప్పటికి ఆరోగ్యం కుదుట పడక పోగా మరింత విషమించడంతో మృత్యువాత పడ్డాడు . చేతికందస్తున్న కొడుకు అర్దాంతరంగా తనువూ చాలించడంతో కుదేలయ్యాడు వివేక్ . ఈ హాస్య నటుడు తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు డబ్బింగ్ చిత్రాల వల్ల .

టాలీవుడ్ P 29


{ bsY |P] #dTq eTq+ (ysTTdt |t dH) లా స్‌ ఏంజిల్స్‌ టాకీస్‌, సంధ్యా సినీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మౌనం'. కిషన్‌ సాగర్‌.ఎస్‌ దర్శకత్వంలో మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం టాకీపార్ట్‌పూర్తి చేసుకుంది. సందర్భంగా చిత్ర నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి లు మాట్లాడుతూ..'' ఇదొక డిఫరెంట్‌ జోనర్‌లో సాగే సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ ఇది. 'మౌనం' సినిమాకి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ చాలా ఇంపార్టెంట్‌. దీనికి శ్రీలేఖ గారైతే న్యాయం చేస్తారని భావించి..ఆమెను అప్రోచ్‌ అయ్యాము. ఆమె ఈ సబ్జెక్ట్‌ విని ఎంతో ఎగ్జయిటీ ఫీలయ్యారు. అలాగే 'శివ' ఫేమ్‌ చిన్నా గారు ఓ అత్యద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మా డైరెక్టర్గా ‌ రు..గతంలో బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌గా నేషనల్‌ అవార్డ్సును పొందారు. ఆయన ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టాకీ పూర్తయింది. త్వరలో కొలంబోలో పాటల చిత్రీకరణ జరుపనున్నాం..'' అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బలుసు రామారావు, కథ: అనిల్‌ కె. నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్‌, సంధ్యారవి, దర్శకత్వం-డైరెక్టర్‌ఆఫ్‌ఫోటోగ్రఫీ: కిషన్‌సాగర్‌. ఎస్‌

30 P టాలీవుడ్


esTDY d+<X

= + |P se\T యం

గ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా శాన్వి క్రియేషన్స్ బ్యానర్ పై జి . హరికుమార్ రెడ్డి నిర్మాత గా ఎస్ ఎస్ రవి కుమార్ దర్శకత్వం లో ఓ కొత్త చిత్రం రూపొందుతుంది . విజయదశమి సందర్బంగా ఈ మూవీ హైదరాబాద్ సాన యాదిరెడ్డి స్టూడియో లో పూజ కార్యక్రమాలతో లాంచనంగా ప్రారంభ మైంది .ఈ సందర్బంగా రో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ :తన కెరిర్ లోనే ఇటువంటి కథ వినలేదని . దర్శకుడు ఎస్ ఎస్ రవి కుమార్ చెప్పిన కథ వినూత్నంగా వుంది .. అయన చెప్పిన విదానం బాగా నచ్చిందని అన్నారు .ఈ స్టొరీ విన్నాక సెట్స్ పైకి ఎప్పుడెప్పుడు వెళ్దామని ఎగ్జై టింగా ఉందన్నారు . ఈ సినిమా తన కెరిర్ కు హెల్ప్ అవుతుందిని తెలిపారు . టి నటులు :వరుణ్ సందేశ్ ,విజయ్ ,రవివర్మ ,రమ్య రెడ్డి ,జబర్దస్త్ రాము ,ఫిష్ వెంకట్ ,దివ్య ,శ్రీకాంత్ రాజు ,కోటేశ్వరరావు ,అశోక్,బ్యానర్ :శాన్వి క్రియేషన్స్ ప్రొడక్షన్ ప్లానర్ :ఏ వెంకట్ నాయుడు మ్యూజిక్ :ముస్తఫా ,పాటలు : అనంత శ్రీరామ్ ,మాటలు : మోహన్ చందా: ఎడిటింగ్ :నంద మూరి హరి : స్టంట్ : నాగరాజు ,ఆర్ట్ :రామకృష్ణ సమర్పణ :శోబా రాణి , నిర్మాత :జి . హరికుమార్ రెడ్డి, కథ ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :ఎస్ ఎస్ రవి కుమార్,​

హీ

టాలీవుడ్ P 31


eTT |+& eT &T\T ed #dTq

sH

ర్రర్ చిత్రాలకు బాగా సింక్ అయ్యాడు రాఘవ లారెన్స్ . ముని చిత్రం హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా కాంచన చేసాడు అది కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో దానికి సీక్వెల్ గా ఇటీవల గంగ చిత్రం చేసాడు అది కూడా బంపర్ హిట్ అయ్యింది దాంతో

32 P టాలీవుడ్

నాలుగో సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నాడు ఇక వరుసగా మూడు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో నాలుగో చిత్రానికి ముక్కు పిండి మరీ ఎక్కువ సొమ్ములు వసూల్ చేస్తున్నాడు రాఘవ లారెన్స్ . ఇక నిర్మాతలు కూడా వరుస సక్సెస్ లు ఉన్నాయని తెలిసి లారెన్స్ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు . తమిళంలో చేస్తున్న చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయడం వల్ల బాగానే లబ్దిపొందుతున్నాడులారెన్స్ . తాజా హర్రర్ చిత్రానికి ''నాగ '' అనే టైటిల్ తమిళం లో పెట్టగా తెలుగులో ''భైరవ '' అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నారట . ఇక తెలుగు వెర్షన్ కు రేటు ఎంతో తెలుసా 20 కోట్లట!


uV Q *2 s |udt #d~ n<q

బా

హుబలి 2 షూటింగ్ ముగించుకున్న తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏదో తెలుసా ......... రన్ రాజా రన్ లాంటి విభిన్న చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్ . అయితే ఈ సినిమా ఎప్పుడో చేయాల్సి ఉంది కానీ ఇంకా పక్కాగా స్క్రిప్ట్ కాకపోవడం ఒక కారణం అయితే బాహుబలి షూటింగ్ తర్వాత ప్రమోషన్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం కూడా మరో కారణం . ఇక ఈలోగా బాహుబలి 2 షూటింగ్ సమయం కూడా దగ్గర పడటం తో దాన్ని కంప్లీట్ చేసాక ఈ సినిమా చేద్దామని చెప్పాడట ప్రభాస్ . సుజిత్ ప్రస్తుతం ప్రభాస్ తో చేయబోయే స్క్రిప్ట్ కి మరిన్ని హంగులను చేర్చి తుది మెరుగులు దిద్దుతున్నాడట .



వి

జయ్ దేవరకొండ - రీతు వర్మ జంటగా తరుణ్ భాస్కర్ ని దర్శకుడి గా పరిచయం చేస్తూ ధర్మ పద క్రియేషన్స్ -బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై రాజ్ కందుకూరి , శ్రీ యస్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ''పెళ్లి చూపులు ''. ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ముహూర్తపు షాట్ తో ప్రారంభమయ్యింది . ఈ ప్రారంభోత్సవ వేడుకలలో అగ్ర నిర్మాత సురేష్ బాబు ,అశోక్ కుమార్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేసారు . ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ ''తరుణ్ భాస్కర్ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు అతడు చెప్పిన కథ ఒకే సిట్టింగ్ లో నచ్చడంతో

నా మిత్రుడు యస్ రంగినేని తో కలిసి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాం. ఇక ఈ చిత్ర కథ దగ్గుబాటి సురేష్ బాబు కూడా విని తప్పకుండా చేయండని పెద్ద హిట్ అవుతుందని చెప్పారని హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవుతాడని అలాగే దర్శకులు తరుణ్ భాస్కర్ కూడా అగ్ర దర్శకులు అవుతాడని ధీమా వ్యక్తం చేసాడు . ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రం నవంబర్ 16 వరకు షూటింగ్ జరుగుతుందని ,నవంబర్ 20 నుండి రెండో షెడ్యూల్ ,డిసెంబర్ లో మూడో షెడ్యూల్ ఉంటుందని మొత్తానికి మూడు షెడ్యూల్లలో పెళ్లి చూపులు పూర్తవుతాయని అన్నారు దర్శకులు తరుణ్ భాస్కర్ . ఇంకా ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ,హీరోయిన్ రీతు వర్మ తదితరులు పాల్గొన్నారు .

టాలీవుడ్ P 33


y&  T+ dyT+> *dq

sXKsY

34 P టాలీవుడ్

యాం

గ్రీ యంగ్ మాన్ పాత్రలకు పెట్టింది పేరు డా.రాజశేఖర్ అన్న విషయం తెలిసిందే కాగా గతకొంత కాలంగా హిట్ లేక చేతిలో ఉన్న సినిమాలు రిలీజ్ కాక సతమతం అవుతున్న రాజశేఖర్ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన కుటుంబసమేతంగా కలిసాడు రాజశేఖర్ . ఆమధ్య రాజశేఖర్ దంపతులు బిజెపి లో చేరిన విషయం తెలిసిందే . దాంతో మోడీ ని కలవడానికి ఢిల్లీ వెళ్లారు ,ఈ సమావేశంలో రాజశేఖర్ తో పాటు భార్య జీవిత ,ఇద్దరు కూతుర్లు శివాని ,శివాత్మిక లు కూడా ఉన్నారు . మోడీ ని శాలువాని ప్రజెంట్ చేసారు రాజశేఖర్ కూతుర్లు .


esTDY C |

|X+d\ es+

మె

గా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన ''కంచె '' చిత్రానికి అందులో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించిన వరుణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది . మొన్నటికి మొన్న చిరంజీవి కంచె యూనిట్ ని తన ఇంటికి పిలిపించుకొని వరుణ్ పై ప్రశంసల వర్షం కురిపించగా తాజాగా దర్శకులు దాసరి నారాయణరావు ,వివివినాయక్ లు వరుణ్ తేజ్ ప్రదర్శించిన నటన ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్ద దాసరి నుండి ప్రశంసలు దక్కడంతో వరుణ్ చాలా హ్యాపీ గా ఉన్నాడు . రెండో ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కిన కంచె చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల కనకవర్షం కూడా లభిస్తోంది . క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

{ \ d+#\q+ dwdTq

nqTw

అం

దాల బొమ్మాలి అనుష్క ని కోటి మంది ఫాలో అవుతున్నారు పేస్ బుక్ అనే సోషల్ మీడియాలో . కోటి మంది ఫాలోయర్స్ సాధించి అనుష్క సంచలనం సృష్టించింది . ఈ సంవత్సరం అనుష్క కు బాగా కలిసి వచ్చింది ,ఎందుకంటే బాహుబలి రూపంలో భారీ విజయాన్ని అందుకున్న అనుష్క కు బ్యాక్ టు బ్యాక్ రుద్రమదేవి కూడా హిట్ కావడంతో సంతోషంగా ఉంది . తాజాగా ''సైజ్ జీరో '' చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది అనుష్క . పేస్ బుక్ లో కోటి మంది ఫాలోయర్స్ ని దాటిన శుభ సందర్భంలో అందరికీ కృతఙ్ఞతలు చెబుతోంది అనుష్క .

టాలీవుడ్ P 35


s>

nH b$T Vs

క్కినేని ఫ్యామిలీ నుంచి నిర్మాతలు రావటం కొత్తేమికాకపోయినా..ఆ ఫ్యామిలీ నుంచి సినీపరిశ్రమకు మరో వ్యక్తి నిర్మాతగా పరిచయం అవ్వబోతున్నాడు...ఆయనెవరో కాదు..హీరో సుమంత్. ప్రేమకథ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ..సుమారు 20 కి పైగా చిత్రాలల్లో నటించాడు. అయితే సత్యం.గౌరి ,గోల్కోండ హైస్కూల్ మినహా మిగతావన్ని సుమంత్ ను నిరాశ పరిచాయి.ఎమో గుర్రం ఎగురావచ్చు మూవీ తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు..ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ,ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు..అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగేశ్వరరావు ,వెంకట్ ,నాగార్జునలు నిర్మాతలుగా మంచి విజయాలను అందుకున్నారు..అదే దారిలో నాగార్జున సోదరి నాగసుశీల ,సుమంత్ సోదరి సుప్రియ నడుస్తున్నారు..వీరి బాటలోకి సుమంత్ రావాలనే ప్లాన్ చేస్తున్నాడు.మరి సుమంత్ నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో వేచి చూడాలి...

w, $jTs\ +_HwH  సూ

36 P టాలీవుడ్

ll

పర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ప్రధాన పాత్రధారులుగా ముప్పలేని శివ తెరకెక్కిస్తున్న మూవీ 'శ్రీ శ్రీ '. ఈమూవీలో సీనియర్ నరేష్ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు..కృష్ణ ,విజయనిర్మల కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత శ్రీ శ్రీ మూవీ రూపోందుతుంది.ఈ ఏడాదితో కృష్ణ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 యేళ్లు అవుతోంది..ఇన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ ,విజయనిర్మల ప్రధానపాత్రలు రూపోందుతున్న ఈమూవీ పై సూపర్ స్టార్ అభిమానుల్లో ఆసక్తి నెలకోంది...తాజ్ మహల్ ,రాజా , సంక్రాంతి సూపర్ హిట్ చిత్రాలను తీసిన దర్శకుడు ముప్పలేని శివ దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ శ్రీ శ్రీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా పగ ఎప్పటికి పాతది కాదు అన్న కథాంశంతో రూపోందబోతున్న ఈచిత్రం నవంబర్ లో రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.


cs T  qT T |&dq s

ప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఒకటే పేరు వినబడుతోంది..అంతేకాదు చోటా హీరో నుంచి బడా హీరో వరకు ఆమె తో నటించాలని తెగ ఆశపడుతున్నారు కూడా..ఇంతకీ ఎవరనే కదా మీ సందేహాం...అదేనండి మన హాట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ . వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ గ్లామర్ డాల్ ..అంతే స్పీడ్ తో టాలీవుడ్ లో దూసుకెళ్తుంది..రకుల్ అందాలకు మన తెలుగు హీరోలే కాదు..బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ప్లాటయ్యాడు...అదేలా అంటే షారుఖ్ ,రకుల్ దిగిన ఫోటో చూస్తే..ఈజీగా అర్థం అవుతోంది..అంతేకాకుండా ఈ స్టిల్ సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది..రీసెంట్ గా రకుల్ ,రామ్ చరణ్ తో నటించిన బ్రూస్ లీ సెట్ కు షారుక్ వచ్చాడు..అక్కడ చరణ్ , రకుల్ చేసే డ్యాన్స్ చూసి తెగ ఎంజాయ్ కూడా చేశాడట షారుఖ్.ఆ సమయంలో షారుక్ తో కలిసి ఫోటో దిగడంపై ఆనందం వ్యక్తం చేస్తూ రకుల్ సోషల్ మీడియా ద్వారా ఫోటో షేర్ చేసింది..ఆ ఫోటో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్ర్రీగా మారిపోయింది.

  

మొ

త్తానికి సస్పెన్స్ ముగిసింది అఖిల్ సినిమా నవంబర్ 11 న వస్తుండటంతో మిగతా సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు . ఇక రవితేజ బెంగాల్ టైగర్ విషయానికి వస్తే నవంబర్ 27 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . కిక్ 2 వంటి డిజాస్టర్ తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఇది రవితేజ కు తప్పనిసరిగా హిట్ కావలసిందే అని రవితేజ ఫ్యాన్స్ తో పాటు రవితేజ సన్నిహితులు కూడా కోరుకుంటున్నారు . రవితేజ సరసన తమన్నా ,రాశి ఖన్నా నటించగా సంపత్ నంది దర్శకత్వం వహించాడు.

టాలీవుడ్ P 37


s u* 

XssjYT

సూ

పర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి ' మూవీ పై రోజుకో కొత్త వార్త వెలుగుచూస్తోంది.. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందుతున్న ఈ మూవీలో రజనీ సరసన రాధిక ఆప్టేను ఖరారు చేయగా.. రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ ను ఓ ప్రత్యేక పాత్రకోసం సంప్రదించారట..కథని కీలకమైన మలుపు తిప్పే క్యారెక్టర్ లో ఐశ్వర్య ఐతేనే బాగుంటుందని భావించి...రజనీకాంత్ స్వయంగా ఐశ్వర్యరాయ్ ను సంప్రదించినట్లు సమాచారం. గతంలో రోబో మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే..రోబో తర్వాత సరైన సక్సెస్ లేకపోవడంతో రజనీ ఈమూవీ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు..రజనీ డ్యుయల్ రోల్ నటిస్తున్న ఈచిత్రాన్ని రంజిత్ తెరకెక్కిస్తుండగా కలైపులి థాను నిర్మిస్తున్నాడు..ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్‌గా.. మలేసియన్ అండర్ కాప్‌గా రెండు విభన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమూవీ మలేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది.





టాలీవుడ్ P 38

ప్ర

ముఖు హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు (69) కన్నుమూశారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా చెవికి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వ్యాధి తీవ్రత ముదిరి... మెదడుకు పాకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకముందు గుండె, షుగర్ సంబందిత సమస్యలతో భాదపడుతున్న ఆయనకు చెవి ఇన్పెక్షన్ తోడైంది.... ఇటీవలఎల్లారెడ్డి గూడాలో నివాసం ఉంటున్న కొండవలస తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు..వెంటనే కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు ప్రకటించారు.కొండవలస మృతి పట్ల చిత్రపరిశ్రమ దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది..మంగళవారం మధ్యాహ్నాం అంత్యక్రియలు జరుగనున్నాయి..వంశీ దర్శకత్వంలో 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు' లోని సినిమాలో 'నేనొప్పుకోను.. అయితే ఓకే' అన్న డైలాగ్ తో పాపులర్ అయిన కొండవలస దాదాపు 300 చిత్రాల్లో నటించి.. హాస్య'కొండ ' గా నిలిచారు..నాటకరంగలో వెయ్యికి పైగా నాటకాలు వేశారు..ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆయనకు నాటకాల్లో రెండు నందులు కూడా లభించాయి. సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్టు ట్రస్టులో ఉద్యోగిగా పనిచేశారు. కొండవలస 1946,ఆగస్టు 10,న శ్రీకాకుళం జిల్లా లో ఆయన జన్మించారు..నాటకాలు వేస్తూ వచ్చిన ఆయనకు లేటు వయసులో సినిమా అవకాశాలు వచ్చాయి.. మూడువందల చిత్రాల్లో నటించిన ఆయనకు ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు.. కబడ్డీ, కబడ్డీఎవడి గోల వాడిదే ,రాధాగోపాలం ,కాంచనమాల కేబుల్‌టీవీ, రాఖీ ,అందాల రాముడు , శ్రీరామచంద్రులు,అదుర్స్,బెండఅప్పారావు ఆర్ ఎంపి,సరదాగా కాసేపు, గోపిక గోదావరి చిత్రాలు మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టాయి.. రేలంగి దర్శకత్వంలో వచ్చిన ఎలుకా మజాకా కొండవలస చివరి చిత్రంగా తెలుస్తోంది..


|#dTq

|V { b{ wO{ హీ

రోయిన్ తాప్సీ ఓ ఫోటో షూట్ లో సెక్సీ ఫోజులతో రెచ్చిపోయింది..అందం, అభినయం, టాలెంట్ ఉన్నా అదృష్లం మాత్రం ఆమెకు అందనంత దూరంగా ఉంటోంది..దీంతో ఈ బ్యూటి హాట్ ఫోటో షూట్ కి సై అన్నట్లుంది.....తాప్సీకి సరైన సక్సెస్ లు లేక రాను రాను సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో..ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షించడానికే అందాలను ఆరబోసినట్లు ఇట్టే అర్థమౌవుతోంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన ఐదేళ్లలలో సుమారు 20 సినిమాలల్లో నటించిన కాంచన 2 తప్ప ఆమె కెరీర్ లో చెప్పుకోతగ్గ హిట్ లేదు.. తాజాగా జిక్యూ మేగజైన్ లో పలు కార్పొరేట్ బ్రాండ్లను ప్రచారం చేయడంలో భాగంగా తాప్సీ చేసిన హాట్ ఫోట్ షూట్ హీట్ పుట్టిస్తోంది



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.